Political News

నిర్లక్ష్యమే.. నిలువునా కాల్చేసింది!

చిన్నపాటి నిర్లక్ష్యమే కాకినాడ జిల్లాలోని సామర్లకోటలో జరిగిన అగ్నిప్రమాదానికి కారణమని అధికారులు చెబుతున్నారు. ఇక్కడ పది సంఖ్యలో బాణాసంచా తయారీ కేంద్రాలు ఉన్నాయి. వారం క్రితమే వాటిని అధికారులు పరిశీలించి, వచ్చే వేసవిని దృష్టిలో పెట్టుకుని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వేట్లపాలెంలోని సూర్యశ్రీ బాణాసంచా కేంద్రం కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకుందని చెబుతున్నారు. అయితే చిన్నపాటి నిర్లక్ష్యమే ఈ పెను ప్రమాదానికి కారణమై ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఏం జరిగింది?

వేట్లపాలెం చుట్టుపక్కల గ్రామాల ప్రజలు బాణాసంచా తయారీ కేంద్రాల్లో పనిచేస్తుంటారు. ఎప్పటిలాగే శనివారం కూడా సుమారు 55 మంది కార్మికులు సూర్యశ్రీ బాణాసంచా తయారీ కేంద్రంలో పనులకు హాజరయ్యారు. మధ్యాహ్న భోజన విరామ సమయంలో కొందరు సమీప ఇళ్లకు వెళ్లగా, మరికొందరు తమతో తెచ్చుకున్న భోజనాన్ని అక్కడే చేశారు.

ఈ సమయంలో ఒక కార్మికుడు అలవాటు ప్రకారం బీడీ తాగి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. కాల్చిన బీడీని నిర్లక్ష్యంగా పడేయడంతో అది గోదాములో నిల్వ ఉంచిన బాణాసంచాకు అంటుకుని ఉండొచ్చని భావిస్తున్నారు. దాంతో భారీ పేలుడు సంభవించి ఉండవచ్చని అధికారులు తెలిపారు. అయితే దీనిపై పూర్తి నిర్ధారణ రావాల్సి ఉంది.

ఈ ఘటనలో మొత్తం 24 మంది మృతి చెందినట్లు అధికారులు శనివారం రాత్రి ప్రకటించారు. ఘటన స్థలంలోనే 18 మంది మృతి చెందగా, మార్గమధ్యంలో ఇద్దరు, ఆసుపత్రిలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు 12 మంది వివరాలు మాత్రమే గుర్తించగలిగారు. మిగతా మృతదేహాలను గుర్తించడం కష్టంగా ఉండటంతో డీఎన్ ఏ పరీక్షలు నిర్వహించాల్సి ఉందని తెలిపారు.

అనేక ఘటనలు

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పేలుడు ఘటనలు సాధారణంగా మారుతున్నాయి. 2014 అక్టోబర్ 22న జరిగిన పేలుడులో 18 మంది మృతి చెందారు. గత ఏడాది రాయవరంలోని శ్రీ గణపతి గ్రాండ్ ఫైర్ వర్క్స్‌లో జరిగిన భారీ పేలుడులో నలుగురు మహిళలు, ఇద్దరు పురుషులు సజీవ దహనమయ్యారు.

This post was last modified on February 28, 2026 9:04 pm

Share

Recent Posts

పిఠాపురం ఇకపై పవన్ కంచు కోట

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గమైన పిఠాపురంలో అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయి. కూటమి ప్రభుత్వంలో కీలకపాత్ర పోషిస్తున్న పవన్…

23 minutes ago

రక్తంతో రాసుకున్న ‘ప్యారడైజ్’ శాసనం

న్యాచురల్ స్టార్ నాని, దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ సెప్టెంబర్ 24 విడుదలకు రెడీ…

2 hours ago

డీఎస్సీపైనే వైసీపీకి ఎందుకంత మంకుపట్టు?

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదు, ఒక్క ఉపాధ్యాయ నియామకాన్ని…

2 hours ago

కొత్త మార్పుల వైపు చరణ్ & సుకుమార్ ?

ఇంకా ప్రారంభం కాలేదు కానీ క్యాస్టింగ్ ముందే ఫైనల్ చేసుకోవాలి కాబట్టి ఆర్సి 17కి సంబంధించిన పనుల్లో సుకుమార్ టీమ్…

3 hours ago

నాగార్జున 100 గురించి ఎప్పుడు చెబుతారు

అక్కినేని నాగార్జున వందో సినిమా హడవిడి లేకుండా షూటింగ్ జరుపుకుంటోంది. మాములుగా ఏదో ఒక అప్డేట్ లీకుల రూపంలో కానీ…

4 hours ago

జార్ఖండ్ లో మరో సోనమ్ వాంగ్ చుక్ దీక్ష

దేశంలో ఎక్కడ చూసినా విద్యార్థి ఉద్యమాలు జరుగున్నాయి. ఢిల్లీ నుంచి మొదలుపెట్టుకొని ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, జార్ఖండ్, బీహార్, పశ్చిమ బెంగాల్…

6 hours ago