Political News

హుటాహుటిన పేలుడు ప్రాంతానికి.. బాధితులకు బాబు అండ!

కాకినాడ జిల్లా సామర్లకోట సమీపంలోని వేట్లపాలెంలో సంభవించిన భారీ పేలుడు ఘటన రాష్ట్రం మొత్తాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. శనివారం మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల మధ్య జరిగిన ఈ విస్ఫోటనంలో తొలుత నలుగురు మృతి చెందినట్లు వార్తలు వచ్చినా, ఆ సంఖ్య సాయంత్రానికి 24 మందికి చేరింది. పది సంఖ్యలో బాధితులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

ఈ ఘటన విషయం తెలిసిన వెంటనే సీఎం చంద్రబాబు స్పందించారు. విజయనగరంలో పర్యటనలో ఉన్న ఆయన షెడ్యూల్ ప్రకారం సాయంత్రం వరకు అక్కడే ఉండాల్సి ఉంది. అయితే ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే తన విజయనగరం పర్యటనను ముగించుకుని కాకినాడకు బయలుదేరారు.

సాయంత్రం 6.30 గంటల సమయంలో ఆయన రోడ్డు మార్గంలో కాకినాడకు చేరుకుని అక్కడి నుంచి బాధిత ప్రాంతానికి వెళ్లారు. ఘటన స్థలిని కాలినడకన పరిశీలించిన చంద్రబాబు పేలుడు ఎలా సంభవించిందన్న విషయంపై కలెక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలను పరామర్శించారు. అలాగే అక్కడ చేపట్టిన సహాయక చర్యలపై అధికారులను ప్రశ్నించారు.

ఫ్లడ్ లైట్ల వెలుగులో..

సాయంత్రం 6.30 గంటలకు ఘటన ప్రాంతానికి చేరుకున్నప్పటికీ ఆ ప్రాంతం పొలాల మధ్య ఉండడం, విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో పర్యటన చీకటిలోనే సాగింది. అధికారులు వెంటనే ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేశారు. ఆ వెలుగులోనే చంద్రబాబు ప్రతి మూలను పరిశీలించారు. కుప్పకూలిపోయిన షెడ్లు, కాలిపోయిన వాహనాలను పరిశీలించారు. చంద్రబాబు వెంట మంత్రి అనిత, బీజేపీ రాష్ట్ర చీఫ్ మాధవ్ కూడా పాల్గొన్నారు.

ఆదుకుంటాం: పవన్

బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ ఘటన ఎంతో కలచివేసిందని అన్నారు. పేలుడుకు గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు. ఈ విషాద ఘటన అనేక కుటుంబాల్లో తీవ్ర దుఃఖాన్ని నింపిందని, వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. పార్టీ తరఫున జనసైనికులు అవసరమైన సహాయం అందించాలని ఆయన సూచించారు.

This post was last modified on February 28, 2026 9:18 pm

Page: 1 2 3 4 5 6 7 8 9 10

Share
Show comments
Published by
Satya

Recent Posts

బస్సు ప్రమాదం… కత్తితో 8 మందిని కాపాడిన రియల్ హీరో

మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం తీరని విషాదాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే. అయితే ఇదే ప్రమాదంలో మరోవైపు…

38 minutes ago

సంక్షోభాన్ని అడ్డుకునేందుకు భారత్ ప్లాన్ బీ

పశ్చిమ ఆసియాలో యుద్ధం ముదురుతున్న కొద్దీ భారత్ తన ఇంధన అవసరాల కోసం వ్యూహాలను వేగవంతం చేస్తోంది. చమురు, గ్యాస్…

1 hour ago

పవన్ భార్యకు కూడా చిరు అన్నయే…

​మెగా కుటుంబంలో అన్నదమ్ముల మధ్య ఉండే అనుబంధం గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. చిరంజీవి అంటే తమ్ముళ్లు నాగబాబు, పవన్ కల్యాణ్…

2 hours ago

‘ఉస్తాద్’కు లాస్ట్ ఛాన్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ముందు అనుకున్న ప్రకారం అయితే ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ…

2 hours ago

భోజనంలో పురుగులు… వందేభారత్ రామానుజం ఏం చేశాడు?

వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికులకు అందించే భోజనం నాణ్యతపై మరోసారి పెద్ద వివాదం రాజుకుంది. పాట్నా నుంచి టాటానగర్ వెళ్లే…

2 hours ago

చిరు బాబీ మిస్… వెంకీ అనిల్ ఫిక్స్

వరసగా సినిమాలు చేస్తున్నా సక్సెస్ మాత్రం అందని ద్రాక్ష పండులా మారిపోయిన ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి సరైన బ్రేక్…

3 hours ago