Political News

ఉగాది రోజు కూటమి కొలువుల కానుక

ఉద్యోగార్థులకు ఉగాది కానుకగా రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేసింది. మొత్తం 10,060 పోస్టులతో ఈ క్యాలెండర్‌ను విడుదల చేసినట్లు ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం ఉగాదిని పురస్కరించుకుని జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం సంతోషంగా ఉందని మంత్రి పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకుందని అన్నారు. యువతకు పారదర్శకంగా, సమయపాలనతో ఉద్యోగావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 10,060 ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్లు ఎప్పుడు విడుదలవుతాయో, ఎన్ని పోస్టులు భర్తీ చేస్తామో స్పష్టంగా తెలియజేస్తూ ఈ క్యాలెండర్‌ను రూపొందించినట్లు తెలిపారు. నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహించి ప్రకటించిన అన్ని పోస్టులను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు.

నియామక ప్రక్రియలో పారదర్శకతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని వెల్లడించారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీ ద్వారా 16 వేల ఉపాధ్యాయ పోస్టులు, 6 వేల కానిస్టేబుల్ పోస్టులు, వివిధ శాఖల్లో మరో 9 వేల ఉద్యోగాలను భర్తీ చేసినట్లు మంత్రి వివరించారు. దీంతో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వేగవంతమైందని చెప్పారు.

ఉద్యోగార్థులు నైపుణ్యం పోర్టల్‌లో వన్‌టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకుని నోటిఫికేషన్లు, పరీక్షల తేదీలు, ఇతర సమాచారం గురించి ముందుగానే అలర్ట్స్ పొందవచ్చని సూచించారు. పరీక్షల సిలబస్‌ను ముందుగానే ప్రకటించడం ద్వారా అభ్యర్థులు సమర్థంగా సిద్ధం కావడానికి సహకరిస్తామని తెలిపారు.

ప్రతి ఏడాది ఉగాదిని ఉద్యోగాల ప్రకటన పండగగా నిర్వహించాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. “నా మాట నేను నిలబెట్టుకున్నాను. ఇక మీ వంతు – పోటీ పరీక్షలకు సన్నద్ధం అవ్వండి. కృషి చేస్తే విజయం మీ సొంతం” అంటూ ఆయన యువతకు పిలుపునిచ్చారు. ఉద్యోగార్థులందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు.

Kumar

Recent Posts

పవన్ పేరు ఎందుకు మారింది?

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను వెల్లడించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో…

4 hours ago

ఏపీ పాఠ‌శాల‌ల్లో చాగంటి పాఠ్యాంశాలు..!

ఏపీ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ప్ర‌ముఖ ప్ర‌వ‌చ క‌ర్త చాగంటి కోటేశ్వ‌ర‌రావు ప్ర‌సంగాల‌ను పాఠ్యాంశాలుగా ప్ర‌వేశ పెడుతున్నట్టు ప్ర‌క‌టించింది. దీనికి సంబంధించి…

5 hours ago

జ‌న‌’సేన’ జాగ్ర‌త్త ప‌డాలా?

ఏపీలో కూటమిగా ఏర్పడిన టిడిపి, జనసేన, బిజెపిలు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయింది. ఈ క్రమంలో కూటమికి నేతృత్వం…

7 hours ago

మీనాక్షి ఇష్యూ కాంగ్రెస్ ను ‘హర్ట్’ చేసింది!

ఓ రాజకీయ పార్టీ తనను వేధించిన విషయంపై అలుపెరగని పోరాటం చేసి తీరుతుంది. అలా చేయకుంటే… అది రాజకీయ పార్టీ…

8 hours ago

మోదీ రికార్డును బద్దలుకొట్టడం కష్టమే!

భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. దేశానికి అత్యధిక కాలం…

9 hours ago

పవన్ నోట మరోమారు ‘తెలంగాణ’ మాట

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోమారు తెలంగాణ అంశం మీద నోరు విప్పారు. భారత దేశంలో…

10 hours ago