ఢిల్లీ మద్యం కేసులో తనను నిరపరాధిగా పేర్కొన్న ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టుకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు.. కవిత కృతజ్ఞతలు తెలిపారు. తాను ఈ కేసులో టార్గెట్ అయ్యానని వ్యాఖ్యానించారు. తాను రాజకీయ బాధితురాలినని పేర్కొన్నారు. ఒకరిపై ఉన్న అక్కసుతో నాపై కేసు బనాయించి.. జైలుకు తరలించారని ఆమె పరోక్షంగా బీఆర్ ఎస్ అధినేతపై వ్యాఖ్యలు చేశారు. తాను రాజకీయం పావుగా మారానన్నారు.
అయితే.. అప్పట్లోనే తాను.. కడిగిన ముత్యంగా బయటకు వస్తానని చెప్పానని గుర్తు చేశారు. ఇప్పుడు అదే జరిగిందన్నారు. తనకు సంబంధం లేకపోయినా.. తనను ఇరికించారని, జైలు పాలు చేశారని అన్నారు. అయితే.. ఇప్పటికైనా దేవుడు తనయందే ఉండి తనను ఈ కేసు నుంచి బయట పడేశాడని వ్యాఖ్యానించారు. ఇక నుంచి మరింత ఉత్సాహంతో ప్రజల మద్యకువెళ్తానని కవిత చెప్పారు. ఈ కేసు విషయంలో తనకు ముందు నుంచి మద్దతు తెలిపి వారికి ఆమె ధన్యవాదాలు తెలిపారు.
ప్రజల మధ్యే ఉంటా!
ఇక నుంచి తాను ప్రజల మధ్యే ఉంటానని కవిత చెప్పారు. ఇప్పటి వరకు తనపై అభాండాలు మోపి.. తనను ప్రజల మధ్య చులకన చేసిన రాష్ట్ర బీజపీ నాయకులు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ప్రజలతోనే ఇక నుంచి తన జీవితం ముడి పడి ఉంటుందన్నారు. త్వరలోనే సొంత పార్టీకి సంబంధించిన మరిన్ని విషయాలను వెల్లడించనున్నట్టు తెలిపారు. మేలోనే పార్టీ పెడతానని ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో ఇక నుంచి ప్రజల మధ్యే ఉంటానని చెప్పడం గమనార్హం.
This post was last modified on February 27, 2026 3:27 pm
మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఓ వ్యక్తి హల్చల్ చేయడం కలకలం రేపింది. కార్యాలయ ఆవరణలోకి చొరబడిన అతడు…
ఢిల్లీ మద్యం కేసులోతనను నిరపరాధిగా స్థానిక రౌస్ ఎవెన్యూ కోర్టు ప్రకటించడం పట్ల ఢిల్లీ మాజీ ముఖ్య మంత్రి, ఆయన…
టాలీవుడ్ సంక్రాంతి జ్వరంలో ఊగిపోతోంది. ఎంతగా అంటే ఇంకా ఏడాది సమయం ఉండగానే ఒక నిర్మాణ సంస్థ కథ, దర్శకుడు…
ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్న సంస్థలు కూటమి ప్రభుత్వం పట్ల, ముఖ్యమంత్రి చంద్రబాబు పట్ల అత్యంత విశ్వసనీయత ప్రదర్శిస్తున్న విషయం…
పెద్ది ప్రకటన టైంలో సంగీత దర్శకుడిగా ఏఆర్ రెహమాన్ ని ఎంచుకోవడం గురించి మెగా ఫ్యాన్స్ అప్పట్లో రకరకాల అనుమానాలు…
నిన్న సాయంత్రం అనిల్ రావిపూడి కొత్త సినిమా అనౌన్స్ మెంట్ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎవరూ ఊహించని విధంగా వెంకటేష్, కళ్యాణ్…