తిరువీర్ అంటే రెగ్యులర్ సినిమాలు చూసే ప్రేక్షకులకు సుపరిచితుడే కానీ సెలెక్టివ్ గా థియేటర్లకు వెళ్లే వాళ్లకు మాత్రం కొంచెం కొత్తగా అనిపిస్తాడు. మసూద మంచి హిట్ అయినప్పటికీ గుర్తింపు విషయంలో టీమ్ మొత్తం సమానంగా షేర్ తీసుకోవడంతో తను ఎక్కువగా హైలైట్ కాలేకపోయాడు. అయినా క్రమం తప్పకుండా మూవీస్ చేస్తూ జనం దృష్టిలో పడేందుకు కష్టపడతాడు. గత ఏడాది విడుదలైన ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షోకు ప్రశంసలు, గద్దర్ అవార్డు వచ్చినా డబ్బులు పెద్దగా రాలేదు.
వచ్చే నెల ఏప్రిల్ 17 పాపం ప్రతాప్ తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. తిరువీర్ ఒక విషయంలో చాలా ఓపెన్ గా ఉంటున్నాడు. ఫిల్టర్ లేకుండా తన గురించి చెప్పేస్తున్నాడు. విజయవాడ ఫ్లైట్ లో వెళ్ళినప్పుడు తోటి ప్రయాణికుడు గుర్తు పట్టకపోవడం, అనంతపూర్ లో భగవంతుడు షూటింగ్ టైంలో ఒక వ్యక్తి వచ్చి తిరువీర్ నే ఎవరు హీరో అని అడగటం లాంటి సంఘటనలు మీడియాతో షేర్ చేసుకున్నాడు. మాసూద చైల్డ్ ఆర్టిస్టు తిరువీర్ ని డ్రైవర్ అనుకుందట.
ఇలా ఓపెన్ గా ఉన్న తిరువీర్ కి అత్యవసరంగా సక్సెస్ కావాలి. ఈటీవీ విన్ ప్రొడక్షన్ కావడంతో పాపం ప్రతాప్ మీద చాలా నమ్మకం పెట్టుకున్నాడు. కాన్సెప్ట్ ఏదో వెరైటీగానే ఉంది. భగవంతుడులో చాలా ఇంటెన్స్ క్యారెక్టర్ చేస్తున్నాడు. అమెజాన్ ప్రైమ్ నిర్మిస్తున్న గువ్వలచెరువు ఘాట్ వెబ్ సిరీస్ లో కిరణ్ అబ్బవరంతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. ఇలా డైరీ చాలా బిజీగా ఉంది కానీ ఎటొచ్చి పెద్ద స్థాయిలో ఇమేజ్ రావడం కోసం ఎదురు చూస్తున్నాడు.
సో పాపం ప్రతాప్ ఎలాంటి బ్రేక్ ఇస్తుందో చూడాలి. ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ కాబట్టి కంటెంట్ కనక వర్కౌట్ అయితే తను కోరుకున్నది జరగొచ్చు. ఎవరైనా సరే ఇండస్ట్రీలో మాట్లాడేది సక్సెసే. అది వస్తూ ఉంటేనే జనాలతో కనెక్టివిటీ కొనసాగుతుంది. రెగ్యులర్ కాకుండా వైవిధ్యమున్న పాత్రలు చేస్తున్న తిరువీర్ కి ఈ ఏడాది రెండు థియేటర్ రిలీజులు, ఒక ఓటిటి కంటెంట్ ఎలాంటి ఫలితాలు ఇస్తాయో వేచి చూడాలి. ఏదీ రెగ్యులర్ జానర్ కాకపోవడం విశేషం.
ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇక నుంచి మరో లెక్క.. అన్నట్టుగా వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ పరిస్థితి…
పెద్ది మొదటి వారం పూర్తి చేసుకుని సెకండ్ వీక్ లో అడుగు పెట్టింది. మూడు వందల యాభై కోట్ల వైపు…
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను వెల్లడించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో…
పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఇందన పొదుపు దిశగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కీలక సూచనలు చేశాక… మన…
ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రముఖ ప్రవచ కర్త చాగంటి కోటేశ్వరరావు ప్రసంగాలను పాఠ్యాంశాలుగా ప్రవేశ పెడుతున్నట్టు ప్రకటించింది. దీనికి సంబంధించి…
ఒక విడాకుల కేసుకు సంబంధించి కోర్టు ఇచ్చిన తీర్పుపై ఇప్పుడు పెద్ద ఎత్తున డిబేట్ జరుగుతోంది. సోషల్ మీడియాలో దీనిపై…