Political News

38 ఎంపీ స్థానాలు: ఎవరికీ కలిసొస్తాయి?

ఏపీలో ప్రస్తుతం ఉన్న పార్లమెంటు నియోజకవర్గాలు 25. అయితే, నియోజకవర్గాల పునర్విభజన జరిగితే అవి మరో 13కు పెరిగి 38 వరకు అందుబాటులోకి రానున్నాయి. అయితే ఇది ఏ పార్టీకి మేలు చేస్తుంది? ఏ పార్టీకి అనుకూలంగా మారుతుంది? అనేది ఆసక్తిగా మారింది. పార్లమెంటు నియోజకవర్గాల్లో టీడీపీ, వైసీపీకి బలం ఉంది. అయితే గత ఎన్నికల్లో జనసేన పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లోనూ గెలుపు సాధించింది. వైసీపీ నాలుగు స్థానాలు దక్కించుకుంది.

అయితే గతానికి సంబంధం లేకుండా ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజన జరిగితే తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడ, మచిలీపట్నం, కడప, రాజంపేట, తిరుపతి, శ్రీకాకుళం, విజయనగరం పార్లమెంటు స్థానాల్లో పూర్తిగా మార్పు రానుంది. విస్తారమైన నియోజకవర్గాలు కావడంతో పాటు జనాభా పరంగా కూడా ఇవి పెద్దవిగా ఉన్నాయి. దీంతో వాటిలో విభజన ఖాయం అన్న చర్చ జరుగుతోంది. ఇవి స్థానిక నాయకులతో పాటు పార్టీలకు కూడా కీలకంగా మారాయి.

శ్రీకాకుళం విస్తారంగా ఉన్న నియోజకవర్గం. మొత్తం జిల్లాకు ఇదొక్క నియోజకవర్గమే ఉంది. దీంతో ఇక్కడ రెండు నియోజకవర్గాలు ఏర్పడే అవకాశం ఉంది. అయితే జిల్లాలో టీడీపీకి ఉన్న బలం, నాయకుల సంఖ్యతో పోల్చుకుంటే విభజన జరిగినప్పటికీ అది పార్టీకి మేలు చేస్తుందని నాయకులు చెబుతున్నారు.

ఇక తిరుపతి నియోజకవర్గం ఎస్సీ. కానీ దీనిని విడదీసి చిత్తూరులోని కొన్ని మండలాలను కలిపి తిరుపతిని జనరల్ చేయనున్నట్టు సమాచారం. ప్రత్యామ్నాయంగా మరో పార్లమెంటు నియోజకవర్గాన్ని ఏర్పాటు చేసి దానిని ఎస్సీ నియోజకవర్గంగా ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఇక్కడ గత ఎన్నికల్లో ఆసక్తికర పరిస్థితి కనిపించింది. వైసీపీ ఎంపీ స్థానం గెలుచుకోగా, పరిధిలోని మెజారిటీ అసెంబ్లీ స్థానాలను జనసేన, టీడీపీలు గెలిచాయి.

ఇక మచిలీపట్నంలోని కొన్ని మండలాలను విడదీసి ఇక్కడ కూడా మరో నియోజకవర్గాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. అలాగే రాజంపేట, కడపలలోనూ మార్పులు తప్పవని చెబుతున్నారు. దీంతో ఆయా పార్టీలకు ఉన్న బలాబలాలు, నాయకుల ఆధిపత్యం వంటి అంశాలు కీలకంగా మారనున్నాయి.

Satya

Recent Posts

బండ్ల గణేష్… త్రివిక్రమ్… కలిసిపోయారు!

టాలీవుడ్లో బండ్ల గణేష్ విచిత్రమైన పర్సనాలిటీ. చిన్న చిన్న కామెడీ వేషాలు వేసుకునే అతను.. నిర్మాతగా మారి పవన్ కళ్యాణ్,…

2 hours ago

మహిష్మతి మళ్ళీ ఊపిరి పీల్చుకుంటుందా

బాహుబలి తర్వాత రాజమౌళి ఆర్ఆర్ఆర్ తీశారు. ఆస్కార్ వేదిక మీద తన బృందానికి అవార్డు వచ్చేలా చేశారు. వారణాసిని ఇంటర్నేషనల్…

2 hours ago

రావిపూడి కన్ను రాయలసీమపై పడింది

టాలీవుడ్లో ప్రస్తుతం మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్లలో అనిల్ రావిపూడి ఒకడు. రాజమౌళి కాకుండా ఇండస్ట్రీలో ఫెయిల్యూర్ లేని దర్శకుడు…

3 hours ago

వివాదాలు ఎన్ని ఉన్నా అవకాశాలకు లోటు లేదు

విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఈ మధ్య కాస్త స్క్రీన్ మీద తగ్గినట్టు కనిపించినా అవకాశాలకు ఏ లోటు లేదు.…

5 hours ago

టాక్సిక్ ఫిక్సు… పోటీ సినిమాలకు చిక్కు

అసలు ఈ ఏడాది విడుదలవుతుందా లేదాని అనుమాన పడుతున్న టాక్సిక్ హఠాత్తుగా బాంబు వేసింది. ఆగస్ట్ 26 విడుదల చేయబోతున్నట్టు…

6 hours ago

సీఐ నాగ‌రాజుకు మహిళల మద్దతు

విజ‌య‌వాడ కృష్ణ‌లంక పోలీసు స్టేషన్ సీఐ నాగ‌రాజుపై ప్ర‌భుత్వం విచార‌ణ‌కు ఆదేశించి.. ఆయ‌న‌ను స‌స్పెండ్ చేసిన విష‌యం తెలిసిందే. అయితే..…

6 hours ago