చాలాకాలంగా కాంగ్రెస్ పార్టీపై, సీఎం రేవంత్ రెడ్డిపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. తనకు మంత్రి పదవి ఇవ్వకుంటే ముఖ్యమంత్రిని అవుతానంటూ ఇటీవల ఆయన చేసిన కామెంట్లు రాజకీయ కాక రేపాయి. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి రేవంత్ ను డైరెక్ట్ గా టార్గెట్ చేస్తూ రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.
రేవంత్ రెడ్డి ఈ రెండేళ్లలో నిజాయతీగా పాలన చేయలేదని, అవినీతి లేకుండా పాలన జరగలేదని ఆరోపించారు. ఇక, అన్ని మంత్రిత్వ శాఖలు తన దగ్గరే రేవంత్ ఎందుకు పెట్టుకున్నాడని ప్రశ్నించారు. దేశ చరిత్రలో మరే సీఎం ఇలా ఇన్ని శాఖలు తన దగ్గర పెట్టుకోలేదని విమర్శించారు. ఇచ్చిన హామీలు ఎంత వరకు నెరవేర్చారో రేవంత్ చెప్పాలని రాజగోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. కీలక పదవుల్లో ఉన్న వ్యక్తులు నిజాయితీగా పని చేస్తున్నారా? అని నిలదీశారు.
మరోవైపు, కొందరు ఎమ్మెల్యేలతో రాజగోపాల్ రెడ్డి టచ్ లో ఉన్నారని, ఓ వర్గంగా విడిపోయి రేవంత్ సర్కార్ ను ఇరుకున పెట్టే యోచనలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. మంత్రి కాకుంటే ముఖ్యమంత్రి అవుతా అని రాజగోపాల్ చేసిన కామెంట్లపై కాంగ్రెస్ హై కమాండ్ సీరియస్ గా తీసుకున్నట్లు కనిపిస్తోంది.
రాజగోపాల్ రెడ్డితో మాట్లాడి ఆయన అభ్యంతరాలు తెలుసుకుంటామని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ అన్నారు. ఒకవేళ రాజగోపాల్ తో రాజీ విఫలమైతే ఆయనపై వేటు వేసేందుకు కూడా పార్టీ అధిష్టానం రెడీ అయిందని తెలుస్తోంది.
ఈ రోజుల్లో పెద్ద సినిమాలకే ఆశించిన స్థాయిలో ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదు. అలాంటపుడు చిన్న స్థాయి సినిమాలను జనాల్లోకి…
మొన్నటిదాకా రాయలసీమ అంటే కరువు సీమ కిందే లెక్క. ఏ రాజకీయ పార్టీ అదికారంలోకి వచ్చినా… రాయలసీమ ఓట్లను గంపగుత్తగా…
గోదావరి జిల్లాల రాజకీయం ఎప్పుడూ హాట్ హాట్గానే ఉంటుంది. ముఖ్యంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తీర్పు ఇస్తే రాష్ట్రంలో…
ఒక సూపర్ హిట్ మూవీకి సీక్వెల్ అంటే సాధారణంగా క్రేజ్ ఎక్కువగానే ఉంటుంది. అందుకే పుష్ప 2, కెజిఎఫ్ 2,…
తెలంగాణలో జనసేన అధినేత పవన్కల్యాణ్.. ఈ నెల 2న నిర్వహించ తలపెట్టిన తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభకు పోలీసులు అనుమతి…
దర్శకుడు సురేందర్ రెడ్డి పిచ్చ వెయిటింగ్ లో ఉన్నారు. కారణం పవన్ కళ్యాణ్ అంగీకారం వస్తే సినిమా మొదలుపెట్టాలి. ఈ…