Political News

ఉగాది రోజు కూటమి కొలువుల కానుక

ఉద్యోగార్థులకు ఉగాది కానుకగా రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేసింది. మొత్తం 10,060 పోస్టులతో ఈ క్యాలెండర్‌ను విడుదల చేసినట్లు ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం ఉగాదిని పురస్కరించుకుని జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం సంతోషంగా ఉందని మంత్రి పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకుందని అన్నారు. యువతకు పారదర్శకంగా, సమయపాలనతో ఉద్యోగావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 10,060 ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్లు ఎప్పుడు విడుదలవుతాయో, ఎన్ని పోస్టులు భర్తీ చేస్తామో స్పష్టంగా తెలియజేస్తూ ఈ క్యాలెండర్‌ను రూపొందించినట్లు తెలిపారు. నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహించి ప్రకటించిన అన్ని పోస్టులను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు.

నియామక ప్రక్రియలో పారదర్శకతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని వెల్లడించారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీ ద్వారా 16 వేల ఉపాధ్యాయ పోస్టులు, 6 వేల కానిస్టేబుల్ పోస్టులు, వివిధ శాఖల్లో మరో 9 వేల ఉద్యోగాలను భర్తీ చేసినట్లు మంత్రి వివరించారు. దీంతో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వేగవంతమైందని చెప్పారు.

ఉద్యోగార్థులు నైపుణ్యం పోర్టల్‌లో వన్‌టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకుని నోటిఫికేషన్లు, పరీక్షల తేదీలు, ఇతర సమాచారం గురించి ముందుగానే అలర్ట్స్ పొందవచ్చని సూచించారు. పరీక్షల సిలబస్‌ను ముందుగానే ప్రకటించడం ద్వారా అభ్యర్థులు సమర్థంగా సిద్ధం కావడానికి సహకరిస్తామని తెలిపారు.

ప్రతి ఏడాది ఉగాదిని ఉద్యోగాల ప్రకటన పండగగా నిర్వహించాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. “నా మాట నేను నిలబెట్టుకున్నాను. ఇక మీ వంతు – పోటీ పరీక్షలకు సన్నద్ధం అవ్వండి. కృషి చేస్తే విజయం మీ సొంతం” అంటూ ఆయన యువతకు పిలుపునిచ్చారు. ఉద్యోగార్థులందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు.

Kumar

Recent Posts

మ్యూజిక్ చిచ్చు పెట్టిన ‘గాడ్ ఆఫ్ వార్’

తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…

24 minutes ago

ఎట్టకేలకు బూత్ స్థాయిపై జనసేన కన్ను

బూత్ స్థాయిలో బ‌లోపేతం అయ్యే దిశ‌గా జ‌న‌సేన క‌స‌ర‌త్తు షురూ చేసింది. ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయ‌కులు ఉన్న‌ప్ప‌టికీ..…

1 hour ago

రాజధాని భూముల రచ్చలో నిజమేంటి..?

ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…

2 hours ago

నాగ‌వంశీ చెప్పింది నిజమే

లెనిన్ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాత‌ల్లో ఒక‌రైన నాగ‌వంశీ. లెనిన్…

8 hours ago

పిల్లలు వద్దనుకుంటే సంపదను వదులుకున్నట్టే: చంద్రబాబు

పిల్లలు సంప‌ద అని సీఎం చంద్ర‌బాబు మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. తాను చెప్పిన మాటకే క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని తెలిపారు. దీనిని…

8 hours ago

విషాదం మిగిల్చిన విహారం… తెలుగువారు మృతి

వియ‌త్నాంలో విహార యాత్ర‌కు వెళ్లిన భార‌తీయుల కుటుంబాల్లో విషాదం నెల‌కొంది. ఊహించ‌ని ప్ర‌మాదంలో చిక్కుకుని 15 మంది భార‌తీయులు మృతి…

9 hours ago