తమిళ టాప్ స్టార్లలో ఒకడైన అజిత్కు వీరం, వేదాళం, విశ్వాసం చిత్రాలతో మరపురాని విజయాలు అందించాడు దర్శకుడు శివ. తమిళంలో ఒకప్పుడు పేరున్న సినిమాటోగ్రాఫర్ అయిన శివ.. తెలుగులో దర్శకుడిగా పరిచయం కావడం విశేషం. గోపీచంద్ హీరోగా శౌర్యం, శంఖం సినిమాలు తీశాడతను. తర్వాత సొంత భాషలో ‘విక్రమార్కుడు’ సినిమాను ‘సిరుత్తై’ పేరుతో రీమేక్ చేస్తే అది పెద్ద హిట్టయింది.
ఆపై అతను సొంత కథలతో వీరం, వేదాళం, వివేగం, విశ్వాసం సినిమాలు తీశాడు. ఇందులో వివేగం మినహా సినిమాలు బ్లాక్ బస్టర్లు అయ్యాయి. ఐతే అజిత్కు మూడు హిట్లు ఇచ్చినా సరే.. తన విషయంలో అజిత్ ఫ్యాన్స్ నుంచి మిశ్రమ స్పందన వస్తుంటుంది. అజిత్ను ఒక మూసలోకి తీసుకెళ్లిపోయాడని.. రొటీన్ సినిమాలు తీసి విసిగించాడని అంటుంటారు. ఐతే అజిత్ కాకుండా శివ వేరే హీరోలతో సినిమాలు తీస్తే అస్సలు వర్కవుట్ కాలేదు.
సూపర్ స్టార్ రజినీకాంత్తో తీసిన ‘అన్నాత్తే’, సూర్యతో చేసిన ‘కంగువ’ ఒకదాన్ని మించి ఒకటి డిజాస్టర్లు అయ్యాయి. దీంతో శివ పట్ల కోలీవుడ్లో బాగా వ్యతిరేకత వచ్చేసింది. తనతో సినిమా చేయడానికి స్టార్లు ఇప్పుడు భయపడుతున్నారు. ఇలాంటి టైంలో అజిత్ మళ్లీ అతడికి అవకాశమిచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి.
వరుస ఫ్లాపుల తర్వాత గత ఏడాది ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’తో హిట్ ట్రాక్ ఎక్కాడు అజిత్. ఆ సినిమా అభిమానులకు గొప్ప ఊరటనిచ్చింది. ఐతే ఆ సినిమా తీసిన ఆధిక్ రవిచంద్రన్తోనే ఇంకో సినిమాను అజిత్ లైన్లో పెట్టాడు. కానీ ఇప్పుడేమో లైనప్ మారిందంటున్నారు. మధ్యలోకి శివ సినిమా వచ్చిందని.. దాన్నే ముందుకు తీసుకెళ్తున్నాడని.. ఆ తర్వాతే ఆధిక్ సినిమా ఉంటుందని అంటున్నారు.
కానీ అజిత్ ఫ్యాన్స్ దీని పట్ల నెగెటివ్గా స్పందిస్తున్నారు. శివ మళ్లీ రొటీన్ సినిమా తీస్తాడని.. ఫామ్లో లేని అతడితో మళ్లీ జట్టు కట్టడం అవసరమా అని ప్రశ్నిస్తున్నారు. లేక లేక ఒక పెద్ద హిట్ ఇచ్చిన ఆధిక్ను వదిలేసిన శివతో వెళ్లడాన్ని వాళ్లు అంగీకరించలేకపోతున్నారు. మారుతితో ప్రభాస్ సినిమా చేస్తుంటే ఫ్యాన్స్ వ్యతిరేకించినట్లే.. అజిత్ అభిమానులు కూడా ఇప్పుడు శివ సినిమా విషయంలో నెగెటివ్గా స్పందిస్తున్నారు.
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను వెల్లడించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో…
ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రముఖ ప్రవచ కర్త చాగంటి కోటేశ్వరరావు ప్రసంగాలను పాఠ్యాంశాలుగా ప్రవేశ పెడుతున్నట్టు ప్రకటించింది. దీనికి సంబంధించి…
ఏపీలో కూటమిగా ఏర్పడిన టిడిపి, జనసేన, బిజెపిలు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయింది. ఈ క్రమంలో కూటమికి నేతృత్వం…
ఓ రాజకీయ పార్టీ తనను వేధించిన విషయంపై అలుపెరగని పోరాటం చేసి తీరుతుంది. అలా చేయకుంటే… అది రాజకీయ పార్టీ…
భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. దేశానికి అత్యధిక కాలం…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోమారు తెలంగాణ అంశం మీద నోరు విప్పారు. భారత దేశంలో…