ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం.. తిరుపతిలోని కుప్పంలో ఆయన సతీమణి నారా భువనేశ్వరి సైలెంట్గా చుట్టేస్తున్నారు. ప్రతి రెండు మాసాలకు ఒకసారి ఆమె అక్కడ జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. గత జనవరిలోనే కుప్పంలో పర్యటించిన ఆమె.. తాజాగా గత మూడు రోజులుగా ఇదే నియోకవర్గంలో పర్యటిస్తున్నారు. అయితే.. ఇలా పర్యటించడం తప్పుకాకపోయినా.. గతానికి భిన్నంగా ఆమె ఇంత ప్రాధాన్యం ఇవ్వడమే చర్చనీయాంశం అయింది.
అందరినీ కలుపుకొని..
కుప్పం నియోజకవర్గానికి తరచుగా వస్తున్న భువనేశ్వరి.. అందరినీ కలుపుకొని పోతున్నారు. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరితోనూ కలివిడిగా వ్యవహరిస్తున్నారు. పార్టీ కార్యకర్త నుంచి అభిమాని వరకు ఎవరి ఇంట్లో ఏ శుభకారం జరిగినా.. ఆమె హాజరవుతున్నారు. రిబ్బన్ కట్ చేస్తున్నారు. అంతేకాదు సమస్యల్లో ఉన్న కుటుంబాలను కూడా ఆదుకుంటున్నారు. ఇటీవల ఓ కార్యకర్త మృతి చెందితే.. ఆ కుటుంబాన్ని దత్తత తీసుకున్నారు. ఎన్టీఆర్ ట్రస్టు స్కూల్లో ఆ కార్యకర్త పిల్లలను చేర్చారు.
అన్నీ తానై..
కుప్పం ఎమ్మెల్యేగా సీఎం చంద్రబాబు కూడా తరచుగా వస్తున్నప్పటికీ.. రాష్ట్రసమస్యలు, పెట్టుబడులు , పాలన వంటి కీలక అంశాల్లో ఆయన బిజీగా ఉన్నారు. దీంతో కుప్పంలో జరుగుతున్న పనులను పర్యవేక్షించేందుకు పెద్దగా తీరిక ఉండడం లేదు. ఈ నేపథ్యంలో ఆయా పనులను నారా భువనేశ్వరి పర్యవేక్షిస్తున్నారు. ఏదైనా సూచనలు, సలహాలు అవసరమైనా ఇస్తున్నారు. అలాగని ఆమె పరిధులు దాటి ఎప్పుడూ వ్యవహరించకపోవడం గమనార్హం.
వైసీపీకి చెక్!
మరోవైపు.. కుప్పంలో వైసీపీ పుంజుకునేందుకు 2023 నుంచి ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో రాజకీయంగా కార్యక్రమాలు చేపట్టడంతోపాటు.. నాయకులకు కూడా ఫుల్ పవర్స్ ఇచ్చింది. కానీ.. గత ఎన్నికల్లో చంద్రబాబు వరుస విజయం దక్కించుకున్నారు. ఇక, గత ఎన్నికల తర్వాత.. కుప్పంలో వైసీపీ ఎక్కడా కనిపించడం లేదు. పైగా.. వైసీపీ కార్యాలయాన్ని కూడా మూసేశారు. మరోవైపు.. భువనేశ్వరి సహా సీఎం చంద్రబాబు యాక్టివ్గా నియోజకవర్గంలో కార్యక్రమాలు నిర్వహిస్తుండడంతో వైసీపీ పూర్తిగా ఈ నియోజకవర్గాన్ని పక్కన పెట్టింది.
This post was last modified on March 26, 2026 5:53 pm
బారత ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ... వరుసబెట్టి మూడు పర్యాయాలు దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతేకాకుండా దేశానికి అత్యధిక…
కొత్త నెల వచ్చేసింది. సంక్రాంతి అయిపోయాక ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ దాకా జనాలు రాక థియేటర్లు అలో లక్ష్మణా అంటున్న…
జంతర్ మంతర్ ఆందోళనలో విద్యార్థులు తనను దుషించారని ప్రధాని మోదీ శుక్రవారం రాత్రి విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో…
నేటి తరం రాజకీయ నాయకులలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కుమార్ స్టైలే వేరు. నిబద్దత కలిగిన నాయకుడిగా ఎదిగినప్పటికి…
గత రెండు మూడు రోజులుగా మహేష్ బాబు గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. జయకృష్ణ తొలి సినిమ…
గత కొన్ని వారాలుగా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పెద్ది తెలుగు రాష్ట్రాల్లో బాగా ఆడితే…