Political News

“జగన్ నీకు ఏం అన్యాయం చేశాడు షర్మిలమ్మా?”

వైయస్ షర్మిల ఇటీవల చేసిన తీవ్ర వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి స్పందిస్తూ, “జగన్ నీకు ఏం అన్యాయం చేశాడో చెప్పమ్మా?” అంటూ ప్రశ్నించారు. ఇటీవల షర్మిల మాట్లాడుతూ, “అన్న అనే పదానికే కళంకం తీసుకొచ్చింది వైయస్ జగన్ మోహన్ రెడ్డి” అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “ఇలాంటి అన్న ఉంటే శత్రువులు అవసరం లేదు” అని పేర్కొంటూ కుటుంబ సంబంధాలపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. అలాగే, మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కడప ఎంపీ టికెట్ వివాదంతో సంబంధం ఉందని ఆరోపించారు. కడప ఎంపీ అభ్యర్థిగా అవినాష్ రెడ్డి ఎంపికపై వివేకా అభ్యంతరం వ్యక్తం చేశారని కూడా పేర్కొన్నారు.

ఈ వ్యాఖ్యలపై స్పందించిన రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, కుటుంబ వ్యవహారాలను బహిరంగంగా తీసుకువచ్చి రచ్చ చేయడం తగదన్నారు. అన్నాచెల్లెళ్ల మధ్య ఉన్న విషయాలను రాజకీయ వేదికలపై ప్రస్తావించడం సమంజసం కాదని చెప్పారు. జగన్ తన చెల్లెలు షర్మిలకు ఎప్పటికప్పుడు ఆర్థిక సహాయం అందించి, తండ్రికంటే ఎక్కువగా ఆదరించారని గుర్తుచేశారు. అలాంటి వ్యక్తిపై “అన్న అనే పదానికి కళంకం” అని వ్యాఖ్యానించడం అన్యాయమని పేర్కొన్నారు. ఇంత ప్రేమగా చూసుకున్న అన్నపై విమర్శలు చేయడమే కాకుండా, రాజకీయ ప్రత్యర్థులతో చేతులు కలిపి ఆరోపణలు చేయడం సరికాదన్నారు. కుటుంబ గౌరవాన్ని బహిరంగంగా దెబ్బతీయడం మంచిది కాదని హితవు పలికారు.

రాష్ట్రానికి మేలు చేసిన నాయకుడిగా జగన్‌ను దేశవ్యాప్తంగా ప్రశంసిస్తుండగా, అదే వ్యక్తిపై ఆరోపణలు చేయడం న్యాయమా అని ప్రశ్నించారు. ఇలాంటి వ్యాఖ్యలు మానుకుని, కుటుంబ పరమైన విషయాలను కుటుంబంలోనే పరిష్కరించుకోవాలని రాచమల్లు సూచించారు. ఇదిలా ఉండగా, షర్మిల వ్యాఖ్యలపై వైసీపీ నాయకులు తీవ్రంగా స్పందిస్తూ, ఆమె ఆరోపణలను ఖండిస్తున్నారు. రాజకీయ కారణాలతో కుటుంబ అంశాలను బయటకు తీసుకురావడం తగదని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.

Kumar

Recent Posts

అయ్యగారి జోరు అదిరింది

పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…

36 minutes ago

మ్యూజిక్ చిచ్చు పెట్టిన ‘గాడ్ ఆఫ్ వార్’

తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…

2 hours ago

ఎట్టకేలకు బూత్ స్థాయిపై జనసేన కన్ను

బూత్ స్థాయిలో బ‌లోపేతం అయ్యే దిశ‌గా జ‌న‌సేన క‌స‌ర‌త్తు షురూ చేసింది. ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయ‌కులు ఉన్న‌ప్ప‌టికీ..…

3 hours ago

రాజధాని భూముల రచ్చలో నిజమేంటి..?

ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…

4 hours ago

నాగ‌వంశీ చెప్పింది నిజమే

లెనిన్ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాత‌ల్లో ఒక‌రైన నాగ‌వంశీ. లెనిన్…

10 hours ago

పిల్లలు వద్దనుకుంటే సంపదను వదులుకున్నట్టే: చంద్రబాబు

పిల్లలు సంప‌ద అని సీఎం చంద్ర‌బాబు మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. తాను చెప్పిన మాటకే క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని తెలిపారు. దీనిని…

10 hours ago