Political News

ఈ `తెలివి` తేట‌లు సీఎం రేవంత్ వేనా?

తెలివి ఎవ‌రి సొత్తూ కాదు. ఐడియా ఉండాలేకానీ.. ఎంత క‌ష్ట‌మైన పనైనా సులువుగా మారిపోవ‌డంతోపాటు సులువుగా మార్చుకోవ‌డానికి కూడా అవ‌కాశం ఉంటుంది. ఇప్పుడు ఇలాంటి ఓ అద్భుత‌మైన ఐడియానే తెలంగాణ ప్ర‌భుత్వం చేసింది. డ‌బ్బుల‌తో ప‌నిలేకుండా.. పొరుగు రాష్ట్రాల నుంచి విద్యుత్ కొనుగోలు చేయ‌డ‌మే ఈ ఐడియా సారాంశం. ఇది కొంత వింత‌గా ఉన్న‌ప్ప‌టికీ.. కాంగ్రెస్ పాలిత తెలంగాణ‌లో త్వ‌ర‌లోనే ఇది అమ‌ల్లోకి రానుంది. దీనికి సంబంధించిన ఒప్పందాలు కూడా పూర్త‌య్యాయట‌.

కాంగ్రెస్ స‌ర్కారుకు బీజేపీ నుంచి..

తెలంగాణ‌లోని కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి.. బీజేపీకి మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేసినా భ‌గ్గుమ‌నే ప‌రిస్థితి ఉన్న విష‌యం తెలిసిందే. అయితే.. తాజాగా విద్యుత్ ఇచ్చి-వ‌డ్డీతో పుచ్చుకునే ఒప్పందానికి బీజేపీ పాలిత ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం ముందుకు రావ‌డం గ‌మ‌నార్హం. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌స్తుతం మిగులుగా ఉన్న విద్యుత్‌ను అప్పుగా తెలంగాణ‌కు ఇస్తారు. ఆ త‌ర్వాత‌.. తెలంగాణ మిగులులోకి వెళ్ల‌గానే.. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌కు కొంత వ‌డ్డీ రూపంలో అద‌నంగా విద్యుత్‌ను క‌లిపి తిరిగి ఇచ్చేస్తారు. ఇదీ.. ఒప్పందం. దేశ చ‌రిత్రలో ఇలా.. ఒక ప్ర‌భుత్వం నుంచి మ‌రో ప్ర‌భుత్వం అప్పుగా వ‌న‌రులు తీసుకోవ‌డం.. దానిని వ‌న‌రుల రూపంలో తిరిగి చెల్లించ‌డం ఇదే తొలిసారి అని అంటున్నారు ప‌రిశీల‌కులు.

రోజుకు ఎంత‌?

ప్ర‌స్తుత అవ‌స‌రాల‌కు అనుగుణంగా ఉత్ప‌త్తిచేసిన విద్యుత్‌లో ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌కు రోజుకు 3 వేల మెగావాట్ల‌కు పైగానే విద్యుత్ మిగిలిపోతోంది. అక్క‌డ ఇప్పుడు పంట‌లు లేవు. దీంతో యూపీలో విద్యుత్ వినియోగం త‌గ్గింది. కానీ, ఉత్ప‌త్తి మాత్రం త‌గ్గలేదు.

ఈ విష‌యం తెలుసుకున్న తెలంగాణ స‌ర్కారు.. అక్క‌డి అధికారులు, ప్ర‌భుత్వంతో చ‌ర్చ‌లు జ‌రిపారు. డ‌బ్బులు కాదు.. విద్యుత్ టు విద్యుత్ వ‌డ్డీతో స‌హా ఇచ్చిపుచ్చుకునేలా ఒప్పందానికి వ‌ద్దామ‌ని నిర్ణ‌యించుకున్నారు. అనంత‌రం ఈ ఒప్పందం కుదిరింది. దీని ప్ర‌కారం .. రోజుకు 3 వేల మెగావాట్ల విద్యుత్‌ను తెలంగాణ ప్ర‌భుత్వం తీసుకుంది. దీనిని మిగులు స‌మ‌యంలో 5 శాతం అద‌నంగా.. విద్యుత్‌ను వ‌డ్డీ రూపంలో క‌లిపి.. తిరిగి ఇచ్చేయనుంది.

మంచి ఐడియా!

తెలంగాణ ప్ర‌భుత్వం.. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఈఐడియాపై విద్యుత్ రంగ నిపుణులు హర్షం వ్య‌క్తం చేస్తున్నారు. డ‌బ్బుల‌తో ప‌నిలేకుండా.. విద్యుత్ టు విద్యుత్ అప్పుగా తీసుకుని.. తిరిగి చెల్లించే విధానాన్ని వారు ప్ర‌శంసిస్తున్నారు.

త‌ద్వారా.. రాష్ట్రంపై ఆర్థిక భారం త‌ప్పుతుంద‌ని.. అదేస‌మ‌యంలో రాష్ట్ర అవ‌స‌రాల‌కు కీల‌క‌మైన విద్యుత్ స‌మ‌యానికి అందుతుంద‌ని పేర్కొంటున్నారు. ఇక‌, రాష్ట్రంలో ఇప్పుడు విద్యుత్ అవ‌స‌రం. మ‌రో మూడు మాసాల్లో వ‌ర్షాలు ప్రారంభం అయితే.. అప్పుడు ఇక్క‌డ విద్యుత్ ఉత్ప‌త్తి పెరుగుతుంది. త‌ద్వారా తీసుకున్న విద్యుత్‌ను తిరిగి ఇచ్చేయొచ్చ‌ని చెబుతున్నారు.

This post was last modified on March 9, 2026 2:58 pm

Share

Recent Posts

మాస్ రాజా తాప‌త్ర‌యమే కానీ… వాళ్లు చూస్తారా?

మాస్ రాజా ర‌వితేజ కొత్త సినిమా ఇరుముడి తెలుగు రాష్ట్రాల‌తో పాటు తెలుగు వాళ్లుండే ప్ర‌తి చోటా ఇర‌గాడేస్తోంది. తెలుగులో…

1 hour ago

నాగ చైతన్య అయితే సెట్ అయ్యేదా

బాక్సాఫీస్ వద్ద వీర విహారం చేస్తున్న ఇరుముడి ఎక్కడికి వెళ్తుందో ఎవరికి అంతు చిక్కడం లేదు. పాజిటివ్ టాక్ రావడంలో…

2 hours ago

రాకా సెట్లో మంచు లక్ష్మి… వావ్ వావ్ వావ్

అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ కొత్త సినిమా ‘రాకా’ మొదలైనపుడే అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. సన్ పిక్చర్స్ ప్రొడక్షన్లో…

5 hours ago

విశాఖలో విద్యార్థుల లవ్ వార్… హద్దు మీరిపోయారు!

విశాఖపట్నంలో విద్యార్థులు చెలరేగిపోయారు. ప్రేమ వ్యవహారంలో రెండు గ్రూపులుగా విడిపోయి కర్రలు, రాడ్లు పట్టుకొని రోడ్డెక్కారు. సినిమా తరహాలో నడి…

5 hours ago

చివరి సినిమా టోటల్ కలెక్షన్లు… ఒక్క రోజులోనే ఔట్

మాస్ రాజా రవితేజ నుంచి సరైన సినిమా వస్తే.. పరిస్థితులు కూడా అనుకూలిస్తే బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో…

5 hours ago

సందీప్ వెర్సస్ దీపిక… మళ్లీ రాజుకుంది

ప్రభాస్, సందీప్ రెడ్డి వంగల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ సినిమా నుంచి దీపికా పదుకొనేను తప్పించడం మీద ఎప్పుడో…

5 hours ago