రాజకీయాల్లోనే కాదు.. ఆటల్లోనూ తన సత్తా నిరూపించారు… ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా.. `ఆటవిడుపు` పేరుతో మూడు రోజుల పాటు.. ప్రజాప్రతినిధులు, మంత్రులకు ఆటల పోటీలను.. మంగళవారం సాయంత్రం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో అట్టహాసంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్రాజు, స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
ప్రజాప్రతినిధుల మధ్య టగ్ ఆఫ్ వార్, రన్నింగ్, తదితర పోటీలు నిర్వహించారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ టీం లీడర్లగా వాలీబాల్ ఆడారు. ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్న మాట్లాడుతూ… నిత్యం ప్రజలతో, రాజకీయాలతో బిజీగా ఉండే ప్రజాప్రతినిధులకు బయటకు వెళ్లినా, ఇంటికి వెళ్లినా, అసెంబ్లీలో ఉన్నా నిరంతరం టెన్షన్ వాతావరణమే ఉంటుందని, ఈ ఒత్తిడి నుంచి ప్రశాంతత పొందేందుకు ఇలాంటి క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు.
1983లో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎమ్మెల్యేలు కూడా క్రీడల్లో పాల్గొనాలని హైదరాబాద్ లోని లాల్ బహదూర్ స్టేడియంలో తొలిసారిగా క్రీడా పోటీలు నిర్వహించారని స్పీకర్ తెలిపారు. అప్పట్లో తాను, బుచ్చయ్య చౌదరి మొదటిసారి ఎమ్మెల్యేలుగా గెలిచి ఆ క్రీడల్లో పాల్గొన్నామన్నారు. ప్రస్తుతం సభలో 78 శాతం మంది యువ ఎమ్మెల్యేలు ఉన్నారని, వారి ఉత్సాహాన్ని చూసి క్రీడలను ప్రోత్సహిస్తున్నా మన్నారు. వయసుతో సంబంధం లేకుండా అందరూ పాల్గొనేలా వయసుల వారీగా క్రీడలను విభజించా మని తెలిపారు.
టగ్ ఆఫ్ వార్..
అనంతరం.. నిర్వహించిన క్రీడల పోటీల్లో స్పీకర్ వర్సెస్ డిప్యూటీ స్పీకర్ బృందాల మధ్య టగ్ ఆఫ్ వార్ నిర్వహించారు. ఈ పోటీలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు జట్టు విజయం దక్కించుకుంది. స్పీకర్ సరసన.. విప్.. ఆంజనేయులు, ప్రత్తిపాడు ఎమ్మెల్యే రామాంజనేయులు సహా పలువురు సభ్యులు పాల్గొన్నారు. టగ్ ఆఫ్ వార్ లో విజయం సాధించిన డిప్యూటీ స్పీకర్ జట్టును స్పీకర్ అయ్యన్న ప్రశంసించారు. రాజకీయాలేకాదు.. క్రీడల్లోనూ సత్తా చాటుతున్నారని రఘురామకు కితాబునిచ్చారు.
This post was last modified on February 25, 2026 12:09 pm
నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…
ఇండియాస్ నంబర్ వన్ డైరెక్టర్ రాజమౌళి దగ్గర దర్శకత్వ విభాగంలో పని చేయాలని కాబోయే డైరెక్టర్ కావాలనుకున్న ప్రతి వ్యక్తికీ…
అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…
తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…
ఇప్పటిదాకా అన్ని భాషల్లో కలిపి కొన్ని వందల హారర్ సినిమాలు వచ్చి ఉంటాయి. హాలీవుడ్ ఈవిల్ డెడ్ తో మొదలుపెట్టి…
బాలీవుడ్ లో సంచలన వసూళ్లు నమోదు చేస్తున్న హనుమాన్ అంశ్ తెలుగులో సెప్టెంబర్ 18 విడుదల కానుంది. ఆశ్చర్యం కలిగించే…