పెళ్లి చూపులు, జాతిరత్నాలు ఎంత పేరు తెచ్చినా ప్రియదర్శికి మంచి బ్రేక్ గా నిలిచింది బలగం సినిమానే. గత ఏడాది కోర్ట్ రూపంలో మరో సూపర్ హిట్ అందుకున్నాడు. అయితే ఆ తర్వాత ఆశించిన స్థాయిలో విజయాలు దక్కలేదు. సారంగపాణి జాతకం హడావిడి మిన్న విషయం సున్నాలా దారుణంగా పోయింది. మిత్రమండలి పెద్ద డిజాస్టర్. ప్రేమంటే మూవీ వచ్చిన సంగతే చాలా మందికి తెలియకుండానే వెళ్లిపోవడం అతిశయోక్తి కాదు.
ఇలా వరస ఫెయిల్యూర్స్ ప్రియదర్శి మార్కెట్ మీద ప్రభావం చూపించాయి. తాజాగా సుయోధనతో మరోసారి ప్రేక్షకులను పలకరించాడు ప్రియదర్శి. సాయికుమార్ మరో కీలక పాత్ర పోషించారు. కానీ ఎలాంటి ప్రమోషన్లు లేవు. ఎక్కడా హడావిడి కనిపించడం లేదు. ప్రెస్ మీట్లు లాంటివి లేవు. సోషల్ మీడియాలో ఏదైనా సౌండ్ ఉందా అంటే అదీ భేతాళ ప్రశ్నే. కేవలం ట్రైలర్ మాత్రమే లాంచ్ చేసి మమ అనిపించడం తప్ప సుయోధన టీమ్ చేసింది అంతంతమాత్రమే.
కంటెంట్ బాగుంటే జనాలకు రీచ్ అవుతుంది. అందులో డౌట్ అక్కర్లేదు. కానీ కనీస స్థాయిలో దాన్ని తీసుకెళ్లే ప్రయత్నాలు ఖచ్చితంగా చేయాలి. లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి లాంటి వాటిని ఉదాహరణగా తీసుకోవచ్చు. అసలే దురంధర్ ది రివెంజ్ తప్ప జనాలకు పెద్ద ఆప్షన్లు లేవు. ఉస్తాద్ భగత్ సింగ్ ఏదో లాక్కొస్తోంది కానీ పనవ్వడం లేదు. బ్యాండ్ మేళంకు పాజిటివ్ రెస్పాన్స్ లేదు. తమిళ డబ్బింగులు యూత్ కొంత మేర ట్రై చేస్తుండగా హ్యాపీ రాజ్ రిపోర్ట్స్ ఇంకా రావాల్సి ఉంది.
ఇంత ఛాన్స్ పెట్టుకుని సుయోధన అలా సైలెంట్ గా ఉండటం విచిత్రమే. ఈ సంగతి పక్కనపెడితే ఆర్టిస్టుగా ప్రియదర్శి ఎంత బిజీగా ఉన్నా సక్సెస్ రేట్ మెయింటైన్ చేసుకోవడం చాలా అవసరం. లేదంటే కనుమరుగయ్యే ప్రమాదముంది. తన మీద నమ్మకం ఉన్న జనాలు లేకపోలేదు. వాళ్ళను పోగొట్టుకొకూడదు. కౌంట్ ఎంత ముఖ్యమో క్వాలిటీ కూడా అంటే ఇంపార్టెంట్. ఇది మర్చిపోయి కేవలం చేస్తున్న సినిమాల నెంబర్ల మీద దృష్టి పెడితే భవిష్యత్తులో ఇబ్బందులు ఖాయం.
యూపీలోని మహారాజ్గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…
రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…
తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…