పెద్దగా హడావిడి చేయకుండా, సైలెంటుగా షూటింగ్ జరుపుకుంటున్న క్రేజీ సినిమాల్లో ఆదర్శ కుటుంబం ఒకటి. వెంకటేష్, శ్రీనిధి శెట్టి జంటగా నటిస్తున్న ఈ మూవీకి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. బ్రేకుల్లేకుండా ప్లానింగ్ కు అనుగుణంగా షూట్ చేసేస్తున్నారు. అక్టోబర్ రెండు విడుదలని టార్గెట్ గా పెట్టుకున్నట్టు టాక్ ఉంది కానీ దీన్ని ఇప్పట్లో అధికారికంగా ప్రకటించకపోవచ్చు. వేసవి నుంచి ప్రమోషనల్ అప్డేట్స్ వదలాలని నిర్ణయించుకున్నారట.
ఇది పక్కనపెడితే పైకి టైటిల్ సాఫ్ట్ గా ఉన్నా క్యాప్షన్ లో ఉన్న ఏకే 47కు తగ్గట్టు ఇందులో యాక్షన్ ఎలిమెంట్స్ బలంగా ఉంటాయని ఇన్ సైడ్ టాక్. ఇంటర్వెల్ వరకు సరదాగా సాగుతూ, మల్లీశ్వరి – నువ్వు నాకు నచ్చావ్ తరహాలో ఫన్ నడిపిస్తూ ఒక్కసారిగా ఇంటర్వెల్ బ్లాక్ దగ్గర పెద్ద మలుపు పెట్టారని వినికిడి. ఇక్కడి నుంచి కథా గమనం మారిపోయి మహేష్ బాబు అతడు తరహా ట్రీట్ మెంట్ తో మాటల మాంత్రికుడు మరోసారి తనదైన మార్కు బయటకి తీస్తారని యూనిట్ లీక్.
గుంటూరు కారంలో జరిగిన పొరపాట్లకు ఈసారి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా అల వైకుంఠపురములో ప్లస్ అతడుని కలగలిపి దానికి వెంకీ మార్కు టైమింగ్ జోడిస్తే అదే ఆదర్శ కుటుంబం అంటున్నారు. అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా రూపొందుతోందట. ఈ కాంబో కోసం సంవత్సరాల తరబడి ఎదురు చూసిన మూవీ లవర్స్ కోరికకు అనుగుణంగా పర్ఫెక్ట్ అవుట్ ఫుట్ వస్తోందని అంటున్నారు. త్రివిక్రమ్ కు ఆదర్శ కుటుంబం బ్లాక్ బస్టర్ కావడం చాలా అవసరం.
ఎందుకంటే నెక్స్ట్ ప్లాన్ చేసుకున్న ప్యాన్ ఇండియా మూవీకి బజ్ మరింత పెరగాలంటే దీంతో అదిరిపోయే హిట్టు కొట్టాలి. గాడ్ అఫ్ వార్ (ప్రచారంలో ఉన్న టైటిల్) జూనియర్ ఎన్టీఆరా లేక అల్లు అర్జునా అనే ప్రచారానికి ఇంకా చెక్ పడలేదు కానీ మే నెలలో తారక్ పుట్టినరోజు సందర్భంగా ఒక క్లారిటీ రావొచ్చని అంటున్నారు. యానిమల్, అర్జున్ రెడ్డి ఫేమ్ హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం సమకూరుస్తున్న ఈ యాక్షన్ కం ఫ్యామిలీ డ్రామాలో మ్యూజిక్ కూడా హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తుందట.
This post was last modified on March 6, 2026 3:54 pm
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…
గత పది రోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…
నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…