తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారం కేసును రెండేళ్ల నుంచి కార్తీక దీపం సీరియల్ మాదిరి లాగుతున్నారని బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావు విమర్శించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో కేటీఆర్, హరీశ్ రావు, సంతోష్ రావు, కేసీఆర్ లను విచారణ జరిపారు. ఈ క్రమంలోనే ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఐపీఎస్, తెలంగాణ మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావుకు సుప్రీం కోర్టు భారీ ఊరటనిచ్చింది.
అరెస్టు నుంచి ప్రభాకర్ రావుకు మినహాయింపునివ్వాలని సుప్రీం కోర్టు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, దర్యాప్తును ఆయన సహకరించాల్సిందేనని సుప్రీం తేల్చి చెప్పింది. అంతేకాదు, సాక్ష్యాలు, ఆధారాలు ట్యాంప్ చేయడం, సాక్ష్యులను ప్రభావితం వంటి పనులు చేస్తే ముందస్తు బెయిల్ రద్దవుతుందని హెచ్చరించింది. ఇక, ట్రయల్ కోర్టు అనుమతి లేనిదే ఎక్కడికీ వెళ్లకూడదని ఆదేశించింది.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో డీఐజీ హోదాలో ఉన్న ప్రభాకర రావును 2016లో ఎస్ఐబీ చీఫ్ గా కావాలనే అప్పటి ప్రభుత్వం నియమించిందని ఆరోపణలున్నాయి. బీఆర్ఎస్ సర్కార్ కు అనుకూలంగా ఆయన వ్యవహరించి పలువురి ఫోన్లు ట్యాప్ చేయించారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.
అయితే, రిటైర్ అయిన తర్వాత ప్రభాకర్ రావును కాంగ్రెస్ ప్రభుత్వం వేధిస్తోందని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా…ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు ఇప్పట్లో ముగింపు లేనట్లే కనిపిస్తోంది.
This post was last modified on March 10, 2026 4:35 pm
తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు ఎప్పటికప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి. గ్రాండ్ ఓల్డ్ పార్టీలో ఈ తరహా పరిస్థితులు కొత్తేమీ…
అక్కినేని యువ కథానాయకుడు అఖిల్ హీరోగా స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి రూపొందించిన ‘ఏజెంట్’ టాలీవుడ్ చరిత్రలోనే అతి పెద్ద…
ఒక సినిమా రిలీజైన రెండు మూడేళ్ల తర్వాత కూడా దాని కలెక్షన్ల గురించి విపరీతమైన చర్చ జరగడం అరుదు. ‘దేవర’ విషయంలో ఇదే…
కేంద్ర విద్యా శాఖకు నూతన మంత్రిగా బీజేపీ సీనియర్ నేత, కేంద్ర కేబినెట్ లో కీలక శాఖల మంత్రిగా కొనసాగుతున్న ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు.…
బాక్సాఫీస్ దగ్గర పోటీ ఉన్నప్పుడు కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు జరుగుతాయి. ఇది అలాంటిదే. కేవలం ఒక్క రోజు గ్యాప్ తో…
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులను సొంతం చేసుకున్న స్పైడర్ మ్యాన్ సిరీస్ లోని కొత్త సినిమా బ్రాండ్ న్యూ డే జూలై…