చాలాకాలంగా కాంగ్రెస్ పార్టీపై, సీఎం రేవంత్ రెడ్డిపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. తనకు మంత్రి పదవి ఇవ్వకుంటే ముఖ్యమంత్రిని అవుతానంటూ ఇటీవల ఆయన చేసిన కామెంట్లు రాజకీయ కాక రేపాయి. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి రేవంత్ ను డైరెక్ట్ గా టార్గెట్ చేస్తూ రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.
రేవంత్ రెడ్డి ఈ రెండేళ్లలో నిజాయతీగా పాలన చేయలేదని, అవినీతి లేకుండా పాలన జరగలేదని ఆరోపించారు. ఇక, అన్ని మంత్రిత్వ శాఖలు తన దగ్గరే రేవంత్ ఎందుకు పెట్టుకున్నాడని ప్రశ్నించారు. దేశ చరిత్రలో మరే సీఎం ఇలా ఇన్ని శాఖలు తన దగ్గర పెట్టుకోలేదని విమర్శించారు. ఇచ్చిన హామీలు ఎంత వరకు నెరవేర్చారో రేవంత్ చెప్పాలని రాజగోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. కీలక పదవుల్లో ఉన్న వ్యక్తులు నిజాయితీగా పని చేస్తున్నారా? అని నిలదీశారు.
మరోవైపు, కొందరు ఎమ్మెల్యేలతో రాజగోపాల్ రెడ్డి టచ్ లో ఉన్నారని, ఓ వర్గంగా విడిపోయి రేవంత్ సర్కార్ ను ఇరుకున పెట్టే యోచనలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. మంత్రి కాకుంటే ముఖ్యమంత్రి అవుతా అని రాజగోపాల్ చేసిన కామెంట్లపై కాంగ్రెస్ హై కమాండ్ సీరియస్ గా తీసుకున్నట్లు కనిపిస్తోంది.
రాజగోపాల్ రెడ్డితో మాట్లాడి ఆయన అభ్యంతరాలు తెలుసుకుంటామని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ అన్నారు. ఒకవేళ రాజగోపాల్ తో రాజీ విఫలమైతే ఆయనపై వేటు వేసేందుకు కూడా పార్టీ అధిష్టానం రెడీ అయిందని తెలుస్తోంది.
This post was last modified on February 21, 2026 11:26 am
కొన్ని వారాల క్రితం జరిగిన కల్ట్ టీజర్ లాంచ్ ఈవెంట్ లో హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ ఒక పెద్ద…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజై రెండు నెలలు దాటేసింది. ఓటిటిలో వచ్చింది. శాటిలైట్ లోనూ అదరగొట్టింది. కానీ ఇప్పటిదాకా చిరంజీవి…
వైసీపీ అధినేత జగన్కు జనసేన పార్టీముఖ్య నాయకుడు, ఎమ్మెల్సీ నాగబాబు.. కీలక సూచనలు చేశారు. అయితే.. జగన్ ఎవరి మాటా…
మంత్రి లోకేష్ చెప్పిన మాటలను ఎమ్మెల్యేలు తు.చ. తప్పకుండా చేస్తున్నారనడానికి శనివారం రాష్ట్రంలో జరిగిన కొన్ని పరిణామాలే ఉదాహరణ. వాస్తవానికి…
గత ఏడాది విడుదలైన 'తెలుసు కదా' అంచనాలు అందుకోలేక సిద్ధూ జొన్నలగడ్డ ఖాతాలో మరో డిజాస్టర్ వేసిన తెలిసిందే. న్యూ…
బహుశా ఇలాంటి వెరైటీ భారీ బాక్సాఫీస్ క్లాష్ గతంలో చూసి ఉండం. ఒక హిందీ మూవీతో తెలుగు సినిమా కాంపీట్…