తమిళ టాప్ స్టార్లలో ఒకడైన అజిత్కు వీరం, వేదాళం, విశ్వాసం చిత్రాలతో మరపురాని విజయాలు అందించాడు దర్శకుడు శివ. తమిళంలో ఒకప్పుడు పేరున్న సినిమాటోగ్రాఫర్ అయిన శివ.. తెలుగులో దర్శకుడిగా పరిచయం కావడం విశేషం. గోపీచంద్ హీరోగా శౌర్యం, శంఖం సినిమాలు తీశాడతను. తర్వాత సొంత భాషలో ‘విక్రమార్కుడు’ సినిమాను ‘సిరుత్తై’ పేరుతో రీమేక్ చేస్తే అది పెద్ద హిట్టయింది.
ఆపై అతను సొంత కథలతో వీరం, వేదాళం, వివేగం, విశ్వాసం సినిమాలు తీశాడు. ఇందులో వివేగం మినహా సినిమాలు బ్లాక్ బస్టర్లు అయ్యాయి. ఐతే అజిత్కు మూడు హిట్లు ఇచ్చినా సరే.. తన విషయంలో అజిత్ ఫ్యాన్స్ నుంచి మిశ్రమ స్పందన వస్తుంటుంది. అజిత్ను ఒక మూసలోకి తీసుకెళ్లిపోయాడని.. రొటీన్ సినిమాలు తీసి విసిగించాడని అంటుంటారు. ఐతే అజిత్ కాకుండా శివ వేరే హీరోలతో సినిమాలు తీస్తే అస్సలు వర్కవుట్ కాలేదు.
సూపర్ స్టార్ రజినీకాంత్తో తీసిన ‘అన్నాత్తే’, సూర్యతో చేసిన ‘కంగువ’ ఒకదాన్ని మించి ఒకటి డిజాస్టర్లు అయ్యాయి. దీంతో శివ పట్ల కోలీవుడ్లో బాగా వ్యతిరేకత వచ్చేసింది. తనతో సినిమా చేయడానికి స్టార్లు ఇప్పుడు భయపడుతున్నారు. ఇలాంటి టైంలో అజిత్ మళ్లీ అతడికి అవకాశమిచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి.
వరుస ఫ్లాపుల తర్వాత గత ఏడాది ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’తో హిట్ ట్రాక్ ఎక్కాడు అజిత్. ఆ సినిమా అభిమానులకు గొప్ప ఊరటనిచ్చింది. ఐతే ఆ సినిమా తీసిన ఆధిక్ రవిచంద్రన్తోనే ఇంకో సినిమాను అజిత్ లైన్లో పెట్టాడు. కానీ ఇప్పుడేమో లైనప్ మారిందంటున్నారు. మధ్యలోకి శివ సినిమా వచ్చిందని.. దాన్నే ముందుకు తీసుకెళ్తున్నాడని.. ఆ తర్వాతే ఆధిక్ సినిమా ఉంటుందని అంటున్నారు.
కానీ అజిత్ ఫ్యాన్స్ దీని పట్ల నెగెటివ్గా స్పందిస్తున్నారు. శివ మళ్లీ రొటీన్ సినిమా తీస్తాడని.. ఫామ్లో లేని అతడితో మళ్లీ జట్టు కట్టడం అవసరమా అని ప్రశ్నిస్తున్నారు. లేక లేక ఒక పెద్ద హిట్ ఇచ్చిన ఆధిక్ను వదిలేసిన శివతో వెళ్లడాన్ని వాళ్లు అంగీకరించలేకపోతున్నారు. మారుతితో ప్రభాస్ సినిమా చేస్తుంటే ఫ్యాన్స్ వ్యతిరేకించినట్లే.. అజిత్ అభిమానులు కూడా ఇప్పుడు శివ సినిమా విషయంలో నెగెటివ్గా స్పందిస్తున్నారు.
This post was last modified on February 23, 2026 4:07 pm
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…
శర్వానంద్ ఈ ఏడాది నాలుగు నెలల గ్యాప్ లో రెండు సినిమాలు ఇచ్చాడు. నారి నారి నడుమ మురారి విపరీతమైన…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కెరీర్ పతాక స్థాయిలో ఉన్నపుడు ఆయనకు, కథానాయికలకు మధ్య లింకులు పెడుతూ అనేక వార్తలు వచ్చాయి. అందులో ఎక్కువ చర్చనీయాంశం…
వైసీపీ అధినేత జగన్కు ఏపీ ప్రజలు థ్యాంక్స్ చెబుతున్నారంటూ.. ఆ పార్టీ సోషల్ మీడియా ఊదర గొడుతోంది. అంతేకాదు.. గత…
సూపర్ స్టార్ కృష్ణ సోదరులు, సీనియర్ నిర్మాత ఆదిశేషగిరిరావు ఇవాళ జరిగిన శ్రీనివాస మంగాపురం ఈవెంట్ లో ఒక మాట…