హీరోలు దర్శకత్వం చేయడం కొత్త కాదు. స్వర్గీయ ఎన్టీఆర్, సూపర్ స్టార్ కృష్ణలతో మొదలుకుని కమెడియన్లు ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఏవీఎస్, ఎంఎస్ నారాయణ దాకా ఎందరో ఈ ప్రయత్నాలు చేసినవాళ్ళే. కొందరు సక్సెస్ అయ్యారు, మరికొందరు విజయాన్ని చూడలేకపోయారు. కానీ ఇప్పటి జనరేషన్లో ఇలాంటి రిస్క్ ఎవరూ చేయడం లేదు. రెండో తరానికి చెందిన సీనియర్లు చిరంజీవి, బాలయ్య, నాగార్జున, వెంకటేష్ ఎవరూ దీని జోలికి వెళ్ళలేదు.
అయితే యూత్ హీరో కిరణ్ అబ్బవరం త్వరలోనే మెగా ఫోన్ చేపట్టబోతున్నట్టు లేటెస్ట్ అప్డేట్. తనే హీరోగా నటించబోయే మూవీలో యాక్షన్ కెమెరా చెప్పేందుకు రెడీ అవుతున్నాడని సమాచారం. సుధాకర్ చాగంటి నిర్మాతగా వ్యవహరించే ఈ మూవీకి భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూర్చనున్నారు. కిరణ్ ఇదివరకే రచయితగా తన ముద్ర చూపించిన సంగతి తెలిసిందే. ఎస్ఆర్ కల్యాణమండపంకు రచన తనదే. ఇతర సినిమాల్లోనూ క్రియేటివ్ కాంట్రిబ్యూషన్ ఇస్తుంటాడు.
సిద్దు జొన్నలగడ్డ లాంటి వాళ్లకు కూడా రైటింగ్ స్కిల్స్ ఉన్నప్పటికీ దర్శకత్వం చేయాలనే ఆలోచనైతే చేయలేదు. ఇప్పుడు ప్రత్యేకంగా కిరణ్ ఈ దారి ఎంచుకోవడం అనూహ్యమని చెప్పాలి. నిర్మాతగా తిమ్మరాజుపల్లె టీవీని వచ్చే నెల విడుదల చేయబోతున్న కిరణ్ అబ్బవరంకు రాబోయే రోజుల్లో యాక్టింగ్, ప్రొడక్షన్, డైరెక్షన్ మూడింటిని బ్యాలన్స్ చేయడం ఒకరకంగా కత్తి మీద సామే. అందులోనూ ఆర్టిస్ట్ గా బిజీగా నాలుగైదు సినిమాలు చేస్తున్న టైంలో.
దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది. ప్రస్తుతం చెన్నై లవ్ స్టోరీ పూర్తి చేసే పనిలో ఉన్న కిరణ్ అబ్బవరం దాని రూపంలో మరో సాలిడ్ హిట్ వస్తుందనే నమ్మకంతో ఉన్నాడు. కె ర్యాంప్ మంచి సక్సెస్ అయినప్పటికీ అన్ని వర్గాలను పూర్తి స్థాయిలో చేరలేదనే ఫీలింగ్ అభిమానుల్లో లేకపోలేదు. చెన్నై లవ్ స్టోరీతో అది నెరవేరుతుందని వాళ్ళ నమ్మకం. ఒకవేళ దర్శకుడిగా కూడా కిరణ్ అబ్బవరం హిట్టు కొడితే ప్రొడ్యూసర్లను తనకు డబుల్ ప్యాకేజ్ ఆఫర్ చేస్తారేమో.
సీనియర్లలో ఎక్కువ వేగంగా సినిమాలు చేస్తున్న హీరోల్లో మొదటి స్థానం బాలకృష్ణకే ఇవ్వాలి. ఎందుకంటే భోళాశంకర్ తర్వాత చిరంజీవి ఏకంగా…
ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇక నుంచి మరో లెక్క.. అన్నట్టుగా వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ పరిస్థితి…
పెద్ది మొదటి వారం పూర్తి చేసుకుని సెకండ్ వీక్ లో అడుగు పెట్టింది. మూడు వందల యాభై కోట్ల వైపు…
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను వెల్లడించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో…
పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఇందన పొదుపు దిశగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కీలక సూచనలు చేశాక… మన…
ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రముఖ ప్రవచ కర్త చాగంటి కోటేశ్వరరావు ప్రసంగాలను పాఠ్యాంశాలుగా ప్రవేశ పెడుతున్నట్టు ప్రకటించింది. దీనికి సంబంధించి…