ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం ఎలా ఉన్నప్పటికీ అందులో రాముడి పాత్ర చేసినందుకు ప్రభాస్ ఎంతో సంతోషించాడు. ‘వారణాసి’లో కాసేపు ఆ పాత్రలో కనిపించబోతున్నందుకు మహేష్ బాబు సైతం ఎంతో ఎగ్జైటెడ్గా ఉన్నాడు.
ఐతే బాలీవుడ్ సూపర్ స్టార్ రణబీర్ కపూర్ మాత్రం.. ‘రామాయణ’లో రాముడి పాత్ర పోషించడానికి వెనుకంజ వేశాడట. నిర్మాత నమిత్ మల్హోత్రా నాలుగేళ్ల ముందు ఈ సినిమాలో నటించమని అడిగినపుడు తాను వెంటనే నో చెప్పినట్లు రణబీర్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
రాముడి పాత్ర చేయడానికి తాను సరిపోనని.. దానికి పూర్తి న్యాయం చేయలేనని తాను భావించి.. ఆ పాత్ర చేయడానికి నిరాకరించినట్లు రణబీర్ వెల్లడించాడు. కానీ ఆ తర్వాత తాను ఒక బిడ్డకు తండ్రినయ్యానని.. అప్పుడు తనకు రాముడి పాత్ర చేయాలని అనిపించిందని.. తండ్రి కావడం తన జీవితంలో గొప్ప మలుపు అని రణబీర్ చెప్పాడు.
నితీశ్ తివారి దర్శకత్వంలో ‘రామాయణ’ సినిమా చేయడానికి పదేళ్ల ముందు అడుగులు పడ్డాయి. అల్లు అరవింద్తో కలిసి వేరే నిర్మాత ఈ ప్రాజెక్టును తెరపైకి తెచ్చాడు. ఏళ్ల తరబడి చర్చలు జరిగాయి. కానీ చివరికి నమిత్ మల్హోత్రా ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాడు.
రాముడు, సీత పాత్రలకు చాలామంది నటీనటుల పేర్లు పరిశీలించి.. చివరికి రణబీర్ కపూర్, సాయిపల్లవిలను ఫైనలైజ్ చేశారు. ఇందులో యశ్ రావణుడి పాత్ర చేస్తున్నాడు. గత ఏడాది విడుదలైన ‘రామాయణ’ గ్లింప్స్ ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది.
గురువారం హనుమజ్జయంతి సందర్భంగా ఈ సినిమా నుంచి రాముడి పాత్రకు సంబంధించి గ్లింప్స్ రిలీజ్ చేయబోతున్నారు. ఈ ఏడాది దీపావళికి ‘రామాయణం’ పార్ట్-1 రిలీజ్ కాబోతోంది. వచ్చే ఏడాది దీపావళికి రెండో భాగం రిలీజ్ చేయాలనుకుంటున్నారు. రెండు భాగాలకు కలిపి రూ.4 వేల కోట్ల బడ్జెట్ పెట్టినట్లు నిర్మాత వెల్లడించిన సంగతి తెలిసిందే.
This post was last modified on April 1, 2026 10:23 pm
వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…
ఒక్కడు, చూడాలని ఉంది లాంటి అద్భుతమైన బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు గుణశేఖర్ కొత్త మూవీ యుఫొరియా ఫిబ్రవరిలో విడుదలైన…
ఏప్రిల్ 30 పెద్ది రావడం లేదని లోకం కోడై కూస్తోంది. నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించకపోయినా ఇతర నిర్మాతలు ఆ…
ఏప్రిల్ 30 'పెద్ది' తప్పుకున్నాక అందరి దృష్టి ఆ స్లాట్ మీద పడింది. ఇది ముందే ఊహించిన 'గాయపడ్డ సింహం'…
మలయాళ స్టార్ హీరో టొవినో థామస్.. తాను జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (వర్కింగ్ టైటిల్)…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. వాస్తవానికి ఇప్పటికే చాలా బిల్లులు పెండింగులో ఉండగా..…