ఏపీ రాజధాని అమరావతికి విగ్రహ శోభ వచ్చింది. ఇప్పటికే మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఇదే అమరావతిలో తొలి విగ్రహం.. కాగా, ఇప్పుడు అమరజీవి, ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన పొట్టి శ్రీరాములు భారీ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. దీనిని ఆయన 126వ జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు సోమవారం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని సాధించేందుకు అమరజీవి చేసిన త్యాగాలను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని సూచించారు. రాజధాని ప్రాంతంలోని శాఖమూరులో ఆయన విగ్రహం ఏర్పా టు చేయడం రాజధానికే వన్నెతెచ్చిందని చెప్పారు. రాష్ట్ర సాధన కోసం శ్రీరాములు 58 రోజులు దీక్ష చేసిన నేపథ్యాన్ని పురస్కరించుకుని 58 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు.
రాజధానితో ఆటలా!
గత వైసీపీ ప్రభుత్వంపై సీఎం చంద్రబాబు విమర్శలు గుప్పించారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేయాలని ప్రయత్నించారని దుయ్యబట్టారు. మూడు రాజధానులు అంటూ.. అమరావతిని నాశనం చేసే ప్రయత్నాలు చేశారని అన్నారు. కానీ, ఇక్కడి రైతులు మూడేళ్లపాటు పోరాటం చేసి రాజధానిని నిలబెట్టుకున్నారని తెలిపారు. వారి త్యాగాలను కూడా ప్రభుత్వం మరిచిపోదని, రాజధాని నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేస్తామని చంద్రబాబు చెప్పారు.
పొట్టి శ్రీరాములు విగ్రహం విశేషాలు..
మొత్తం ఎత్తు: 58 అడుగులు
వాడిన ఇత్తడి: 26 టన్నులు
వాడిన ఇనుము: 42 టన్నులు
సిమెంటు: రెండు లారీల లోడు
ఇసుక: 12 లారీలు
నిర్మాణానికి పట్టిన సమయం: 6 మాసాలు
This post was last modified on March 16, 2026 9:22 pm
ఈ వారం విడుదల కాబోతున్న వీరభద్రుడుకి హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు. దర్శకుడు ఆర్జె బాలాజీ కొన్ని…
సినిమా వాళ్లకు రాజకీయ ఆసక్తులు, అభిమానాలు ఉండడం కొత్త కాదు. అందులో తప్పు కూడా లేదు. ఐతే ఎప్పుడూ రాజకీయాల…
మొన్నటి దాకా జన నాయకుడు విడుదల మీద సవాలక్ష సందేహాలు. రెండు వారాల క్రితం ఏకంగా హెచ్డి ప్రింటుతో పైరసీ…
ఈ నెల 18 పెద్ది ట్రైలర్ విడుదల కానుంది. ముందు భోపాల్ అనుకున్నారు కానీ ఇప్పుడు ఈవెంట్ వేదికని ముంబైకి…
సూర్య వీరభద్రుడు ఇంకో మూడు రోజుల్లో విడుదల కానుంది. తమిళనాడులో రాజకీయ వాతావరణం వల్ల రిలీజ్ చేయాలా వద్దాని రెండు…
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాక కొన్ని రోజుల పాటు నడిచిన డ్రామాకు ఆదివారం తెరపడి, ఆదివారం నాడు తమిళ…