ఉమ్మడి ఖమ్మం జిల్లాలో.. గోదావరి నది ఒడ్డున ఉన్న ప్రఖ్యాత భద్రాచలం ఆలయాన్ని విస్తరించేందుకు కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. ఈ పనులకు తాజాగా సీఎం రేవంత్ రెడ్డి సతీసమేతంగా భూమి పూజ చేశారు. మొత్తంగా 3 దశల్లో ఈ ఆలయాన్ని విస్తరించనున్నారు. తాజాగా 351 కోట్ల రూపాయలతో చేపట్టనున్న తొలి దశ పనులకు ఆయన శ్రీకారం చుట్టారు.
ఎందుకు?
భద్రాచలం ఆలయాన్ని విస్తరించాలన్నది కొన్నాళ్లుగా జరుగుతున్న చర్చ. రాష్ట్రం విడిపోయిన తర్వాత.. ఆలయానికి మరింత ప్రాభవం పెరిగింది. అదేసమయంలో రాష్ట్రంలోని అతిపెద్ద ఆలయాల్లో భద్రాచలం కూడా ఒకటిగా ఉంది. గతంలో 1000 కోట్ల రూపాయలను ఖర్చుచేసిన యాదగిరి నరసింహ క్షేత్రాన్ని అప్పట్లో కేసీఆర్ ప్రభుత్వం అభివృద్దిచేసింది. అయితే.. కారణాలు ఏవైనా కూడా.. కొంత మేరకు ఆశించిన ఫలితం రాలేదు.
ఈ క్రమంలో రెండో అతిపెద్ద దేవాలయంగా ఉన్న భద్రాచలాన్ని విస్తరించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి 1000 కోట్ల రూపాయలను ఖర్చు చేయనున్నారు. మూడు దశల్లో చేపట్టే నిర్మాణంలో భక్తులకు మరిన్ని వసతి గృహాలను నిర్మించనున్నారు. అలాగే ప్రధాన ఆలయ ప్రాకారాన్ని కూడా విస్తరించనున్నారు. ఆలయ ప్రాంగణంలోనే సీతారాముల వారి కళ్యాణం చేసేందుకు కూడా నిర్ణయించుకు న్నారు.
ఈ నేపథ్యంలోనే ఆలయ విస్తరణకు ప్రాధాన్యం ఇస్తున్నారు. తిరుమల తరహాలో దీనిని అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నారు. ఇక, తాజాగా శ్రీరామ నవమిని పురస్కరించుకుని జరిగిన కల్యాణం కమనీయంగా జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి దంపతులు సహా.. ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క దంపతులు.. మరికొందరు మంత్రులు కూడా కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగానే తొలి దశ విస్తరణ పనులకు శ్రీకారం చుట్టారు.
This post was last modified on March 27, 2026 3:23 pm
ఒకప్పుడు అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోగా సుమంత్ కు మంచి ఫాలోయింగ్ ఉండేది. సత్యం, గౌరీ, గోదావరి లాంటి…
సౌత్ ఇండియన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన దేవిశ్రీ ప్రసాద్ వయసు ప్రస్తుతం 46 ఏళ్లు. కానీ ఇంతలోనే అతను 27 ఏళ్ల…
ఎట్టకేలకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో గెలిచాడు. జులై 30 వ తేదీన బీహార్ ఉప ఎన్నికల్లో బంకీపూర్ నుంచి ఎన్నికల…
ఒకపెద్ద సినీ కుటుంబం నుంచి పరిచయం అయ్యే కొత్త హీరో మాస్ ఇమేజ్ కోసమే తపన పడతాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం…
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…
అదేంటో స్పైడర్ మ్యాన్ జ్వరం మనోళ్లకు ఓ రేంజ్ లో పట్టేసింది. భాషతో సంబంధం లేకుండా ముంబై నుంచి మచిలీపట్నం…