దివంగత మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి కుటుంబంలో ఆస్తుల వివాదం రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతోంది. ఇటీవల వై.ఎస్. షర్మిల చేసిన ఘాటు వ్యాఖ్యల అనంతరం ఈ వ్యవహారం మరింత రాజకీయ, కుటుంబ చర్చలకు దారితీసింది. ఈ నేపథ్యంలో తాజాగా వైఎస్ విజయమ్మ స్పందిస్తూ కీలక ప్రకటన విడుదల చేశారు.
వైఎస్ విజయమ్మ స్పష్టంచేసిన ప్రకారం., 2009లో వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి మరణించే వరకు కుటుంబ ఆస్తుల పంపకం అసలు జరగలేదని తెలిపారు. ఆ కాలం వరకు ఉన్న ఆస్తులన్నీ సంయుక్త కుటుంబ ఆస్తులేనని పేర్కొన్నారు. ఆస్తులను నలుగురు మనుమలకు సమానంగా పంచాలన్నదే వైఎస్సార్ ఆశయమని, అదే ఆయన ఆదేశమని వెల్లడించారు.
ఇటీవల ప్రచారంలో ఉన్న ఆరోపణలను ఖండిస్తూ, ఆస్తుల విషయంలో తప్పుడు ప్రచారం జరుగుతోందని విజయమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు నోటరీ ద్వారా అధికారిక ప్రకటన విడుదల చేసినట్లు తెలిపారు.
అలాగే, వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి మరియు వై.ఎస్. షర్మిల మధ్య జరిగిన ఒప్పందంలో పేర్కొన్న ఆస్తులు న్యాయంగా షర్మిలకు చెందాల్సినవేనని పేర్కొన్నారు. జగన్ స్వయంగా ఆ ఒప్పందాన్ని రాశారని, అందులో తనకు తక్కువే వాటా ఉన్నప్పటికీ అంగీకరించారని తెలిపారు.
ఇంకా, సరస్వతి సిమెంట్ వంటి ఆస్తులతో పాటు ఎం ఓ యులో ప్రస్తావించని యెలహంక భూమి కూడా షర్మిలకు చెందాల్సిందేనని విజయమ్మ పేర్కొన్నారు. ఇప్పటివరకు తన మనుమలు, మనుమరాళ్లకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు
“ఆస్తుల పంపకం జరగలేదు. ఇప్పుడు చెప్పబడుతున్న వాటాలు పంపకం కిందకు రావు. నిజం ఏమిటో దేవుడికీ, నా కొడుకుకీ తెలుసు” అని విజయమ్మ వ్యాఖ్యానించారు. అసత్య ప్రచారాలను నిలిపివేయాలని ఆమె మీడియా మరియు సంబంధిత వ్యక్తులను వేడుకున్నారు.
ఈ ప్రకటనతో కుటుంబంలో కొనసాగుతున్న ఆస్తుల వివాదం మరింత కీలక దశకు చేరుకుంది. భవిష్యత్తులో ఈ అంశం ఎటు దారి తీస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.
This post was last modified on March 20, 2026 7:16 pm
గాడ్ ఆఫ్ వార్.. ఇప్పటిదాకా ఫ్యామిలీ, యాక్షన్ ఎంటర్టైనర్లే తీస్తూ వచ్చిన అగ్ర దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తొలిసారిగా పాన్…
వైసీపీ అధినేత జగన్కు కొన్ని జాగ్రత్తలు సూచిస్తూ.. ఓ అపరిచిత ఐఏఎస్ లేఖ రాసినట్టు వైసీపీ నాయకులు చెబుతున్నారు. అయితే..…
ఒకప్పుడు తెలుగులో సీక్వెల్స్, ఫ్రాంఛైజీ సినిమాలనే మాటే ఉండేది కాదు. ‘మనీ’ లాంటి ఒకటీ అరా సినిమాలకు మాత్రమే సీక్వెల్స్…
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులు కావాలని..సీఎం రేవంత్ రెడ్డి క్యాబినెట్లో పనిచేయాలని చాలా మంది తలపోశారు. గత ఏడాది జరిగిన…
బాక్సాఫీస్ వద్ద చెడుగుడు ఆడుతున్న దురంధర్ ది రివెంజ్ సినిమాలో నటుడు రాకేష్ బేడీ పోషించిన పాత్ర ఓ రేంజ్…
వైయస్ షర్మిల ఇటీవల చేసిన తీవ్ర వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే…