Political News

“జగన్ నీకు ఏం అన్యాయం చేశాడు షర్మిలమ్మా?”

వైయస్ షర్మిల ఇటీవల చేసిన తీవ్ర వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి స్పందిస్తూ, “జగన్ నీకు ఏం అన్యాయం చేశాడో చెప్పమ్మా?” అంటూ ప్రశ్నించారు. ఇటీవల షర్మిల మాట్లాడుతూ, “అన్న అనే పదానికే కళంకం తీసుకొచ్చింది వైయస్ జగన్ మోహన్ రెడ్డి” అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “ఇలాంటి అన్న ఉంటే శత్రువులు అవసరం లేదు” అని పేర్కొంటూ కుటుంబ సంబంధాలపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. అలాగే, మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కడప ఎంపీ టికెట్ వివాదంతో సంబంధం ఉందని ఆరోపించారు. కడప ఎంపీ అభ్యర్థిగా అవినాష్ రెడ్డి ఎంపికపై వివేకా అభ్యంతరం వ్యక్తం చేశారని కూడా పేర్కొన్నారు.

ఈ వ్యాఖ్యలపై స్పందించిన రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, కుటుంబ వ్యవహారాలను బహిరంగంగా తీసుకువచ్చి రచ్చ చేయడం తగదన్నారు. అన్నాచెల్లెళ్ల మధ్య ఉన్న విషయాలను రాజకీయ వేదికలపై ప్రస్తావించడం సమంజసం కాదని చెప్పారు. జగన్ తన చెల్లెలు షర్మిలకు ఎప్పటికప్పుడు ఆర్థిక సహాయం అందించి, తండ్రికంటే ఎక్కువగా ఆదరించారని గుర్తుచేశారు. అలాంటి వ్యక్తిపై “అన్న అనే పదానికి కళంకం” అని వ్యాఖ్యానించడం అన్యాయమని పేర్కొన్నారు. ఇంత ప్రేమగా చూసుకున్న అన్నపై విమర్శలు చేయడమే కాకుండా, రాజకీయ ప్రత్యర్థులతో చేతులు కలిపి ఆరోపణలు చేయడం సరికాదన్నారు. కుటుంబ గౌరవాన్ని బహిరంగంగా దెబ్బతీయడం మంచిది కాదని హితవు పలికారు.

రాష్ట్రానికి మేలు చేసిన నాయకుడిగా జగన్‌ను దేశవ్యాప్తంగా ప్రశంసిస్తుండగా, అదే వ్యక్తిపై ఆరోపణలు చేయడం న్యాయమా అని ప్రశ్నించారు. ఇలాంటి వ్యాఖ్యలు మానుకుని, కుటుంబ పరమైన విషయాలను కుటుంబంలోనే పరిష్కరించుకోవాలని రాచమల్లు సూచించారు. ఇదిలా ఉండగా, షర్మిల వ్యాఖ్యలపై వైసీపీ నాయకులు తీవ్రంగా స్పందిస్తూ, ఆమె ఆరోపణలను ఖండిస్తున్నారు. రాజకీయ కారణాలతో కుటుంబ అంశాలను బయటకు తీసుకురావడం తగదని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.

This post was last modified on March 20, 2026 2:32 pm

Share

Recent Posts

మల్లెపూల పల్లకి… ఊగుతున్న థియేటర్లు

ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…

2 hours ago

శాశ్వత సెలవు తీసుకున్న షావుకారు జానకి

దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…

3 hours ago

సింగిల్ సింహం అంటారు… ఇదేం రాజకీయం జగన్?

ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…

3 hours ago

వివేకా కేసులో ముగియని సునీత పోరాటం

వివేకా హత్య కేసు విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతున్న వైనంపై వివేకా తనయురాలు సునీత అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి…

3 hours ago

రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దు… లండన్ నుంచే ఇండియాకు..

విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించడంతో తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయ్యింది. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం…

4 hours ago

కాంగ్రెస్ లో కొండా కార్చిచ్చు

సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…

6 hours ago