Political News

38 ఎంపీ స్థానాలు: ఎవరికీ కలిసొస్తాయి?

ఏపీలో ప్రస్తుతం ఉన్న పార్లమెంటు నియోజకవర్గాలు 25. అయితే, నియోజకవర్గాల పునర్విభజన జరిగితే అవి మరో 13కు పెరిగి 38 వరకు అందుబాటులోకి రానున్నాయి. అయితే ఇది ఏ పార్టీకి మేలు చేస్తుంది? ఏ పార్టీకి అనుకూలంగా మారుతుంది? అనేది ఆసక్తిగా మారింది. పార్లమెంటు నియోజకవర్గాల్లో టీడీపీ, వైసీపీకి బలం ఉంది. అయితే గత ఎన్నికల్లో జనసేన పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లోనూ గెలుపు సాధించింది. వైసీపీ నాలుగు స్థానాలు దక్కించుకుంది.

అయితే గతానికి సంబంధం లేకుండా ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజన జరిగితే తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడ, మచిలీపట్నం, కడప, రాజంపేట, తిరుపతి, శ్రీకాకుళం, విజయనగరం పార్లమెంటు స్థానాల్లో పూర్తిగా మార్పు రానుంది. విస్తారమైన నియోజకవర్గాలు కావడంతో పాటు జనాభా పరంగా కూడా ఇవి పెద్దవిగా ఉన్నాయి. దీంతో వాటిలో విభజన ఖాయం అన్న చర్చ జరుగుతోంది. ఇవి స్థానిక నాయకులతో పాటు పార్టీలకు కూడా కీలకంగా మారాయి.

శ్రీకాకుళం విస్తారంగా ఉన్న నియోజకవర్గం. మొత్తం జిల్లాకు ఇదొక్క నియోజకవర్గమే ఉంది. దీంతో ఇక్కడ రెండు నియోజకవర్గాలు ఏర్పడే అవకాశం ఉంది. అయితే జిల్లాలో టీడీపీకి ఉన్న బలం, నాయకుల సంఖ్యతో పోల్చుకుంటే విభజన జరిగినప్పటికీ అది పార్టీకి మేలు చేస్తుందని నాయకులు చెబుతున్నారు.

ఇక తిరుపతి నియోజకవర్గం ఎస్సీ. కానీ దీనిని విడదీసి చిత్తూరులోని కొన్ని మండలాలను కలిపి తిరుపతిని జనరల్ చేయనున్నట్టు సమాచారం. ప్రత్యామ్నాయంగా మరో పార్లమెంటు నియోజకవర్గాన్ని ఏర్పాటు చేసి దానిని ఎస్సీ నియోజకవర్గంగా ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఇక్కడ గత ఎన్నికల్లో ఆసక్తికర పరిస్థితి కనిపించింది. వైసీపీ ఎంపీ స్థానం గెలుచుకోగా, పరిధిలోని మెజారిటీ అసెంబ్లీ స్థానాలను జనసేన, టీడీపీలు గెలిచాయి.

ఇక మచిలీపట్నంలోని కొన్ని మండలాలను విడదీసి ఇక్కడ కూడా మరో నియోజకవర్గాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. అలాగే రాజంపేట, కడపలలోనూ మార్పులు తప్పవని చెబుతున్నారు. దీంతో ఆయా పార్టీలకు ఉన్న బలాబలాలు, నాయకుల ఆధిపత్యం వంటి అంశాలు కీలకంగా మారనున్నాయి.

This post was last modified on March 27, 2026 5:31 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కాంతార హీరో… అన్ ఫాలో క‌ల‌క‌లం

నాలుగేళ్ల ముందు వ‌ర‌కు రిష‌బ్ శెట్టి అంటే క‌న్న‌డ‌లో ఒక మిడ్ రేంజ్ హీరో, ద‌ర్శ‌కుడు. కానీ కాంతార అనే…

57 minutes ago

క‌విత క‌ల్లోలం… ఏ పార్టీకి?!

ఒకరు పార్టీ పెట్టారంటే.. కొత్త‌గా వ‌చ్చే ఓట్లు అంటూఏమీ ఉండ‌వు. ఏదో ఒక పార్టీకి సానుకూలంగా ఉన్న ఓట్ల‌ను.. లేదా…

3 hours ago

బుచ్చిబాబుకి మాత్రమే ఎలా సాధ్యమవుతోంది

2026 విడుదలైన కాబోతున్న ప్యాన్ ఇండియా మూవీస్ లో హైప్ అంతకంతా పెంచుకుంటూ పోవడమే తప్ప తగ్గించుకోలేకపోయిన సినిమా ఏదైనా…

4 hours ago

అన్న హీరో.. చెల్లి నిర్మాత‌.. ప‌వ‌న్ గెస్ట్?

ఓ మంచి హిట్ కోసం చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్నాడు మెగా కుర్రాడు వ‌రుణ్ తేజ్. ఒక ద‌శ‌లో తొలి…

4 hours ago

మారుతీకి మంచి రోజులు రావాల్సిందే

సంక్రాంతికి విడుదలైన ది రాజా సాబ్ పేరు వింటే చాలు ప్రభాస్ అభిమానులకు ఎక్కడ లేని కోపం వచ్చేస్తుంది. వీళ్ళ…

5 hours ago

టిల్లు వివాదానికి దర్శకుడి ముగింపు

డిజె టిల్లు ఒక బ్రాండ్ గా మారిపోయేంత రేంజ్ లో సూపర్ హిట్ అయ్యింది. ఇది అందరూ ఒప్పుకునే వాస్తవం.…

5 hours ago