Political News

మండలి ఛైర్మన్ పై చేయి చేసుకున్న మంత్రి అతనేనా?

ఏపీ రాజధాని అమరావతిని శాశ్వితం చేస్తూ పార్లమెంట్ బిల్లును ఆమోదించిన సంగతి తెలిసిందే. ఆ ఆనందకర సమయంలో గతంలో అమరావతి కోసం పోరాడిన అంశాల్ని.. రాజధానిగా అమరావతిని వ్యతిరేకించిన అప్పటి వైసీపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు గురించిన చర్చ మరోసారి మొదలైంది. అన్నింటికి మించి అమరావతిని శాశ్విత రాజధానిగా ఆమోదం లభించిన నేపథ్యంలో ఏపీ శాసన మండలి ఛైర్మన్ గా వ్యవహరించిన మహమ్మద్ అహ్మద్ షరీఫ్ మాట్లాడుతూ సంచలన అంశాల్ని వెల్లడించారు.

నాటి జగన్ ప్రభుత్వం మూడు రాజధానులకు అనుకూలంగా ఒక బిల్లును ఏపీ అసెంబ్లీలో ఆమోదించిన తర్వాత శాసన మండలి ఆమోదానికి తీసుకొచ్చారు. అయితే.. మూడు రాజధానుల బిల్లుకు ఆయన ససేమిరా అనటం..అమరావతికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవటానికి ఆయన ఒప్పుకోలేదు. ఈ సందర్భంగా నాటి మంత్రులు.. వైసీపీ నేతలు పలువురు ఆయనపై తీవ్ర ఒత్తిళ్లు తీసుకొచ్చారు. అయినప్పటికి మండలి ఛైర్మన్ మాత్రం నో అంటే నో అన్న పరిస్థితి. ఈ సందర్భంగాఆయన చుట్టుమూగి ఆయనపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు.

ఈ సందర్భంగా తన గుండెలపై ఓ మంత్రి చేయి వేసి కొట్టారంటూ నాటి దురద్రష్టకర పరిణామాల్ని గుర్తు చేసుకున్నారు. దీంతో.. ఆయనపై చేయి వేసిన మంత్రి ఎవరు? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. అయితే.. ఈ ఘటన జరిగిన సమయంలో ప్రముఖ మీడియా సంస్థలు.. టీవీ చానళ్లు ఈ దారుణ సంఘటన వివరాల్ని కవర్ చేయటం కనిపిస్తుంది. అంతేకాదు.. ఇంగ్లిషు దినపత్రికలు సైతం ఈ అంశాన్ని భారీగా హైలెట్ చేయటం.. జాతీయ స్థాయిలో ఈ అంశంపై చర్చ జరిగింది.

ఇంతకూ నాటి మండలి మాజీ ఛైర్మన్ గుండెలపై చేయి వేసిందెవరు? అన్న వివరాల్లోకి వెళితే.. అప్పట్లో పలు తెలుగు.. ఇంగ్లిషు మీడియా సంస్థలు నాటి దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.. మరో మంత్రికొడాలి నానిలు మండలిఛైర్మన్ వైపు దూసుకెళ్లటం.. మైకులు విరగొట్టటం..మండలి ఛైర్మన్ షరీఫ్ ను తెగ ఇబ్బందికి గురి చేశారు.

మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మీద పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. వైసీపీ సభ్యుల ప్రవర్తనపై అప్పట్లో టీడీపీ తీవ్రంగా మండిపడింది. ఒక ఉన్నత రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తిపై దాడికి ప్రయత్నిస్తారా? ఇది ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు అంటూ చేసిన వ్యాఖ్య అప్పట్లో పెను దుమారం రేపింది. తాజాగా తనకు ఎదురైన చేదు అనుభవాల్ని గుర్తు చేసుకుంటే.. తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెను దుమారాన్ని రేపుతున్నాయి.

This post was last modified on April 3, 2026 9:27 am

Share

Recent Posts

విజయ్, త్రిషల గోల మళ్లీ మొదలు!

తమిళనాడు సీఎం విజయ్, సినీ నటి త్రిషల మధ్య రిలేషన్ షిప్ గురించి రకరకాల ఊహాగానాలు ప్రచారంలో ఉన్న సంగతి…

24 minutes ago

ఓజి విలన్ రొట్టె విరిగి నేతిలో పడింది

బాలీవుడ్ ఖాన్ల ప్రభంజనంలో తనకంటూ ఒక ఉనికిని దక్కించుకున్న హీరో ఇమ్రాన్ హష్మీ. ఒకప్పుడు మంచి హిట్లతో ముద్దుల వీరుడిగా…

46 minutes ago

గుంటూరుపై వైసీపీ పూర్తి పట్టు కోల్పోయినట్టేనా?

గుంటూరులోని తూర్పు, ప‌డ‌మ‌ర నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ త‌న ప్ర‌భావం, ప్రాభవం కూడా కోల్పోయింది. రెండున్న‌రేళ్ల కాలంలో పార్టీ ఘోరంగా దెబ్బ‌తింద‌న్న…

56 minutes ago

‘ఫ్రీ బస్సు’లో ఎన్డీఏకు చేరువవుతున్న మహిళలు

ఏపీలోని నిర్దేశిత ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించేందుకు ‘స్త్రీ శక్తి’ పథకాన్ని ఎన్డీఏ ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తోన్న…

1 hour ago

అభిమాని ఆఖరిచూపుకు స్టార్ హీరో ఎందుకు వెళ్లలేదు

'టాక్సిక్' రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్న కన్నడ స్టార్ యశ్ వరుసగా ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నాడు. ఇక రీసెంట్ ఒక…

4 hours ago

కెన్యా విషయంలో జాగ్రత్తలు అవసరం

కొరియన్ కనకరాజు సీక్వెల్ కి ప్లానింగ్ జరుగుతోంది. కెన్యా కనకరాజు పేరుతో స్క్రిప్ట్ డిస్కషన్లు మొదలయ్యాయని సమాచారం. అంటే కొరియా…

4 hours ago