చాలాకాలంగా కాంగ్రెస్ పార్టీపై, సీఎం రేవంత్ రెడ్డిపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. తనకు మంత్రి పదవి ఇవ్వకుంటే ముఖ్యమంత్రిని అవుతానంటూ ఇటీవల ఆయన చేసిన కామెంట్లు రాజకీయ కాక రేపాయి. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి రేవంత్ ను డైరెక్ట్ గా టార్గెట్ చేస్తూ రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.
రేవంత్ రెడ్డి ఈ రెండేళ్లలో నిజాయతీగా పాలన చేయలేదని, అవినీతి లేకుండా పాలన జరగలేదని ఆరోపించారు. ఇక, అన్ని మంత్రిత్వ శాఖలు తన దగ్గరే రేవంత్ ఎందుకు పెట్టుకున్నాడని ప్రశ్నించారు. దేశ చరిత్రలో మరే సీఎం ఇలా ఇన్ని శాఖలు తన దగ్గర పెట్టుకోలేదని విమర్శించారు. ఇచ్చిన హామీలు ఎంత వరకు నెరవేర్చారో రేవంత్ చెప్పాలని రాజగోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. కీలక పదవుల్లో ఉన్న వ్యక్తులు నిజాయితీగా పని చేస్తున్నారా? అని నిలదీశారు.
మరోవైపు, కొందరు ఎమ్మెల్యేలతో రాజగోపాల్ రెడ్డి టచ్ లో ఉన్నారని, ఓ వర్గంగా విడిపోయి రేవంత్ సర్కార్ ను ఇరుకున పెట్టే యోచనలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. మంత్రి కాకుంటే ముఖ్యమంత్రి అవుతా అని రాజగోపాల్ చేసిన కామెంట్లపై కాంగ్రెస్ హై కమాండ్ సీరియస్ గా తీసుకున్నట్లు కనిపిస్తోంది.
రాజగోపాల్ రెడ్డితో మాట్లాడి ఆయన అభ్యంతరాలు తెలుసుకుంటామని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ అన్నారు. ఒకవేళ రాజగోపాల్ తో రాజీ విఫలమైతే ఆయనపై వేటు వేసేందుకు కూడా పార్టీ అధిష్టానం రెడీ అయిందని తెలుస్తోంది.
This post was last modified on February 21, 2026 11:26 am
ఫ్యాన్ బేసులకు అతీతంగా అందరు హీరోల అభిమానులు అధిక శాతం ఇష్టపడే హీరో రవితేజ. ఆరు పదుల వయసుకు దగ్గరగా…
స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యకర్తలు, నాయకులకు కీలక…
తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు, భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక…
ఇప్పుడు పెద్ద హీరోల నుంచి ఏడాదికో సినిమా వస్తే ఆశ్చర్యపోయే పరిస్థితి ఉంది. ఒక్క ప్రభాస్ను పక్కన పెడితే.. అల్లు…
ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న స్పిరిట్ షూటింగ్ మొదలుకాక ముందు హాట్ టాపిక్ గా మారింది…
పిల్లల విషయంలో తల్లిదండ్రులైనా, ఉపాధ్యాయులైనా ఎంత సున్నితంగా వ్యవహరించాలో చెప్పే ఉదంతమిది. విద్యార్థులను క్రమశిక్షణలో పెట్టాలని, వారిలో భయం పెంచాలని…