Political News

సభకు బొత్స… లోకేష్ ఆత్మీయ పలకరింపు

ఇటీవల అనారోగ్యంతో బాధపడి కోలుకున్న ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ శుక్రవారం ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ ఆయనను ఆత్మీయంగా పలకరించారు. సభలో చోటుచేసుకున్న ఈ సంఘటన రాజకీయ హుందాతనానికి ఉదాహరణగా నిలిచింది.

సభా కార్యక్రమాల మధ్యలో బొత్స సత్యనారాయణను ఉద్దేశించి “బొత్స సత్యనారాయణ గారు నమస్కారం” అంటూ మంత్రి లోకేష్ పలకరించారు. ఆయన వినకపోవడంతో మండలి చైర్మన్ జోక్యం చేసుకుని “మంత్రి నారా లోకేష్ మిమ్మల్ని పరామర్శిస్తున్నారు” అని బొత్సకు తెలియజేశారు. వెంటనే స్పందించిన లోకేష్, “గురువుగారు చిన్న అనారోగ్య సమస్యతో బాధపడ్డారు. ఆయన తిరిగి ఆరోగ్యంగా హౌస్‌కు రావడం ఆనందంగా ఉంది. వెల్కమ్ టు ది హౌస్” అని వ్యాఖ్యానించారు.

ఇటీవల బొత్స సత్యనారాయణ అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. వైద్యుల పర్యవేక్షణలో కొద్ది రోజుల చికిత్స అనంతరం ఆయన కోలుకున్నారు.

అనంతరం సోషల్ మీడియాలో తన ఆరోగ్యంపై వస్తున్న వార్తల నేపథ్యంలో స్పందించిన బొత్స, ఆందోళన అవసరం లేదని, తాను క్షేమంగా ఉన్నానని వెల్లడించారు. అనారోగ్యం నుంచి కోలుకుని తిరిగి సభకు వచ్చిన బొత్సను పలకరిస్తూ “మీ ఆరోగ్యం ఎలా ఉంది? మిమ్మల్ని చూడటం ఆనందంగా ఉంది” అని మంత్రి లోకేష్ అడగడం సభలో చర్చనీయాంశమైంది. రాజకీయాల్లో విభేదాలు ఉన్నప్పటికీ వ్యక్తిగత స్థాయిలో పరస్పర గౌరవం, మర్యాద చూపడం మంచి సంప్రదాయం అని పలువురు సభ్యులు అభిప్రాయపడ్డారు. 

ప్రతిపక్ష నేత అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో త్వరగా కోలుకోవాలని కోరుకున్న మంత్రి లోకేష్, ఆయన తిరిగి సభకు వచ్చిన సందర్భంగా స్వాగతం పలకడం రాజకీయాల్లో మానవీయ విలువలను ప్రతిబింబిస్తుందని టీడీపీ సభ్యులు పేర్కొన్నారు. విభిన్న రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు అయినప్పటికీ పరస్పర గౌరవంతో వ్యవహరించడం ప్రజాస్వామ్యానికి మేలు చేస్తుందని వారు అభిప్రాయపడ్డారు.

This post was last modified on March 6, 2026 4:28 pm

Share
Show comments
Published by
Kumar
Tags: BotsaLokesh

Recent Posts

త్రివిక్రమ్… ఆ ఒక్క సీన్‌లో అసలైన స్టఫ్?

వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటేనే ఒక ప్రత్యేకమైన బ్రాండ్. గతంలో వీరిద్దరూ కలిసి చేసిన సినిమాలు (రచయితగా మల్లీశ్వరి,…

26 minutes ago

జ‌న‌సేన ఎమ్మెల్యేకు బాబు కితాబు

సాధార‌ణంగా త‌న పార్టీ ఎమ్మెల్యేల‌కు, ప్ర‌జాప్ర‌తినిధులు ఆయా పార్టీలు ప్రాధాన్యం ఇస్తాయి. వారి ప‌నితీరు మెచ్చుకుంటాయి. మ‌రింత మెరుగు ప‌రుచుకోవాల‌ని…

38 minutes ago

బెంగళూరులో టెకీ జంట సూసైడ్… ఇద్దరు తెలుగువారే

షాకింగ్ విషాద ఉదంతం చోటు చేసుకుంది. కాస్త ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఉదంతంలో ఆత్మహత్య చేసుకున్న ఇద్దరు తెలంగాణ…

1 hour ago

కల్కి 2… సుప్రీమ్ బలాన్ని పెంచుతున్న నాగ్ అశ్విన్?

ప్రభాస్ సైన్స్ ఫిక్షన్ విజువల్ వండర్ ‘కల్కి 2898 ఏడీ’ బాక్సాఫీస్ దగ్గర సృష్టించిన ప్రభావాన్ని ఎవరూ మర్చిపోలేరు. మొదటి…

1 hour ago

వైభవ్ సూర్యవంశీ… ఎందుకంత తొందర?

​రాజస్థాన్ రాయల్స్ సంచలనం, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ టీమ్ ఇండియా ఎంట్రీపై వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర…

1 hour ago

రాకాస మీద ప్రాణాలు పెట్టుకున్నారు

ఈ శుక్రవారం విడుదల కాబోతున్న రాకాస మీద టీమ్ మొత్తం ప్రాణాలు పెట్టేసుకుంది. నిర్మాత నీహారిక కొణిదెల చాలా యాక్టివ్…

2 hours ago