చాలాకాలంగా కాంగ్రెస్ పార్టీపై, సీఎం రేవంత్ రెడ్డిపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. తనకు మంత్రి పదవి ఇవ్వకుంటే ముఖ్యమంత్రిని అవుతానంటూ ఇటీవల ఆయన చేసిన కామెంట్లు రాజకీయ కాక రేపాయి. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి రేవంత్ ను డైరెక్ట్ గా టార్గెట్ చేస్తూ రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.
రేవంత్ రెడ్డి ఈ రెండేళ్లలో నిజాయతీగా పాలన చేయలేదని, అవినీతి లేకుండా పాలన జరగలేదని ఆరోపించారు. ఇక, అన్ని మంత్రిత్వ శాఖలు తన దగ్గరే రేవంత్ ఎందుకు పెట్టుకున్నాడని ప్రశ్నించారు. దేశ చరిత్రలో మరే సీఎం ఇలా ఇన్ని శాఖలు తన దగ్గర పెట్టుకోలేదని విమర్శించారు. ఇచ్చిన హామీలు ఎంత వరకు నెరవేర్చారో రేవంత్ చెప్పాలని రాజగోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. కీలక పదవుల్లో ఉన్న వ్యక్తులు నిజాయితీగా పని చేస్తున్నారా? అని నిలదీశారు.
మరోవైపు, కొందరు ఎమ్మెల్యేలతో రాజగోపాల్ రెడ్డి టచ్ లో ఉన్నారని, ఓ వర్గంగా విడిపోయి రేవంత్ సర్కార్ ను ఇరుకున పెట్టే యోచనలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. మంత్రి కాకుంటే ముఖ్యమంత్రి అవుతా అని రాజగోపాల్ చేసిన కామెంట్లపై కాంగ్రెస్ హై కమాండ్ సీరియస్ గా తీసుకున్నట్లు కనిపిస్తోంది.
రాజగోపాల్ రెడ్డితో మాట్లాడి ఆయన అభ్యంతరాలు తెలుసుకుంటామని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ అన్నారు. ఒకవేళ రాజగోపాల్ తో రాజీ విఫలమైతే ఆయనపై వేటు వేసేందుకు కూడా పార్టీ అధిష్టానం రెడీ అయిందని తెలుస్తోంది.
రకరకాల తేదీలతో అభిమానులను తెగ అయోమయానికి గురి చేస్తున్న ది ప్యారడైజ్ ఎట్టకేలకు సెప్టెంబర్ 25 విడుదల కావడానికి రెడీ…
మానవ జీవన యానంలో ఎప్పటికప్పుడు కొత్త పోకడలు, కొంగొత్త మోసాలు, సభ్య సమాజాన్ని నివ్వెరపరిచే నయా వేధింపులు… ఇలా ఒక్కటేమిటి…
ఒక పాత్రకు ఒక ఆర్టిస్టు ఎంపికై.. ఆ తర్వాత ఇంకొకరి చేతికి మారడం ఫిలిం ఇండస్ట్రీలో మామూలే. చాలాసార్లు చిత్రీకరణకు…
రావు బహదూర్ ప్రెస్ మీట్ లో మీడియా ప్రతినిధి, నిర్మాత మధ్య జరిగిన సంభాషణలో ఒక సినిమా 450 కోట్లు…
లీకైన విడుదల తేదీ అఫీషియల్ అయిపోయింది. జైలర్ 2 రిలీజ్ డేట్ అక్టోబర్ 15 ఖరారు చేస్తూ చిన్న వీడియో…
జూలై 10 విడుదల కాబోతున్న లెనిన్ ప్రమోషన్లు ఊపందుకున్నాయి. ఈసారి గ్యారెంటీ హిట్టు కొడతాడనే నమ్మకం అఖిల్ లో పుష్కలంగా…