Political News

అసలు ఆస్తులే పంచలేదంటున్న విజయమ్మ…

దివంగత మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి కుటుంబంలో ఆస్తుల వివాదం రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతోంది. ఇటీవల వై.ఎస్. షర్మిల చేసిన ఘాటు వ్యాఖ్యల అనంతరం ఈ వ్యవహారం మరింత రాజకీయ, కుటుంబ చర్చలకు దారితీసింది. ఈ నేపథ్యంలో తాజాగా వైఎస్ విజయమ్మ స్పందిస్తూ కీలక ప్రకటన విడుదల చేశారు.

వైఎస్ విజయమ్మ స్పష్టంచేసిన ప్రకారం., 2009లో వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి మరణించే వరకు కుటుంబ ఆస్తుల పంపకం అసలు జరగలేదని తెలిపారు. ఆ కాలం వరకు ఉన్న ఆస్తులన్నీ సంయుక్త కుటుంబ ఆస్తులేనని పేర్కొన్నారు. ఆస్తులను నలుగురు మనుమలకు సమానంగా పంచాలన్నదే వైఎస్సార్ ఆశయమని, అదే ఆయన ఆదేశమని వెల్లడించారు.

ఇటీవల ప్రచారంలో ఉన్న ఆరోపణలను ఖండిస్తూ, ఆస్తుల విషయంలో తప్పుడు ప్రచారం జరుగుతోందని విజయమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు నోటరీ ద్వారా అధికారిక ప్రకటన విడుదల చేసినట్లు తెలిపారు.

అలాగే, వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి మరియు వై.ఎస్. షర్మిల మధ్య జరిగిన ఒప్పందంలో పేర్కొన్న ఆస్తులు న్యాయంగా షర్మిలకు చెందాల్సినవేనని పేర్కొన్నారు. జగన్ స్వయంగా ఆ ఒప్పందాన్ని రాశారని, అందులో తనకు తక్కువే వాటా ఉన్నప్పటికీ అంగీకరించారని తెలిపారు.

ఇంకా, సరస్వతి సిమెంట్ వంటి ఆస్తులతో పాటు ఎం ఓ యులో ప్రస్తావించని యెలహంక భూమి కూడా షర్మిలకు చెందాల్సిందేనని విజయమ్మ పేర్కొన్నారు. ఇప్పటివరకు తన మనుమలు, మనుమరాళ్లకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు

“ఆస్తుల పంపకం జరగలేదు. ఇప్పుడు చెప్పబడుతున్న వాటాలు పంపకం కిందకు రావు. నిజం ఏమిటో దేవుడికీ, నా కొడుకుకీ తెలుసు” అని విజయమ్మ వ్యాఖ్యానించారు. అసత్య ప్రచారాలను నిలిపివేయాలని ఆమె మీడియా మరియు సంబంధిత వ్యక్తులను వేడుకున్నారు.

ఈ ప్రకటనతో కుటుంబంలో కొనసాగుతున్న ఆస్తుల వివాదం మరింత కీలక దశకు చేరుకుంది. భవిష్యత్తులో ఈ అంశం ఎటు దారి తీస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

This post was last modified on March 20, 2026 7:16 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

అప్పుల కష్టాల నుండి ఐపీఎల్ హీరో వరకు..

లక్నో సూపర్ జెయింట్స్ కొత్త సెన్సేషన్ ముకుల్ చౌదరి ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్. కేకేఆర్ పై అతను…

2 hours ago

ఆ రెడ్ల మౌనం వెనుక రహస్యం..?

వైసీపీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత పార్టీ అంతర్గత పరిస్థితులు కొత్త చర్చలకు దారితీస్తున్నాయి. ఒకప్పుడు అధికారం చుట్టూ తిరిగిన కీలక…

3 hours ago

ఎమ్మెల్సీ సీటుకి 30 కోట్లా?

రాజకీయం ఇప్పుడు డబ్బు చుట్టూ నడుస్తోంది. ఎవరు ఔనన్నా, ఎవరు కాదన్నా...ఇది పచ్చి నిజం. డబ్బు లేనిది ఏ ఒక్క…

3 hours ago

అతిథి చాలా పెద్ద రిస్కు చేస్తున్నాడు

ఈ మధ్య రీ రిలీజుల ట్రెండ్ కొత్త పోకడలు పోతోంది. మొదలైనప్పుడు కేవలం తెలుగు రాష్ట్రాలకు పరిమితం చేయడం దగ్గరి…

4 hours ago

ప్రేక్షకుల పట్ల బాధ్యత లేదా?

గతంలో ఒక సినిమాకు ఓ రిలీజ్ డేట్ ప్రకటించారు అంటే దాన్ని చాలా సీరియస్‌గా తీసుకునేవారు. ఎలాగైనా చెప్పిన డేటుకే…

5 hours ago

జన నాయగన్ పైరసీ వెనుక శత్రువులెవరు

నిన్న సాయంత్రం నుంచి విజయ్ అభిమానులకు నిద్ర రావడం లేదు. ముందు జన నాయకుడు లీక్స్ అంటూ తమిళ వెర్షన్…

6 hours ago