Movie News

వరలక్ష్మి రిస్కు ఫలితమిస్తే మంచిదే

చరిత్రలో ముందు నుంచీ మహిళా దర్శకురాళ్లు తెలుగులోనే కాదు ఏ భాషలో అయినా తక్కువే. కేవలం విజయనిర్మల గారు ఒక్కరే అత్యధిక సినిమాలకు దర్శకత్వం వహించడం ద్వారా గిన్నిస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డుల్లో తన పేరుని శాశ్వతంగా లిఖించుకున్నారు.

గత ఏడాది నీరజ కోన తెలుసు కదాతో, అంతకు ముందు లక్ష్మి సౌజన్య వరుడు కావలెనుతో తమ టాలెంట్ ఋజువు చేసుకునే ప్రయత్నం చేశారు కానీ ఆశించిన ఫలితాలు దక్కలేదు. తాజాగా వరలక్ష్మి శరత్ కుమార్ మెగా ఫోన్ చేపట్టారు. సరస్వతి పేరుతో రూపొందిన కోర్ట్ రూమ్ కం క్రైమ్ థ్రిల్లర్ విడుదలకు రెడీ అయిపోయింది. టీజర్ వదిలారు.

తప్పిపోయిన కూతురు కోసం ఇద్దరు తల్లులు పడే ఆరాటాన్ని ఎమోషన్, క్రైమ్, సెంటిమెంట్ అన్నీ మిక్స్ చేసి మేళవించిన తీరు ఆసక్తి రేపెలా ఉంది. క్యాస్టింగ్, టెక్నికల్ టీమ్ విషయంలో వరలక్ష్మి రాజీ పడలేదు. ప్రకాష్ రాజ్, ప్రియమణి, నాజర్, రావు రమేష్, మురళి శర్మ, కిషోర్, రఘు బాబు లాంటి సీనియర్ ఆర్టిస్టులు చాలానే ఉన్నారు.

కంటెంట్ లో యాక్షన్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. సంగీతం కోసం ఏకంగా తమన్ ని తీసుకున్నారు. సాయి మాధవ్ బుర్రా కథను అందించారు. ఈటీవీ విన్ నిర్మాణ భాగస్వామ్యం ఉంది. బడ్జెట్ బాగానే అయ్యిందని టాక్. సోదరి పూజాతో కలిసి వరలక్ష్మి దీనికి నిర్మాతగా వ్యవహరించడం గమనార్హం.

ఇలాంటివి వర్కౌట్ కావాలి. అన్ని రంగాల్లో మహిళలు దూసుకుపోతున్నారు కానీ ఒక్క సినిమా పరిశ్రమలో మాత్రం వీళ్ళ ఉనికి నెమ్మదిగా ఉంది. ఇప్పుడు ఉన్న వాళ్ళ నందిని రెడ్డి ఖాతాలో చెప్పుకోదగ్గ హిట్లు ఉన్నాయి. ప్రస్తుతం సమంతతో మా ఇంటి బంగారం చేస్తున్నారు.

గతంలో బి జయ, జీవిత రాజశేఖర్, సుచిత్ర చంద్రబోస్ లాంటి వాళ్ళు కొన్ని ప్రయత్నాలు చేశారు కానీ వాటిలో రిజల్ట్స్ దక్కినవి కొన్నే. మరి వరలక్ష్మి శరత్ కుమార్ దీన్ని బ్రేక్ చేసి కొత్త ట్రెండ్ కి శ్రీకారం ఏమైనా చుడతారేమో చూడాలి. మార్చి 6 సరస్వతి విడుదల కానుంది. ఇప్పుడు ట్రైలర్ వచ్చేసింది కాబట్టి బిజినెస్ వ్యవహారాలు ఊపందుకునే ఛాన్స్ ఉంది.

Kumar

Recent Posts

పట్టు వదలకుండా పరిగెత్తాలి పెద్ది

పెద్ది మొదటి వారం పూర్తి చేసుకుని సెకండ్ వీక్ లో అడుగు పెట్టింది. మూడు వందల యాభై కోట్ల వైపు…

9 minutes ago

పవన్ పేరు ఎందుకు మారింది?

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను వెల్లడించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో…

5 hours ago

ఏపీ పాఠ‌శాల‌ల్లో చాగంటి పాఠ్యాంశాలు..!

ఏపీ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ప్ర‌ముఖ ప్ర‌వ‌చ క‌ర్త చాగంటి కోటేశ్వ‌ర‌రావు ప్ర‌సంగాల‌ను పాఠ్యాంశాలుగా ప్ర‌వేశ పెడుతున్నట్టు ప్ర‌క‌టించింది. దీనికి సంబంధించి…

7 hours ago

జ‌న‌’సేన’ జాగ్ర‌త్త ప‌డాలా?

ఏపీలో కూటమిగా ఏర్పడిన టిడిపి, జనసేన, బిజెపిలు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయింది. ఈ క్రమంలో కూటమికి నేతృత్వం…

8 hours ago

మీనాక్షి ఇష్యూ కాంగ్రెస్ ను ‘హర్ట్’ చేసింది!

ఓ రాజకీయ పార్టీ తనను వేధించిన విషయంపై అలుపెరగని పోరాటం చేసి తీరుతుంది. అలా చేయకుంటే… అది రాజకీయ పార్టీ…

10 hours ago

మోదీ రికార్డును బద్దలుకొట్టడం కష్టమే!

భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. దేశానికి అత్యధిక కాలం…

10 hours ago