కోకాపేటలో అత్యంత ఖరీదైన 2 ఎకరాల భూములను శారదా పీఠానికి కట్టబెట్టడం సరైంది కాదంటూ తెలంగాణ ప్రభుత్వం వాటిని రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ విషయాన్ని స్వయంగా ముఖ్యమంత్రి చెప్పారని పేర్కొంటూ సీఎం రేవంత్ రెడ్డి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. దీంతో శారదా పీఠానికి ఇచ్చిన భూములను రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది.
బీఆర్ ఎస్ హయాంలో శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఎంతో సన్నిహితంగా ఉన్న విషయం తెలిసిందే. ఆ తర్వాత కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి కావాలని రాజశ్యామల యాగం కూడా నిర్వహించారు. అనంతరం ఈ మఠానికి 2 ఎకరాల పైచిలుకు ఖరీదైన భూములను కేటాయించారన్న వార్తలు వచ్చాయి. దీనికి సంబంధించిన జీవో కూడా తర్వాత వెలువడింది.
అయితే ఇటీవల తెలంగాణ జలమండలి అధికారులు ఆ ప్రాంతం తమకు అవసరమని కోరడంతో ప్రభుత్వం అంగీకరించింది. దీనిపై అనేక చర్చలు జరిగాయి. చివరకు ఆదివారం సాయంత్రం నాటికి మఠానికి సంబంధించిన భూముల కేటాయింపును రద్దు చేస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.
ఇక దీనికి ముందే బీఆర్ ఎస్ నాయకులు అలర్ట్ అయ్యారు. శారదా పీఠానికి కేటాయించిన భూములను రద్దు చేస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు ప్రారంభించారు. ఆ తర్వాత బీజేపీ నాయకులు కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. శారదా మఠం భూములను రద్దు చేయడం అంటే హిందువులను అవమానించినట్టేనని బీజేపీ నేతలు ఆరోపించారు.
ఈ పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం వెనక్కి తగ్గి యూటర్న్ తీసుకుంది. వివాదం మరింత పెరగకుండా బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును రంగంలోకి దింపింది. ఆయన నేరుగా శారదా పీఠానికి చేరుకుని అధికారులు మరియు ఉత్తరాధికారులతో చర్చలు జరిపారు. సరైన సమాచారం లేకపోవడం వల్లే ఈ గందరగోళం జరిగిందని వివరించారు. మీరు సజావుగా మీ కార్యక్రమాలు కొనసాగించవచ్చని హామీ ఇచ్చారు.
మొత్తానికి శారదా మఠం భూముల విషయంలో ప్రభుత్వం యూటర్న్ తీసుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
This post was last modified on March 2, 2026 4:17 pm
సినిమా నటులు ఎందరో రాజకీయ నాయకులయ్యారు. అయితే ప్రజల మనసులో బలమైన ముద్ర వేసిన వాళ్ళు మాత్రం కొందరే ఉంటారు.…
మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో ఇండియా టుడే సీ ఓటర్ చేసిన సర్వే తమిళనాడు టీవీకే, కాంగ్రెస్ కాపురం…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ( SIR ) చిక్కుముడిగా మారింది.…
కూటమిలో భాగస్వామి అయిన జనసేన పార్టీ ఎమ్మెల్యే పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. పనితీరు బాగోలేని…
ఏపీ వాసులకు బీపీ పెరిగిపోతుంది.. దాంతోపాటు మధుమేహ వ్యాధి కూడా..! రాష్ట్రంలో అసంక్రమిత వ్యాధులను ముందుగానే గుర్తించి సకాలంలో చికిత్స…
సినిమా షూటింగ్ లో భాగంగా ఆర్టిస్టులు కొన్నిసార్లు రిస్కీ స్టంట్లు చెయ్యాల్సి ఉంటుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే కొన్నిసార్లు…