రాజకీయాల్లో జంపింగులు కొత్తకాదు. ఎవరికి నచ్చిన దిక్కుకు వారు వెళ్లిపోవడమూ కొత్తకాదు. ఎవరికి అవసరం.. అవకాశం ఉన్న దిశగా నాయకులు, పార్టీలు కూడా ప్రయాణిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఏ పార్టీ కూడా దీనికి మినహాయింపు కాదు.. ఏనాయకుడు కూడా దీనికి అతీతం కాదు. `జగనన్నే నా ప్రాణం` అన్న నాయకులు.. `టీడీపీలోనే పుట్టి పెరిగాం“.. అన్న నేతలు.. అనేక మంది రాజకీయాల్లో తమ తమ దారులు వెతుక్కున్నారు. తమ అవసరాలు.. అవకాశాలను బలోపేతం చేసుకున్నారు.
ఇలానే ఇప్పుడు మరో షాకింగ్ న్యూస్ వెలుగు చూసింది. వైసీపీకి చెందిన కీలక నాయకుడు, జగన్కు వ్యాపార భాగస్వామి కూడా అయిన.. రాజ్యసభ సభ్యుడు ఒకరు.. బీజేపీవైపు చూస్తున్నట్టు ఢిల్లీరాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఆయన ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ఓ మాజీ ఎమ్మెల్యేకు స్వయానా సోదరుడు కావడం కూడా గమనార్హం. అంతేకాదు.. జగన్ సామాజిక వర్గానికే చెందిన ప్రముఖ వ్యాపార వేత్త, కాంట్రాక్టర్. ప్రస్తుతం ఆయన వైసీపీలోనే ఉన్నారు.
ప్రస్తుతం పెద్దల సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న సదరు నాయకుడి పదవీ కాలం మరో రెండు మాసాల్లోనే ముగియనుంది. ఈ ఏడాది జూన్తో ఆ పదవిని త్యాగం చేయాలి. ఆ తర్వాత.. వైసీపీకి ఉన్న బలాన్ని బట్టి.. ఆయన ఏ సభకూ.. ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉండదు. పైగా.. తన వ్యాపారాలను కాపాడుకోవాలంటే ఖచ్చితంగా ఆయనకు రాజకీయంగా మద్దతు అవసరం. ఇప్పటికే తెరచాటున సదరు నాయకుడు.. బీజేపీకి మద్దతుగా వ్యవహరిస్తున్నారు. పైగా.. దేశవ్యాప్తంగా ఆయన కంపెనీ కాంట్రాక్టు పనులు కూడా చేస్తోంది.
ఇటు రాష్ట్రంలోనూ.. అటు కేంద్రంలోనూ మారుతున్న రాజకీయ పరిణామాలను.. అంచనా వేస్తున్న సదరు నాయకుడు తనకు నచ్చిన విధంగా కాకుండా.. తన వ్యాపారాల పరంగా నిర్ణయం తీసుకునేందుకు రెడీ అయ్యారని తెలిసింది. దీనిలో భాగంగా ఆయన ఇక, బీజేపీలోకి నేరుగా చేరిపోవాలని భావిస్తున్నారు. అన్నీ అనుకూలిస్తే.. ఆయన మరో నెల రోజుల్లోనే కాషాయ కండువా కప్పుకోవడం ఖాయమని తెలుస్తోంది. తద్వారా.. ఏపీ సహా.. ఇతర రాష్ట్రాల్లో చేపడుతున్న కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులను దక్కించుకోవాలన్నది ఆయన వ్యూహం. దీనిపై పెద్ద ఎత్తున వైసీపీలో చర్చ సాగుతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
ఇటీవల నాగ్ అశ్విన్ తో ప్రభాస్ చేసిన ప్రమోషనల్ ఇంటర్వ్యూ నెట్టింట ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలుసు. అందులో…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. పశ్చిమబెంగాల్లో శనివారం సాయంత్రం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన దేశవ్యాప్తంగా అన్నదాతలకు పీఎం-కిసాన్ నిధులను…
ఏపీ సీఎం చంద్రబాబు.. మరోసారి వైసీపీపై నిప్పులు చెరిగారు. గత ఐదేళ్ల కాలంలో గొడ్డలి పార్టీ(వైసీపీ) రాష్ట్రాన్ని ధ్వంసం చేయడం..…
ఏపీలో అంతకంతకూ పెరిగిపోతున్న కుల భావనపైనా, విపక్షాలు నిత్యం ఆరోపణలు గుప్పిస్తున్న శాంతి భద్రతల మీద జనసేన అధినేత, డిప్యూటీ…
వందల కోట్లతో తీసినా, తక్కువ బడ్జెట్ లో పూర్తి చేసినా ఏదైనా సినిమానే. వేసేది ప్రొజెక్టర్ వాడే తెరపైనే. చిన్నాపెద్దా…
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే రాశీ సింగ్ లేటెస్ట్ గా షేర్ చేసిన ఫోటోలు భలే ఆకట్టుకుంటున్నాయి.…