Political News

మద్యం కేసులో క్లీన్ చిట్.. స్పీడు పెంచనున్న కవిత

ఢిల్లీ మ‌ద్యం కేసులో త‌న‌ను నిర‌ప‌రాధిగా పేర్కొన్న ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టుకు తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు.. క‌విత కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. తాను ఈ కేసులో టార్గెట్ అయ్యాన‌ని వ్యాఖ్యానించారు. తాను రాజ‌కీయ బాధితురాలిన‌ని పేర్కొన్నారు. ఒక‌రిపై ఉన్న అక్క‌సుతో నాపై కేసు బ‌నాయించి.. జైలుకు త‌ర‌లించార‌ని ఆమె ప‌రోక్షంగా బీఆర్ ఎస్ అధినేత‌పై వ్యాఖ్య‌లు చేశారు. తాను రాజ‌కీయం పావుగా మారాన‌న్నారు.

అయితే.. అప్ప‌ట్లోనే తాను.. క‌డిగిన ముత్యంగా బ‌య‌ట‌కు వ‌స్తాన‌ని చెప్పాన‌ని గుర్తు చేశారు. ఇప్పుడు అదే జ‌రిగింద‌న్నారు. త‌నకు సంబంధం లేక‌పోయినా.. త‌న‌ను ఇరికించార‌ని, జైలు పాలు చేశార‌ని అన్నారు. అయితే.. ఇప్ప‌టికైనా దేవుడు త‌న‌యందే ఉండి త‌న‌ను ఈ కేసు నుంచి బ‌య‌ట ప‌డేశాడ‌ని వ్యాఖ్యానించారు. ఇక నుంచి మ‌రింత ఉత్సాహంతో ప్ర‌జ‌ల మ‌ద్య‌కువెళ్తాన‌ని క‌విత చెప్పారు. ఈ కేసు విష‌యంలో త‌న‌కు ముందు నుంచి మ‌ద్ద‌తు తెలిపి వారికి ఆమె ధ‌న్య‌వాదాలు తెలిపారు.

ప్ర‌జ‌ల మ‌ధ్యే ఉంటా!

ఇక నుంచి తాను ప్ర‌జ‌ల మ‌ధ్యే ఉంటాన‌ని క‌విత చెప్పారు. ఇప్ప‌టి వ‌ర‌కు త‌న‌పై అభాండాలు మోపి.. త‌న‌ను ప్ర‌జ‌ల మ‌ధ్య చుల‌క‌న చేసిన రాష్ట్ర బీజ‌పీ నాయ‌కులు ఇప్పుడు ఏం స‌మాధానం చెబుతార‌ని ప్ర‌శ్నించారు. ప్ర‌జ‌లతోనే ఇక నుంచి త‌న జీవితం ముడి ప‌డి ఉంటుంద‌న్నారు. త్వ‌ర‌లోనే సొంత పార్టీకి సంబంధించిన మ‌రిన్ని విష‌యాల‌ను వెల్ల‌డించ‌నున్న‌ట్టు తెలిపారు. మేలోనే పార్టీ పెడ‌తాన‌ని ఇటీవ‌ల ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో ఇక నుంచి ప్ర‌జ‌ల మ‌ధ్యే ఉంటాన‌ని చెప్ప‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on February 27, 2026 3:27 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Kavitha

Recent Posts

వెయ్యి కోట్ల విధ్వంసం వారం రోజుల్లోనే

అంచనాలకు మించి దురంధర్ ది రివెంజ్ అరాచకం చేస్తోంది. సరిగ్గా వారం రోజులు కావడం ఆలస్యం వెయ్యి కోట్ల క్లబ్బులోకి…

1 hour ago

మంగళగిరిని లోకేశ్ వీడాల్సిందేనా…?

లోక్ సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ఖరారైన నేపథ్యంలో దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు ఆయా పరిణామాలపై ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఈ…

3 hours ago

ప్రభాస్ ప్రేమిస్తే ఇంతే

నేటి తరం కుర్ర హీరోల్లో సంతోష్ శోభన్, సంగీత్ శోభన్ సోదరులకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. అయితే వీరిద్దరి…

3 hours ago

ఘోర బస్సు ప్రమాదం 10 మంది సజీవదహనం

ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మార్కాపురం జిల్లాలోని రాయవరం సమీపంలో పలకల క్వారీల వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు…

5 hours ago

పవన్ ప్రయాణం… సందేహాలు అనవసరం

ఇటీవల విడుదలైన ఉస్తాద్ భగత్ సింగ్ ఫలితం విషయంలో అభిమానులు ఎంత మాత్రం హ్యాపీగా లేరన్నది వాస్తవం. వింటేజ్ పవన్…

6 hours ago

రాజశేఖర్ నిజాయితీకి అవకాశాలు రావాలి

ఓ ముప్పై ఏళ్ళు వెనక్కు వెళ్తే చిరంజీవి, బాలకృష్ణ లాంటి స్టార్ల ప్రభంజనం ఉదృతంగా ఉన్న టైంలో తెలుగు భాష…

13 hours ago