Political News

నిర్లక్ష్యమే.. నిలువునా కాల్చేసింది!

చిన్నపాటి నిర్లక్ష్యమే కాకినాడ జిల్లాలోని సామర్లకోటలో జరిగిన అగ్నిప్రమాదానికి కారణమని అధికారులు చెబుతున్నారు. ఇక్కడ పది సంఖ్యలో బాణాసంచా తయారీ కేంద్రాలు ఉన్నాయి. వారం క్రితమే వాటిని అధికారులు పరిశీలించి, వచ్చే వేసవిని దృష్టిలో పెట్టుకుని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వేట్లపాలెంలోని సూర్యశ్రీ బాణాసంచా కేంద్రం కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకుందని చెబుతున్నారు. అయితే చిన్నపాటి నిర్లక్ష్యమే ఈ పెను ప్రమాదానికి కారణమై ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఏం జరిగింది?

వేట్లపాలెం చుట్టుపక్కల గ్రామాల ప్రజలు బాణాసంచా తయారీ కేంద్రాల్లో పనిచేస్తుంటారు. ఎప్పటిలాగే శనివారం కూడా సుమారు 55 మంది కార్మికులు సూర్యశ్రీ బాణాసంచా తయారీ కేంద్రంలో పనులకు హాజరయ్యారు. మధ్యాహ్న భోజన విరామ సమయంలో కొందరు సమీప ఇళ్లకు వెళ్లగా, మరికొందరు తమతో తెచ్చుకున్న భోజనాన్ని అక్కడే చేశారు.

ఈ సమయంలో ఒక కార్మికుడు అలవాటు ప్రకారం బీడీ తాగి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. కాల్చిన బీడీని నిర్లక్ష్యంగా పడేయడంతో అది గోదాములో నిల్వ ఉంచిన బాణాసంచాకు అంటుకుని ఉండొచ్చని భావిస్తున్నారు. దాంతో భారీ పేలుడు సంభవించి ఉండవచ్చని అధికారులు తెలిపారు. అయితే దీనిపై పూర్తి నిర్ధారణ రావాల్సి ఉంది.

ఈ ఘటనలో మొత్తం 24 మంది మృతి చెందినట్లు అధికారులు శనివారం రాత్రి ప్రకటించారు. ఘటన స్థలంలోనే 18 మంది మృతి చెందగా, మార్గమధ్యంలో ఇద్దరు, ఆసుపత్రిలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు 12 మంది వివరాలు మాత్రమే గుర్తించగలిగారు. మిగతా మృతదేహాలను గుర్తించడం కష్టంగా ఉండటంతో డీఎన్ ఏ పరీక్షలు నిర్వహించాల్సి ఉందని తెలిపారు.

అనేక ఘటనలు

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పేలుడు ఘటనలు సాధారణంగా మారుతున్నాయి. 2014 అక్టోబర్ 22న జరిగిన పేలుడులో 18 మంది మృతి చెందారు. గత ఏడాది రాయవరంలోని శ్రీ గణపతి గ్రాండ్ ఫైర్ వర్క్స్‌లో జరిగిన భారీ పేలుడులో నలుగురు మహిళలు, ఇద్దరు పురుషులు సజీవ దహనమయ్యారు.

This post was last modified on February 28, 2026 9:04 pm

Share

Recent Posts

అసెంబ్లీలో మంత్రుల పక్కన సీఎం కూర్చోవడం ఎప్పుడైనా చూసారా?

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ మరో సంప్రదాయాన్ని బ్రేక్ చేశారు. ఎన్నికలకు ముందు అందరం ఒక్కటేనంటూ నీతులు వల్లించే నాయకులు…

4 minutes ago

ఇంట్రెస్టింగ్… ఫ్లాప్ దర్శకుల కలయికలో సినిమా?

సౌత్ ఇండియన్ ఫిలిం మేకింగ్ ని కొత్త పుంతలు తొక్కించిన దర్శకుల్లో శంకర్, మురుగదాస్ పేర్లు ప్రత్యేకంగా నిలుస్తాయి. ఎందుకంటే…

2 hours ago

ఇరుముడి కొట్టుడు మళ్లీ మొదలు

‘టాక్సిక్’ వచ్చిన తర్వాత ‘ఇరుముడి’ రన్ మీద ప్రభావం తప్పదేమో అని డౌట్ ఉండేది. పెద్ద పాన్ ఇండియా సినిమా…

2 hours ago

సుబ్బులక్ష్మి బయోపిక్… సాయిపల్లవి స్థానంలో రష్మిక

సుప్రసిద్ధ గాయని ఏంఎస్ సుబ్బులక్ష్మి జీవిత కథ ఆధారంగా బయోపిక్ తీసేందుకు నిర్మాత బన్నీ వాస్, అల్లు అరవింద్, రాక్…

3 hours ago

తెలుగు రామాయణ మీద 100 కోట్లు సేఫేనా

నవంబర్ లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద అంచనాలు ఎలా ఉన్నా బిజినెస్ వ్యవహారాలు మాత్రం జోరుగా…

4 hours ago

ఓజి 2 సౌండ్ చెయ్యడం లేదేంటి

సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ పుట్టినరోజు రానుంది. అభిమానులు పెద్ద ఎత్తున సెలెబ్రేట్ చేసుకునేందుకు రెడీ అవుతున్నారు. అసలు రిలీజ్…

4 hours ago