Political News

బాబు ఎఫెక్ట్.. ఏపీకి మరో బడా కంపెనీ

ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వ‌స్తున్న సంస్థ‌లు కూట‌మి ప్ర‌భుత్వం ప‌ట్ల‌, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప‌ట్ల అత్యంత విశ్వ‌స‌నీయ‌త ప్ర‌ద‌ర్శిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో తాజాగా మ‌రో విదేశీ సంస్థ కూడా పెట్టుబ‌డులు పెట్టేందుకు వ‌స్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది. చంద్ర‌బాబు ఆహ్వానం మేర‌కు.. ఆయ‌న‌పై ఉన్న న‌మ్మ‌కంతో పెట్టుబ‌డులు పెట్టేందుకు ఏపీకి త‌ర‌లి వ‌స్తున్నామ‌ని తెలిపింది. ఇది త‌మ‌కు ల‌భించిన గొప్ప అవ‌కాశంగా భావిస్తున్న‌ట్టు పేర్కొన‌డం గ‌మ‌నార్హం.

అమెరికా-జ‌పాన్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన `ప్రొటీరియ‌ల్‌` సంస్థ ఏపీలో `మెట్ గ్లాస్ ఇండియా` పేరుతో పెట్టుబ‌డులు పెట్టేందుకు ముందుకు వ‌చ్చింది. ఈ సంస్థ అల్లాయ్ రిబ్బ‌న్ల‌ను ఉత్ప‌త్తి చేయ‌నుంది. 77 కోట్ల రూపాయ‌ల‌ను పెట్టుబడిగా పెట్ట‌నున్న ఈ సంస్థ‌.. తిరుప‌తి జిల్లాలోని పారిశ్రామిక ప్రాంతం శ్రీసిటీలో త‌న విభాగాన్ని ఏర్పాటు చేయ‌నుంది. దీనికి సంబంధించి గ‌త ఏడాదే ఒప్పందాలు కుదిరాయి. ఈ ఒప్పందం మేర‌కు తొలి రెండేళ్ల‌పాటు ప‌న్నులు మిన‌హాయిస్తారు. స్థానికంగా ఉన్న యువ‌త‌కు ఉపాధి, ఉద్యోగ అవ‌కాశాలు క‌ల్పించాల్సి ఉంటుంది.

శ్రీసిటీలో ఈ సంస్థ `ఎలక్ట్రికల్‌ స్టీల్‌ సిటీ` కర్మాగారం ఏర్పాటు చేయనుంది. దీని నుంచి ఉత్ప‌త్తి అయ్యే అల్లాయ్ రిబ్బ‌న్ల‌ను దేశ‌, విదేశాల‌కు ఎగుమ‌తి చేయ‌నున్నారు. ప్ర‌ధాన వ్యాపారం అంతా విదేశాల కేంద్రంగానే సాగ‌నుంది. మొత్తం తొలిద‌శ‌లో 200 మంది స్థానికుల‌కు ఉద్యోగాలు, ఉపాధి క‌ల్పించ‌నున్నారు. ఈ ఏడాది అక్టోబర్‌ నుంచి సంస్థ కార్యకలాపాలు ప్రారంభించనున్నారు. అధునాతన జపాన్‌ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ ప్లాంట్‌లో వినియోగించ‌నున్నారు.

ఇదిలావుంటే.. ఇప్ప‌టి వ‌ర‌కు 13 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల మేర‌కు పెట్టుబ‌డుల‌పై కూట‌మి ప్ర‌భుత్వం ఒప్పందాలు చేసుకుంది. ఇవి ఒక్కొక్క‌టిగా త‌మ సంస్థ‌ల‌ను ఏర్పాటు చేయ‌నున్నారు. వాటికి వివిధ ప్రాంతాల్లో భూములు కేటాయిస్తున్నారు. అదేవిధంగా ప‌లు రాయితీలు కూడా ప్ర‌క‌టిస్తున్నారు.

ఈ క్ర‌మంలోనే తాజాగా అమెరికా-జ‌పాన్ సంయుక్త సంస్థ ఏపీకి రావ‌డం గ‌మ‌నార్హం. ఈ ఏడాది మెజారిటీ ఒప్పంద సంస్థ‌లు ఏపీలో త‌మ త‌మ సంస్థ‌ల‌ను ఏర్పాటు చేయ‌నున్నాయ‌ని ఇటీవ‌ల మంత్రి నారా లోకేష్ వెల్ల‌డించారు.

This post was last modified on February 27, 2026 2:48 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Chandrababu

Recent Posts

రెహమాన్ మళ్ళీ గెలవడం పక్కానా

పెద్ది ప్రకటన టైంలో సంగీత దర్శకుడిగా ఏఆర్ రెహమాన్ ని ఎంచుకోవడం గురించి మెగా ఫ్యాన్స్ అప్పట్లో రకరకాల అనుమానాలు…

2 hours ago

అసలు విషయం దాచేసిన రావిపూడి

నిన్న సాయంత్రం అనిల్ రావిపూడి కొత్త సినిమా అనౌన్స్ మెంట్ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎవరూ ఊహించని విధంగా వెంకటేష్, కళ్యాణ్…

2 hours ago

ఎన్నిక‌ల వేళ‌… ఇన్‌ఫ్లుయెన్స‌ర్లదే `రాజ‌కీయం`!

ప‌దిమందిని మెప్పించ‌గ‌ల మాట నేర్పు ఉందా? సామాజిక మాధ్య‌మాల్లో ప్ర‌జ‌లను ఆక‌ర్షించ‌గ‌ల నైపుణ్యం ఉందా? అయితే.. రాజకీయాల‌న్నీ మీవే!. త్వ‌ర‌లోనే..…

2 hours ago

రఘురామను మళ్ళీ గిల్లుతున్న సునీల్ కుమార్

“జస్ట్ అలా పడిపోతేనే రెండు చోట్ల ఎముకలు విరిగాయి. నిజంగా కస్టడీలో ఎవరైనా కొట్టి ఉంటే ఎన్ని ఫ్రాక్చర్లు ఉండాలి?…

3 hours ago

న‌గ‌రిలో రోజా VS భాను… ఇదో స‌రికొత్త వార్‌…

ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం నగ‌రిలో ఏం జ‌రుగుతోంది? నాయ‌కులు ఏం చేస్తున్నారు? అంటే.. అంతా ప్ర‌స్తుతం సైలెంట్‌గానే…

8 hours ago

ఆయ‌నో మ‌ర్రి చెట్టు: టీడీపీ కామెంట్‌.. !

కొంద‌రు నాయ‌కులు తాము ఎదుగుతూ.. తోటి వారిని ఎదిగేలా స‌హ‌క‌రిస్తారు. ఇది ఎక్క‌డైనా ఉంటుంది. అయితే.. కొన్ని కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో…

15 hours ago