తొలి రోజు రూ.230 కోట్లు.. మూడు రోజులు తిరిగేసరికి రూ.500 కోట్లు.. ఇదీ దురంధర్ సినిమా ప్రభంజనం. ఈ సినిమా రెండో వీకెండ్ అయ్యేసరికి రూ.1000 కోట్ల క్లబ్బులో అడుగు పెట్టడం లాంఛనంగానే కనిపిస్తోంది. ఫుల్ రన్లో రూ.2 వేల కోట్ల మైలురాయిని కూడా అందుకోవచ్చు. ఈ వసూళ్ల మోతను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇండియన్ బాక్సాఫీస్లో ఎన్నో ఏళ్లుగా నిలిచి ఉన్న అన్ని వసూళ్ల రికార్డులూ బద్దలు కొట్టేస్తోందని దురంధర్ను కొనియాడుతున్నారు.
కానీ ఈ ఘనతలు దురంధర్ ఖాతాలో మరీ ఎక్కువ రోజులేమీ ఉండే అవకాశం కనిపించడం లేదు. మహా అయితే ఏడాది పాటు మాత్రమే దురంధర్ పేరిట ఈ రికార్డులుంటాయి. వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ కాబోతున్న రాజమౌళి, మహేష్ బాబుల వారణాసి వస్తే అన్ని రికార్డులూ గల్లంతవడం ఖాయమే. ఆ సినిమా ఓ మోస్తరు టాక్ వచ్చినా చాలు.. ప్రస్తుత రికార్డులు దాని ముందు జుజుబినే అవుతాయి.
ఇప్పటిదాకా చూసిన ప్రమోషనల్ కంటెంట్ను బట్టి వారణాసి ఓపెనింగ్స్ మామూలుగా ఉండవు. ఓవరాల్ వసూళ్లు కూడా ఎవ్వరూ అందుకోలేని స్థాయిలోనే ఉండే అవకాశముంది. రాజమౌళి సినిమాలంటే కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఒకే రకమైన హైప్ ఉంటుంది. దేశంలో ఉన్న ప్రతి సినీ ప్రేమికుడూ వారణాసి సినిమాను బిగ్ స్క్రీన్ మీద చూడాలనుకుంటానడంలో సందేహం లేదు. దురంధర్కు మంచి హైపే ఉన్నా సరే.. వారణాసి రేంజి రీచ్ లేదన్నది స్పష్టం. వారణాసి దేశంలోని అన్ని ప్రధాన భాషల్లో ఒకేసారి రిలీజవుతుంది. అన్ని భాషల్లోనూ ఒకే రకమైన హైప్ ఉంటుంది.
పాన్ వరల్డ్ స్థాయిలో ఆ సినిమాకు ఉన్న బజ్ వేరు. ఓవర్సీస్ కలెక్షన్లు ఊహించని స్థాయిలో ఉండబోతున్నాయి. ఆ చిత్రానికి టికెట్ల ధరలు కూడా ఎక్కువే ఉంటాయి. కాబట్టి ఓపెనింగ్స్ దగ్గర్నుంచి ఓవరాల్ వసూళ్ల వరకు నంబర్స్ చాలా భారీగా ఉంటాయన్నది స్పష్టం. మధ్యలో ఈ ఏడాది రామాయణం సినిమా కూడా భారీ హైప్తోనే రాబోతోంది కానీ.. దాంతో పోలిస్తే వారణాసికే రీచ్ ఎక్కువ అన్నది స్పష్టం. కాబట్టి దురంధర్ నిర్దేశించే టార్గెట్లు వారణాసికి చిన్నవిగా అనిపిస్తే ఆశ్చర్యమేమీ లేదు.
This post was last modified on March 23, 2026 11:19 am
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…