ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను ఎదిరించి.. బెదిరించి నిలదొక్కుకునే పార్టీలు దాదాపు కనిపించడం లేదు. ఎక్కడో ఒక చోట.. ఏదో ఒక సందర్భంలో మోడీకి మద్దతు ఇవ్వకతప్పడం లేదు. అయితే.. మోడీ సైతం.. ఆయా పార్టీలు, రాజకీయ నేతల వ్యవహారాన్ని నిశితంగా గమనిస్తూ ఉంటారు. పార్టీలు ఏవైనా.. రాష్ట్రాలు మరేవైనా.. ఆయనకు ఉండే సీనియర్ల నుంచి సమాచారం తెప్పించు కుంటారు. దాని ప్రకారం రాజకీయ నేతలపై ఒక అంచనా వేసుకుంటారు.
గతంలో జగన్ను కూడా ఇలానే మోడీ అంచనా వేసుకున్నారు. దానికి అనుకూలంగానే జగన్తో స్నేహం నెరిపారు. జగన్ మోడీకి `దత్తపుత్రుడు`.. అని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించినప్పటికీ.. మోడీ మాత్రం ఎంత వరకు జగన్తో వ్యవహరించాలో.. అంత వరకే వ్యవహరించారు. ఎప్పటికప్పుడు జగన్ వ్యవహార శైలిపైనా ఆయన తెలుసుకున్నారు. గత ఎన్నికలకు ముందు పొత్తు విషయంలోనూ ఇలానే.. జగన్ వైఖరిని తెలుసుకునే దాకా బీజేపీని సంయమనం పాటించేలా మోడీ వ్యవహరించారని అప్పట్లో వార్తలు వచ్చాయి.
ఇక, మూడు రాజధానులు సహా.. మహిళలకు సంబంధించిన పోలీసు స్టేషన్ల ఏర్పాటు.. వంటి విషయంలోనూ జగన్తో మోడీ విభేదించారు. కానీ.. రాజకీయంగా ఉన్న అవసరాల నేపథ్యంలో మోడీ ఎక్కడా బయట పడలేదు. ఇక, ఇప్పుడు .. అమరావతి కి బీజేపీ స్వయంగామద్దతు తెలిపిన దరిమిలా.. జగన్ కూడా దానికి అనుగుణంగా అడుగులు వేసి ఉంటే.. పెద్ద సమస్య ఉండేది కాదు.. కానీ.. ఆయన తీరు ఇంకా మారలేదు. వాస్తవానికి బీజేపీ ఈ బిల్లును లోక్సభలో ప్రతిపాదించడానికి ముందే.. వైసీపీ లోక్సభలో పార్లమెంటరీ పక్ష నాయకుడు మిథున్రెడ్డితో చర్చించినట్టు సమాచారం.
దీనికి మీరు కూడా ఆమోదం తెలపండి.. అని కేంద్ర పెద్దలు మిథున్రెడ్డికి సూచించారని తెలిసింది. అయితే.. తమ పార్టీ అధినేతను కనుక్కునిచెబుతానని అన్నప్పటికీ.. ఆయన ఎలాంటి నిర్ణయం వెల్లడించలేదు. దీంతో బీజేపీ తన వైఖరిని తాను ప్రదర్శించింది. ఇక, లోక్సభలో ఈబిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలోనే జగన్ తాడేపల్లిలో దీనికి వ్యతిరేకంగా మాట్లాడడం.. అవినీతి ఆరోపణలు చేయడం.. వంటివి మరింతగా ఆయనను పలుచన చేశాయి.
ముఖ్యంగా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు.. ప్రాంతాలను రాజధానం చేయాలంటూ..`మావిగన్` ప్రతిపాదన చేయడంపై సెటైర్లు కురుస్తున్నాయి. ఈ పరిణామాలతో జగన్ రాజకీయ పరిణితిపై అనేక సందేషహాలు వ్యక్తమవుతున్నాయి. ఇది మరింత ముదిరితే.. జగన్ విషయంలో మోడీకి ఉన్న సానుకూల అభిప్రాయం మరింత తగ్గుతుందని.. ఆయన మరింత పలుచన కావడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు. వాస్తవానికి కేంద్రంలో మోడీ దగ్గర అంతో ఇంతో జగన్కు పలుకుబడి ఉంది. ఇప్పుడు అది కూడా పోవడం ఖాయమనిచెబుతున్నారు..
This post was last modified on April 1, 2026 10:17 pm
ఒక సినిమా రిలీజైన రెండు మూడేళ్ల తర్వాత కూడా దాని కలెక్షన్ల గురించి విపరీతమైన చర్చ జరగడం అరుదు. ‘దేవర’ విషయంలో ఇదే…
అక్కినేని యువ కథానాయకుడు అఖిల్ హీరోగా స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి రూపొందించిన ‘ఏజెంట్’ టాలీవుడ్ చరిత్రలోనే అతి పెద్ద…
కేంద్ర విద్యా శాఖకు నూతన మంత్రిగా బీజేపీ సీనియర్ నేత, కేంద్ర కేబినెట్ లో కీలక శాఖల మంత్రిగా కొనసాగుతున్న ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు.…
బాక్సాఫీస్ దగ్గర పోటీ ఉన్నప్పుడు కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు జరుగుతాయి. ఇది అలాంటిదే. కేవలం ఒక్క రోజు గ్యాప్ తో…
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులను సొంతం చేసుకున్న స్పైడర్ మ్యాన్ సిరీస్ లోని కొత్త సినిమా బ్రాండ్ న్యూ డే జూలై…
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ కొత్త లాజిక్ మాట్లాడుతున్నారు. నైతిక బాధ్యత వహిస్తూ…