Political News

ఐదు రాష్ట్రాల ఎలక్షన్స్: చడీ చప్పుడు లేని కాంగ్రెస్!

ఔను.. నిజమే! ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు ముహూర్తం సిద్ధమైంది. షెడ్యూల్ కూడా విడుదలైంది. మరో రెండు మూడు రోజుల్లోనే కొన్ని రాష్ట్రాల్లో నోటిఫికేషన్ రానుంది. ఇప్పటికే కేరళలో నోటిఫికేషన్ వచ్చింది. అయితే ఇంత జరుగుతున్నా కాంగ్రెస్ పార్టీలో పెద్దగా చడీ చప్పుడు కనిపించడం లేదు. ముఖ్యంగా ఎక్కడ ఎన్నికలు జరిగినా రాహుల్ గాంధీ వ్యాఖ్యలు, ప్రచారం, స్టార్ క్యాంపెయినర్ల సందడి కనిపించేది. కానీ ఈసారి అలాంటి వాతావరణం ఎక్కడా కనిపించడం లేదు.

ఈ దఫా రాష్ట్రాల నాయకులే ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అసోంలో పొత్తులు కుదరకపోవడం పెద్ద సమస్యగా మారింది. బలమైన సీఎం, బీజేపీ నాయకుడు హిమంత బిశ్వ శర్మను ఎదుర్కొనే వ్యూహాలు కాంగ్రెస్‌కు స్పష్టంగా కనిపించడం లేదు.

తమిళనాడులో అధికార డీఎంకేతో పొత్తు పెట్టుకున్నా ఆశించిన స్థాయిలో సీట్లు దక్కలేదు. 240 స్థానాల్లో కాంగ్రెస్‌కు కేవలం 36 సీట్లు మాత్రమే దక్కాయి. దీంతో స్థానిక నాయకులే ప్రచార బాధ్యతలు చేపట్టారు. అసెంబ్లీ సీట్లను రాజ్యసభ కోసం త్యాగం చేశారన్న విమర్శలకు కాంగ్రెస్ అధిష్టానం సమాధానం ఇవ్వలేకపోతోంది.

బెంగాల్‌లో కూడా పరిస్థితి స్పష్టంగా లేదు. గతంలో కమ్యూనిస్టులతో కలిసి పోటీ చేసిన కాంగ్రెస్ ఈసారి పొత్తులపై క్లారిటీ లేక సీట్ల విషయంలో నిలకడ సాధించలేకపోతోంది. ఇదే సమయంలో బీజేపీ ఇప్పటికే ఎక్కువ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. దీంతో బెంగాల్‌లో ప్రధాన పోటీ బీజేపీ, మమతా బెనర్జీ మధ్యే కేంద్రీకృతమవుతోంది.

కేరళలో కూడా కాంగ్రెస్ పరిస్థితి సవాళ్లతో నిండిపోయింది. పైకి నేతలు 100 సీట్లు గెలుస్తామని చెబుతున్నా, క్షేత్రస్థాయిలో ఐక్యత లోపం కనిపిస్తోంది. మరోవైపు సీఎం పినరాయి విజయన్‌కు ప్రజల్లో మద్దతు పెరుగుతున్నట్లు సర్వేలు చెబుతున్నాయి.

పుదుచ్చేరిలోనూ కాంగ్రెస్, డీఎంకే మధ్య సమన్వయం బలంగా కనిపించడం లేదు. ఇక్కడ కూడా బీజేపీ కూటమి మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రీ పోల్స్ సూచిస్తున్నాయి. ఈ సమయంలో పార్టీకి బలంగా ఉండాల్సిన రాహుల్ గాంధీ ఎక్కడా కనిపించకపోవడం శ్రేణుల్లో నిరాశను పెంచుతోంది.

Satya

Recent Posts

నాగ‌వంశీ చెప్పింది నిజమే

లెనిన్ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాత‌ల్లో ఒక‌రైన నాగ‌వంశీ. లెనిన్…

1 minute ago

పిల్లలు వద్దనుకుంటే సంపదను వదులుకున్నట్టే: చంద్రబాబు

పిల్లలు సంప‌ద అని సీఎం చంద్ర‌బాబు మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. తాను చెప్పిన మాటకే క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని తెలిపారు. దీనిని…

33 minutes ago

విషాదం మిగిల్చిన విహారం… తెలుగువారు మృతి

వియ‌త్నాంలో విహార యాత్ర‌కు వెళ్లిన భార‌తీయుల కుటుంబాల్లో విషాదం నెల‌కొంది. ఊహించ‌ని ప్ర‌మాదంలో చిక్కుకుని 15 మంది భార‌తీయులు మృతి…

39 minutes ago

ఎడిట‌ర్‌ను సైకో అన్న నిర్మాత‌

త‌న సినిమాకు ప‌ని చేసిన టెక్నీషియ‌న్‌ను ఒక నిర్మాత సైకోగా అభివ‌ర్ణించ‌డం ఎప్పుడైనా చూశారా? సితార ఎంట‌ర్టైన్మెంట్స్ అధినేత నాగ‌వంశీ…

50 minutes ago

టికెట్ రేట్ల విషయంలో ‘లెనిన్’ ఆదర్శం

శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…

2 hours ago

అమ‌రావ‌తిలో అల‌జ‌డి… మళ్ళీ ఏం జరిగింది?

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో శ‌నివారం తెల్ల‌వారు జాము నుంచి పోలీసులు అధికారులు పెద్ద ఎత్తున మోహ‌రించారు. ఈ ప్రాంతంలో రాజ‌ధాని…

4 hours ago