వైసీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వంతు వచ్చిందా? ఆయనను అరెస్టు చేయడం ఖాయమా? అంటే.. తాజా పరిణామాలు ఔననే సమాధానం ఇస్తున్నాయి. రాజధాని అమరావతి పరిధిలో నిర్మిస్తున్న ఇన్నర్ రింగ్ రోడ్డు భూముల కేసులో సీఐడీ అధికారులు ఆళ్ల రామకృష్ణారెడ్డికి తాజాగా నోటీసులు ఇచ్చారు. రింగ్ రోడ్డు విస్తరణలో ఉద్దేశపూర్వకంగా కుట్రకు పాల్పడ్డారంటూ.. గతంలో ఆళ్ల నానా యాగీ చేశారు.
దీంతో వైసీపీ హయాంలో సీఎం చంద్రబాబు సహా.. పలువురు నేతలపై అప్పటి సీఐడీ అధికారులు కేసులు నమోదు చేశారు. ముఖ్యంగా చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ సంస్థకు మేలు జరిగేలా ఐ ఆర్ ఆర్ లో మార్పులు చేశారని.. దీనివల్ల కోట్ల రూపాయల ప్రజా ధనం వృథా అవుతోందని ఆళ్ల ఆరోపించారు. అంతేకాదు.. ఉద్దేశపూర్వకంగానే అవసరం లేకున్నా ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంటులో మార్పులు చేశారని పేర్కొన్నారు.
అయితే.. ఈ కేసును విచారించిన విజయవాడలోని ఏసీబీ కోర్టులో.. సీఐడీ అధికారులు.. ఇటీవల మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ జరిగిందని పేర్కొంటూ అఫిడవిట్ ఇచ్చారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న కోర్టు కేసును మూసేసేందుకు రెడీ అయింది. ఈ నేపథ్యంలో ఆళ్ల అసలు ఏ ఆధారాలతో ఈ ఫిర్యాదు చేశారు..? అనే కోణంలో సీఐడీ అధికారులు ఇప్పుడు దర్యాప్తు చేపట్టారు. దీనిలో భాగంగానే ఆయనకు నోటీసులు ఇచ్చారు. గతంలో రాజధానికి రుణాలు ఇవ్వద్దంటూ ప్రపంచబ్యాంకుకు ఆళ్ల లేఖలు రాసిన విషయం తెలిసిందే.
ఇప్పుడు ఆ వ్యవహారంపై కూడా కేసులునమోదు చేసినట్టు తెలిసింది. ఈ మొత్తం వ్యవహారంపై విచారణకు హాజరు కావాలని కోరుతూ.. సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. అయితే.. ఈ విచారణలో భాగంగానే ఆయనను అరెస్టు చేయొచ్చని సీఐడీ చెబుతోంది.
“మాకు ఉన్న సమాచారం మేరకు ఆయనను విచారించాలని నిర్ణయించుకున్నాం. ఆయన ఇచ్చే సమాధానాల ఆధారంగాచర్యలు తీసుకుంటాం“ అని సీఐడీ అధికారి ఒకరు చెప్పారు. దీనిని బట్టి ఆళ్ల అరెస్టు ఖాయమని తెలుస్తోంది.
రాజమౌళి వారణాసి సినిమాలో రామాయణం బ్యాక్ డ్రాప్ కి సంబంధించిన ఎపిసోడ్ పైనే అందరి ఫోకస్ ఎక్కువగా ఉంది. అయితే…
ప్రభాస్, ఇమాన్వి జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ప్యాన్ ఇండియా మూవీ ఫౌజీ విడుదల ఎప్పుడనేది తేలడం లేదు.…
రకరకాల తేదీలతో అభిమానులను తెగ అయోమయానికి గురి చేస్తున్న ది ప్యారడైజ్ ఎట్టకేలకు సెప్టెంబర్ 25 విడుదల కావడానికి రెడీ…
మానవ జీవన యానంలో ఎప్పటికప్పుడు కొత్త పోకడలు, కొంగొత్త మోసాలు, సభ్య సమాజాన్ని నివ్వెరపరిచే నయా వేధింపులు… ఇలా ఒక్కటేమిటి…
ఒక పాత్రకు ఒక ఆర్టిస్టు ఎంపికై.. ఆ తర్వాత ఇంకొకరి చేతికి మారడం ఫిలిం ఇండస్ట్రీలో మామూలే. చాలాసార్లు చిత్రీకరణకు…
రావు బహదూర్ ప్రెస్ మీట్ లో మీడియా ప్రతినిధి, నిర్మాత మధ్య జరిగిన సంభాషణలో ఒక సినిమా 450 కోట్లు…