Political News

దళిత క్రైస్తవుల విషయంలో జగన్ కన్నా షర్మిలే బెటర్?

వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్‌పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ వర్తించదని సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు ఇచ్చిందని, వారికి న్యాయం జరిగేలా దేశవ్యాప్తంగా పోరాటాలు జరుగుతున్నాయని, మరి ఈ విషయంలో జగన్ వైఖరి ఏంటని ఆమె ప్రశ్నించారు. జగన్‌కు దళిత క్రైస్తవుల ఓట్లు అవసరం లేదా? అని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో వారి తరఫున గళం వినిపించిన జగన్ కేవలం వారి ఓట్ల కోసమే మభ్యపెట్టారని విమర్శించారు. కేవలం జగన్ ఓటు బ్యాంకు కోసమే దళిత క్రైస్తవులను వినియోగించుకుంటున్నారని ఆరోపించారు.

ఇక జగన్ కూడా దళితుల పక్షం అని నిరూపించుకున్నారు. మరి దళిత క్రైస్తవుల మాటేంటి? వారి ఓటు అవసరం లేదా? అధికారంలో ఉన్నన్నాళ్లు బీజేపీకి దత్తపుతుడుగా ఉన్నారు. బీజేపీ బిల్లులకు, నిర్ణయాలకు మద్దతు ఇచ్చారు. రాష్ట్రంలో దళిత క్రైస్తవులు జగన్‌కు ఓటేశారు. ఇప్పుడు వారికి అన్యాయం జరుగుతుంటే ఎందుకు మౌనంగా ఉన్నారు? వారి ఓట్లు అవసరం లేదా? అయితే అవసరం లేదని బహిరంగ ప్రకటన జారీ చేయండి. అప్పుడు మిమ్మల్ని ప్రశ్నించం. అని షర్మిల వ్యాఖ్యానించారు.

అంతేకాదు, కేంద్రంపై ఒత్తిడి చేయడంలోనూ జగన్ చతికిల పడ్డారని షర్మిల ఎద్దేవా చేశారు. దళిత క్రైస్తవులకు అన్యాయం జరుగుతున్న క్రమంలో ప్రధాని మోదీ దగ్గరకు మీ ఎంపీలను తీసుకువెళ్లి అడగలేరా? ఇన్నాళ్లు మీ బిల్లులకు మద్దతు ఇచ్చాం, కానీ సుప్రీంకోర్టు తీర్పులో దళితులకు న్యాయం జరుగుతోంది అని అడగలేరా? దళిత క్రిస్టియన్లు మాకు ఓటేశారు అని మీ ఎంపీలను తీసుకెళ్లి మోదీని అడగలేరా? దళిత క్రిస్టియన్ల పక్షాన నిలబడలేరా? అని నిలదీశారు. ఈ మేరకు విజయవాడలో వామపక్షాలు చేపట్టిన నిరసన కార్యక్రమంలో షర్మిల మాట్లాడారు.

సుప్రీంకోర్టు తీర్పు ఇదీ

పుట్టుకతో దళితులు అయిన వ్యక్తులు ఏ రూపంలో అయినా క్రిస్టియానిటీని అవలంబిస్తే వారు ఎస్సీ హోదాను కోల్పోతారని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. పుట్టుకతో ఎస్సీ రిజర్వేషన్ వచ్చినప్పటికీ క్రిస్టియన్‌గా మారితే ఆ తరహా రిజర్వేషన్ అమలు ఉండదని సంచలన తీర్పు ఇచ్చింది. దీనిపైనే దేశవ్యాప్తంగా క్రిస్టియానిటీ తీసుకున్న ఎస్సీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

This post was last modified on April 1, 2026 10:19 pm

Share
Show comments
Published by
Satya
Tags: Sharmila

Recent Posts

కెపాసిటీ లేకే ర‌జినీ సినిమా వ‌దిలేశా

సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ హీరోగా లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ నిర్మించే సినిమా ద‌ర్శ‌కుడి ఎంపిక విష‌యంలో ఎంత త‌ల‌నొప్పి ఎదురైందో…

44 minutes ago

తొలిసారి బాల‌య్య‌తో అనిరుధ్‌?

టాలీవుడ్లో ఇప్ప‌టికే ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ లాంటి అగ్ర క‌థానాయ‌కుల‌తో పాటు నాని, విజ‌య్…

1 hour ago

పవన్ వచ్చాక పిఠాపురంలో ఏం చేశారు?

ఉమ్మ‌డి తూర్పు గోదావ‌రి జిల్లాలోని పిఠాపురం నియోజ‌కవ‌ర్గం నుంచి తొలిసారి పోటీ చేసిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ 2024…

2 hours ago

‘కల్తీ నెయ్యి’లో ఆ ఇద్దరిదే కీలక భూమిక?

కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారి ప్రసాదం తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించారన్న కేసులో రోజుకో కొత్త…

2 hours ago

చంద్ర‌బాబు ప్ర‌క‌టించిన `లేబ‌ర్ అడ్డా` గురించి తెలుసా?

ఏపీ సీఎం చంద్ర‌బాబు గ‌త 2024లో కూట‌మి క‌ట్టి అధికారంలోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఆయ‌న ముఖ్య‌మంత్రి అయిన త‌ర్వాత‌..…

5 hours ago

టబు పాత్రను హీరో తగ్గించాడా?

బాలీవుడ్లో బలమైన ముద్ర వేసిన దక్షిణాది దర్శకుల్లో ప్రియదర్శన్ ఒకరు. ఆయన అక్కడ ఎన్నో కామెడీ సినిమాలు తీసి హిట్లు…

14 hours ago