కోకాపేటలో అత్యంత ఖరీదైన 2 ఎకరాల భూములను శారదా పీఠానికి కట్టబెట్టడం సరైంది కాదంటూ తెలంగాణ ప్రభుత్వం వాటిని రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ విషయాన్ని స్వయంగా ముఖ్యమంత్రి చెప్పారని పేర్కొంటూ సీఎం రేవంత్ రెడ్డి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. దీంతో శారదా పీఠానికి ఇచ్చిన భూములను రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది.
బీఆర్ ఎస్ హయాంలో శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఎంతో సన్నిహితంగా ఉన్న విషయం తెలిసిందే. ఆ తర్వాత కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి కావాలని రాజశ్యామల యాగం కూడా నిర్వహించారు. అనంతరం ఈ మఠానికి 2 ఎకరాల పైచిలుకు ఖరీదైన భూములను కేటాయించారన్న వార్తలు వచ్చాయి. దీనికి సంబంధించిన జీవో కూడా తర్వాత వెలువడింది.
అయితే ఇటీవల తెలంగాణ జలమండలి అధికారులు ఆ ప్రాంతం తమకు అవసరమని కోరడంతో ప్రభుత్వం అంగీకరించింది. దీనిపై అనేక చర్చలు జరిగాయి. చివరకు ఆదివారం సాయంత్రం నాటికి మఠానికి సంబంధించిన భూముల కేటాయింపును రద్దు చేస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.
ఇక దీనికి ముందే బీఆర్ ఎస్ నాయకులు అలర్ట్ అయ్యారు. శారదా పీఠానికి కేటాయించిన భూములను రద్దు చేస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు ప్రారంభించారు. ఆ తర్వాత బీజేపీ నాయకులు కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. శారదా మఠం భూములను రద్దు చేయడం అంటే హిందువులను అవమానించినట్టేనని బీజేపీ నేతలు ఆరోపించారు.
ఈ పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం వెనక్కి తగ్గి యూటర్న్ తీసుకుంది. వివాదం మరింత పెరగకుండా బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును రంగంలోకి దింపింది. ఆయన నేరుగా శారదా పీఠానికి చేరుకుని అధికారులు మరియు ఉత్తరాధికారులతో చర్చలు జరిపారు. సరైన సమాచారం లేకపోవడం వల్లే ఈ గందరగోళం జరిగిందని వివరించారు. మీరు సజావుగా మీ కార్యక్రమాలు కొనసాగించవచ్చని హామీ ఇచ్చారు.
మొత్తానికి శారదా మఠం భూముల విషయంలో ప్రభుత్వం యూటర్న్ తీసుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
This post was last modified on March 2, 2026 4:17 pm
తెలంగాణపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయన్న వాదన వినిపిస్తోంది. గతంలో ఆయన పార్లమెంటులో…
తమిళనాడు రాజకీయాల్లో యువ నాయకత్వానికి కొత్త గుర్తింపుగా నిలిచిన టీవీకే నేత ఎస్. కీర్తన సంపత్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో…
సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ సూర్య హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన విశ్వనాథ్ అండ్ సన్స్ కు ముందు…
హీరోగా అవకాశాలు ఆగిపోయిన టైంలో ‘లెజెండ్’ సినిమాతో విలన్ అవతారం ఎత్తారు సీనియర్ నటుడు జగపతిబాబు. దీంతో ఓవర్ నైట్…
తమిళ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా నడుస్తున్న రాజకీయ సందిగ్ధతకు ఎట్టకేలకు తెరపడింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మద్దతును టీవీకే…
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం నాటి హైదరాబాద్ పర్యటన సాంతం ఆసక్తికరంగానే సాగింది. తెలంగాణ పర్యటనకు వచ్చిన మోదీ……