తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారం కేసును రెండేళ్ల నుంచి కార్తీక దీపం సీరియల్ మాదిరి లాగుతున్నారని బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావు విమర్శించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో కేటీఆర్, హరీశ్ రావు, సంతోష్ రావు, కేసీఆర్ లను విచారణ జరిపారు. ఈ క్రమంలోనే ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఐపీఎస్, తెలంగాణ మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావుకు సుప్రీం కోర్టు భారీ ఊరటనిచ్చింది.
అరెస్టు నుంచి ప్రభాకర్ రావుకు మినహాయింపునివ్వాలని సుప్రీం కోర్టు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, దర్యాప్తును ఆయన సహకరించాల్సిందేనని సుప్రీం తేల్చి చెప్పింది. అంతేకాదు, సాక్ష్యాలు, ఆధారాలు ట్యాంప్ చేయడం, సాక్ష్యులను ప్రభావితం వంటి పనులు చేస్తే ముందస్తు బెయిల్ రద్దవుతుందని హెచ్చరించింది. ఇక, ట్రయల్ కోర్టు అనుమతి లేనిదే ఎక్కడికీ వెళ్లకూడదని ఆదేశించింది.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో డీఐజీ హోదాలో ఉన్న ప్రభాకర రావును 2016లో ఎస్ఐబీ చీఫ్ గా కావాలనే అప్పటి ప్రభుత్వం నియమించిందని ఆరోపణలున్నాయి. బీఆర్ఎస్ సర్కార్ కు అనుకూలంగా ఆయన వ్యవహరించి పలువురి ఫోన్లు ట్యాప్ చేయించారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.
అయితే, రిటైర్ అయిన తర్వాత ప్రభాకర్ రావును కాంగ్రెస్ ప్రభుత్వం వేధిస్తోందని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా…ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు ఇప్పట్లో ముగింపు లేనట్లే కనిపిస్తోంది.
గొడవలు కానీ మనస్పర్థలతో కానీ భార్యతో భర్త మాట్లాడకపోవటం గృహ హింస కిందకు వస్తుందా? మాట్లాడకుండా ఉండటం వేధింపులకు గురి…
‘బాహుబలి’కి ముందు ప్రభాస్ కెరీర్లో అత్యంత హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘రెబల్’ ఒకటి. కింగ్ నాగార్జునతో ‘మాస్’ లాంటి బ్లాక్…
అదేంటి లెనిన్ మీద మెగా ఫ్యాన్స్ కి కోపం ఎందుకు వస్తుందనుకుంటున్నారా. మ్యాటర్ ఉంది లెండి. కొంచెం ఫ్లాష్ బ్యాక్…
రెండో సినిమా మగధీరతోనే తాను తండ్రికి తగ్గ తనయుడిని అని చాటుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఇక…
ఏపీ ప్రభుత్వానికి.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పోలీసులకు కూడా ఓ కేసు సవాల్గా మారింది. ఓ చిన్నారి అదృశ్యం కేసు…
ఇండియన్ సినిమాలో చాలా తక్కువమంది హీరోయిన్లకు సాధ్యమైన హీరోయిక్ ఇమేజ్ సాధించింది కంగనా రనౌత్ ఒక దశలో. ఇండియాలో వంద…