టీడీపీ ఆవిర్భావ దినోత్సవం అంగరంగ వైభవంగా సాగిపోయింది. సీనియర్ల నుంచి జూనియర్ కార్యకర్తల వరకు పెద్ద ఎత్తున మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి తరలి వచ్చారు. పసుపు పండుగను విజయవంతం చేశారు. అనంతరం సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్లతో కలిసి విందు కూడా ఆరగించారు. ఇక దీంతో కార్యక్రమం ముగిసింది. కానీ అసలు విషయం అక్కడే మొదలైంది. విందు భేటీలో చాలా మంది సీనియర్ కార్యకర్తలు టికెట్ల ప్రస్తావన చేశారు.
తాము పదేళ్లకు పైగానే పార్టీలో ఉన్నామని కొందరు, పార్టీ స్థాపించిన నాటి నుంచి తమ కుటుంబం టీడీపీకి అంకిత భావంతో పనిచేస్తోందని మరికొందరు చంద్రబాబుకు వివరించారు. పనిలో పనిగా తమకు కూడా ఎమ్మెల్యే టికెట్లు కావాలని గుంటూరు, విజయనగరం, కర్నూలుకు చెందిన పలువురు కార్యకర్తలు ఆయన ముందు తమ వినతులు వినిపించారు. వాస్తవానికి ఈ విషయంపై కొన్నాళ్లుగా పార్టీలోనూ చర్చ సాగుతోంది.
కష్టపడి పనిచేస్తున్న కార్యకర్తలకు గుర్తింపు కావాలని, దాంతోపాటు టికెట్ కూడా కావాలని కోరుకుంటున్న వారు చాలా మందే ఉన్నారు. గత ఎన్నికల్లో కొందరికి ఇలానే టికెట్లు ఇచ్చారు. అయితే వచ్చే ఎన్నికల్లో టికెట్ల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో మరింత మంది ఇప్పుడు టికెట్ల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ విషయంపై సానుకూలంగా స్పందించిన చంద్రబాబు పార్టీ కార్యకర్తలకు కూడా రిజర్వేషన్ ప్రకటించే అవకాశంపై పరిశీలన చేస్తామని వారిని ఊరడించారు.
ఇదే సమయంలో మంత్రి లోకేష్కు ఈ కీలక బాధ్యతలు కూడా అప్పగించారు. పార్టీలో కష్టపడి పనిచేస్తున్న వారికి అవకాశం కల్పించేందుకు, వారి కష్టాన్ని గుర్తించేందుకు లోకేష్ ద్వారా పార్టీ తెలుసుకుంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రస్తుతం చంద్రబాబు ఆలోచన ప్రకారం 5-6 శాతం పార్టీ కార్యకర్తలకు రిజర్వేషన్ (అప్రకటిత) అమలు చేసే అవకాశం ఉంది. అంటే వారి ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా కేవలం పార్టీకి చేస్తున్న కృషిని గుర్తించి టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. తద్వారా పార్టీ మరింత బలోపేతం అవుతుందని భావిస్తున్నారు. అయితే దీనిపై ఇంకా స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు.
అనుకున్నట్లే ఐపీఎల్ 2026 విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మళ్ళీ కొట్టేసింది. ఆ జట్టుకు పోటీగా ఈ సీజన్…
మాములుగా ప్రీ రిలీజ్ ఈవెంట్ల సమయంలో నిర్వాహకులు హీరోలతో పాటు దర్శక నిర్మాతల కటవుట్లు పెట్టడం కొత్త కాదు. అందరూ…
మొన్నటిదాకా టాప్ ప్రొడక్షన్ హౌస్ గా వెలిగిపోయిన యువి క్రియేషన్స్ ఇప్పుడు బయటికి చెప్పుకోలేని ఇబ్బందులతో సతమతమవుతోందట. చిన్న బడ్జెట్…
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ అధికారంలో ఉన్నప్పుడు.. రాష్ట్రంలో జరిగిన అనేక అక్రమాలపై ప్రస్తుత ప్రభుత్వం విచారణ చేస్తున్న…
వేసవిలో కీలకమైన నెలగా చెప్పుకునే మే అయిపోయింది. స్కూళ్ళు, కాలేజీలకు సెలవులు ఉండే ఈ ముఖ్యమైన సీజన్ టాలీవుడ్ వృథా…
ఉద్యోగ వ్యవస్థకు సంబంధించి పంజాబ్ లోని ఆమ్ ఆద్మీ పార్టీ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రజా పాలనలో ఇకపై…