వైసీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వంతు వచ్చిందా? ఆయనను అరెస్టు చేయడం ఖాయమా? అంటే.. తాజా పరిణామాలు ఔననే సమాధానం ఇస్తున్నాయి. రాజధాని అమరావతి పరిధిలో నిర్మిస్తున్న ఇన్నర్ రింగ్ రోడ్డు భూముల కేసులో సీఐడీ అధికారులు ఆళ్ల రామకృష్ణారెడ్డికి తాజాగా నోటీసులు ఇచ్చారు. రింగ్ రోడ్డు విస్తరణలో ఉద్దేశపూర్వకంగా కుట్రకు పాల్పడ్డారంటూ.. గతంలో ఆళ్ల నానా యాగీ చేశారు.
దీంతో వైసీపీ హయాంలో సీఎం చంద్రబాబు సహా.. పలువురు నేతలపై అప్పటి సీఐడీ అధికారులు కేసులు నమోదు చేశారు. ముఖ్యంగా చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ సంస్థకు మేలు జరిగేలా ఐ ఆర్ ఆర్ లో మార్పులు చేశారని.. దీనివల్ల కోట్ల రూపాయల ప్రజా ధనం వృథా అవుతోందని ఆళ్ల ఆరోపించారు. అంతేకాదు.. ఉద్దేశపూర్వకంగానే అవసరం లేకున్నా ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంటులో మార్పులు చేశారని పేర్కొన్నారు.
అయితే.. ఈ కేసును విచారించిన విజయవాడలోని ఏసీబీ కోర్టులో.. సీఐడీ అధికారులు.. ఇటీవల మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ జరిగిందని పేర్కొంటూ అఫిడవిట్ ఇచ్చారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న కోర్టు కేసును మూసేసేందుకు రెడీ అయింది. ఈ నేపథ్యంలో ఆళ్ల అసలు ఏ ఆధారాలతో ఈ ఫిర్యాదు చేశారు..? అనే కోణంలో సీఐడీ అధికారులు ఇప్పుడు దర్యాప్తు చేపట్టారు. దీనిలో భాగంగానే ఆయనకు నోటీసులు ఇచ్చారు. గతంలో రాజధానికి రుణాలు ఇవ్వద్దంటూ ప్రపంచబ్యాంకుకు ఆళ్ల లేఖలు రాసిన విషయం తెలిసిందే.
ఇప్పుడు ఆ వ్యవహారంపై కూడా కేసులునమోదు చేసినట్టు తెలిసింది. ఈ మొత్తం వ్యవహారంపై విచారణకు హాజరు కావాలని కోరుతూ.. సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. అయితే.. ఈ విచారణలో భాగంగానే ఆయనను అరెస్టు చేయొచ్చని సీఐడీ చెబుతోంది.
“మాకు ఉన్న సమాచారం మేరకు ఆయనను విచారించాలని నిర్ణయించుకున్నాం. ఆయన ఇచ్చే సమాధానాల ఆధారంగాచర్యలు తీసుకుంటాం“ అని సీఐడీ అధికారి ఒకరు చెప్పారు. దీనిని బట్టి ఆళ్ల అరెస్టు ఖాయమని తెలుస్తోంది.
దర్శకులందు అనిల్ రావిపూడి వేరయాని ఊరికే అనలేదు. షూటింగ్ మొదలుపెట్టడానికి ముందే తనదైన ప్రమోషన్లతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్…
దేశంలో ఇటీవలే లోక్ సభ, అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపునకు సంబందించి ఓ రేంజిలో రచ్చ జరిగిన సంగతి తెలిసిందే.…
రెడ్ బుక్ మూసేయలేదని.. అది ఇంకా తెరిచే ఉందని మంత్రి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రెడ్ బుక్లో…
ఈ ఏడాది ‘దురంధర్-2’ సినిమాతో బాలీవుడ్ బాక్సాఫీస్ బాగానే కళకళలాడినప్పటికీ.. ఓవరాల్ సక్సెస్ రేట్ ఏమీ అంత గొప్పగా లేదు.…
తమరిది అన్నదమ్ముల అనుబంధం అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి మంత్రి నారా లోకేష్ పలుమార్లు వ్యాఖ్యానించారు.…
రాష్ట్రంలో బౌలర్స్(ప్రత్యర్థులు) మారినా బ్యాట్స్మెన్ మాత్రం చంద్రబాబు నాయుడేనని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. తిరుపతిలో జరిగిన ప్రభుత్వ వియోజత్సవ…