ఏపీ రాజధాని అమరావతిని శాశ్వితం చేస్తూ పార్లమెంట్ బిల్లును ఆమోదించిన సంగతి తెలిసిందే. ఆ ఆనందకర సమయంలో గతంలో అమరావతి కోసం పోరాడిన అంశాల్ని.. రాజధానిగా అమరావతిని వ్యతిరేకించిన అప్పటి వైసీపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు గురించిన చర్చ మరోసారి మొదలైంది. అన్నింటికి మించి అమరావతిని శాశ్విత రాజధానిగా ఆమోదం లభించిన నేపథ్యంలో ఏపీ శాసన మండలి ఛైర్మన్ గా వ్యవహరించిన మహమ్మద్ అహ్మద్ షరీఫ్ మాట్లాడుతూ సంచలన అంశాల్ని వెల్లడించారు.
నాటి జగన్ ప్రభుత్వం మూడు రాజధానులకు అనుకూలంగా ఒక బిల్లును ఏపీ అసెంబ్లీలో ఆమోదించిన తర్వాత శాసన మండలి ఆమోదానికి తీసుకొచ్చారు. అయితే.. మూడు రాజధానుల బిల్లుకు ఆయన ససేమిరా అనటం..అమరావతికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవటానికి ఆయన ఒప్పుకోలేదు. ఈ సందర్భంగా నాటి మంత్రులు.. వైసీపీ నేతలు పలువురు ఆయనపై తీవ్ర ఒత్తిళ్లు తీసుకొచ్చారు. అయినప్పటికి మండలి ఛైర్మన్ మాత్రం నో అంటే నో అన్న పరిస్థితి. ఈ సందర్భంగాఆయన చుట్టుమూగి ఆయనపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు.
ఈ సందర్భంగా తన గుండెలపై ఓ మంత్రి చేయి వేసి కొట్టారంటూ నాటి దురద్రష్టకర పరిణామాల్ని గుర్తు చేసుకున్నారు. దీంతో.. ఆయనపై చేయి వేసిన మంత్రి ఎవరు? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. అయితే.. ఈ ఘటన జరిగిన సమయంలో ప్రముఖ మీడియా సంస్థలు.. టీవీ చానళ్లు ఈ దారుణ సంఘటన వివరాల్ని కవర్ చేయటం కనిపిస్తుంది. అంతేకాదు.. ఇంగ్లిషు దినపత్రికలు సైతం ఈ అంశాన్ని భారీగా హైలెట్ చేయటం.. జాతీయ స్థాయిలో ఈ అంశంపై చర్చ జరిగింది.
ఇంతకూ నాటి మండలి మాజీ ఛైర్మన్ గుండెలపై చేయి వేసిందెవరు? అన్న వివరాల్లోకి వెళితే.. అప్పట్లో పలు తెలుగు.. ఇంగ్లిషు మీడియా సంస్థలు నాటి దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.. మరో మంత్రికొడాలి నానిలు మండలిఛైర్మన్ వైపు దూసుకెళ్లటం.. మైకులు విరగొట్టటం..మండలి ఛైర్మన్ షరీఫ్ ను తెగ ఇబ్బందికి గురి చేశారు.
మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మీద పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. వైసీపీ సభ్యుల ప్రవర్తనపై అప్పట్లో టీడీపీ తీవ్రంగా మండిపడింది. ఒక ఉన్నత రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తిపై దాడికి ప్రయత్నిస్తారా? ఇది ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు అంటూ చేసిన వ్యాఖ్య అప్పట్లో పెను దుమారం రేపింది. తాజాగా తనకు ఎదురైన చేదు అనుభవాల్ని గుర్తు చేసుకుంటే.. తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెను దుమారాన్ని రేపుతున్నాయి.
This post was last modified on April 3, 2026 9:27 am
Rare & Unexpected:Probably for the first time, PM #Modi Addresses Nation Through a Selfie Video,…
అగ్రశ్రేణి కథానాయకులు.. చిన్న, మిడ్ రేంజ్ సినిమాలు చేసే దర్శకులతో.. కొత్తవాళ్లు, పెద్దగా అనుభవం లేని డైరెక్టర్లతో పని చేయడం…
రాష్ట్రంలో ఓటు లేని వారికి ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలను ఎలా అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఎవరి…
సంక్రాంతి సినిమాల తర్వాత నాలుగైదు నెలల పాటు బాక్సాఫీస్ దగ్గర పెద్ద స్లంప్ చూసింది టాలీవుడ్. కానీ గత నెలలో…
ఏదైనా రీమేక్ సినిమాకు వచ్చే అతి పెద్ద సమస్య పోలిక. ఒరిజినల్ కంటే మెరుగ్గా తీశారా, నటీనటుల్లో ఎవరు బాగా…
ప్రముఖ తెలుగు నిర్మాత, నటుడు బండ్ల గణేష్కు సంబంధించిన ఆస్తి వివాదం ఇటీవల వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. గణేష్కు చెందిన…