ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం ఎలా ఉన్నప్పటికీ అందులో రాముడి పాత్ర చేసినందుకు ప్రభాస్ ఎంతో సంతోషించాడు. ‘వారణాసి’లో కాసేపు ఆ పాత్రలో కనిపించబోతున్నందుకు మహేష్ బాబు సైతం ఎంతో ఎగ్జైటెడ్గా ఉన్నాడు.
ఐతే బాలీవుడ్ సూపర్ స్టార్ రణబీర్ కపూర్ మాత్రం.. ‘రామాయణ’లో రాముడి పాత్ర పోషించడానికి వెనుకంజ వేశాడట. నిర్మాత నమిత్ మల్హోత్రా నాలుగేళ్ల ముందు ఈ సినిమాలో నటించమని అడిగినపుడు తాను వెంటనే నో చెప్పినట్లు రణబీర్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
రాముడి పాత్ర చేయడానికి తాను సరిపోనని.. దానికి పూర్తి న్యాయం చేయలేనని తాను భావించి.. ఆ పాత్ర చేయడానికి నిరాకరించినట్లు రణబీర్ వెల్లడించాడు. కానీ ఆ తర్వాత తాను ఒక బిడ్డకు తండ్రినయ్యానని.. అప్పుడు తనకు రాముడి పాత్ర చేయాలని అనిపించిందని.. తండ్రి కావడం తన జీవితంలో గొప్ప మలుపు అని రణబీర్ చెప్పాడు.
నితీశ్ తివారి దర్శకత్వంలో ‘రామాయణ’ సినిమా చేయడానికి పదేళ్ల ముందు అడుగులు పడ్డాయి. అల్లు అరవింద్తో కలిసి వేరే నిర్మాత ఈ ప్రాజెక్టును తెరపైకి తెచ్చాడు. ఏళ్ల తరబడి చర్చలు జరిగాయి. కానీ చివరికి నమిత్ మల్హోత్రా ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాడు.
రాముడు, సీత పాత్రలకు చాలామంది నటీనటుల పేర్లు పరిశీలించి.. చివరికి రణబీర్ కపూర్, సాయిపల్లవిలను ఫైనలైజ్ చేశారు. ఇందులో యశ్ రావణుడి పాత్ర చేస్తున్నాడు. గత ఏడాది విడుదలైన ‘రామాయణ’ గ్లింప్స్ ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది.
గురువారం హనుమజ్జయంతి సందర్భంగా ఈ సినిమా నుంచి రాముడి పాత్రకు సంబంధించి గ్లింప్స్ రిలీజ్ చేయబోతున్నారు. ఈ ఏడాది దీపావళికి ‘రామాయణం’ పార్ట్-1 రిలీజ్ కాబోతోంది. వచ్చే ఏడాది దీపావళికి రెండో భాగం రిలీజ్ చేయాలనుకుంటున్నారు. రెండు భాగాలకు కలిపి రూ.4 వేల కోట్ల బడ్జెట్ పెట్టినట్లు నిర్మాత వెల్లడించిన సంగతి తెలిసిందే.
This post was last modified on April 1, 2026 10:23 pm
శ్రీలంకతో జరగబోయే రెండు టెస్టుల సిరీస్ నుంచి బుమ్రా గాయం కారణంగా తప్పుకున్నాడు. అయితే అతని స్థానంలో సీనియర్ బౌలర్…
ప్రధాని నరేంద్ర మోదీ వీడియోను ఫేస్బుక్ నుంచి తొలగించిన వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. సోషల్ మీడియా దిగ్గజం మెటా…
గత నెల మధ్యలో ‘ది ఒడిస్సీ’ సినిమా రిలీజ్ టైంలో ఎంత హడావుడి నెలకొందో చూశాం. ప్రస్తుతం వరల్డ్ సినిమా…
లోకేష్ కనగరాజ్ అంటే పరిచయం అక్కర్లేని పేరు. ఖైదీతో మొదలైన ఇతని ప్రభంజనం విక్రమ్ దాకా ఓ రేంజ్ లో…
బోరుగడ్డ అనిల్ కుమార్ ఏపీ ప్రజలకు బాగా గుర్తున్న పేరు. వైసీపీ అధికారంలో ఉండగా... జగన్ ఆదేశిస్తే టీడీపీ అదినేత, ఏపీ…
డిసెంబర్ 3 ఎప్పుడెప్పుడు వస్తుందాని ప్రభాస్ అభిమానులు కళ్ళలో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు. ముందు రోజే ప్రీమియర్లు ఉంటాయని…