ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కల్తీ నెయ్యి వ్యవహారంలో మరిన్ని వాస్తవాలను వెలికి తీసేందుకు మాజీ ఐఏఎస్ అధికారి ఆధ్వర్యంలో ఏకసభ్య కమిషన్ను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
మాజీ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి విజయానంద్ శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిషన్ 45 రోజుల్లో అన్ని వివరాలతో సమగ్ర నివేదిక ఇవ్వాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. లడ్డూ కల్తీ వెనుక కుట్రలను బయటకు తీసుకురావడంతో పాటు, టీటీడీ పాలనలోని లోపాలను, టెండర్ల వ్యవహారాన్ని కూడా సమగ్రంగా పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఏకసభ్య కమిషన్కు సూచించారు.
రీజన్ ఏంటి?
తిరుమల శ్రీవారి లడ్డూ వ్యవహారంపై సుప్రీంకోర్టు గతంలోనే సీబీఐ నేతృత్వంలో ఒక కమిటీని నియమించింది. ఈ కమిటీ సుమారు 15 నెలల పాటు అన్ని కోణాల్లో పరిశీలించి తన చార్జ్ షీట్ను నెల్లూరు కోర్టుకు సమర్పించింది. దీనిపై విచారణ జరగాల్సి ఉంది. అయితే అసలు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని పక్కన పెట్టడంపైనే ప్రభుత్వం ఇప్పుడు కమిషన్ ద్వారా నిగ్గు తేల్చాలని నిర్ణయించింది.
దీంతో పాటు వైసీపీ హయాంలో తిరుమల టెండర్లను ఇష్టానుసారంగా మార్చడం, నిబంధనల్లో మార్పులు చేయడంపై గత కమిటీ ప్రత్యేకంగా దృష్టి పెట్టలేదని ప్రభుత్వం భావిస్తోంది. అదేసమయంలో మనీ లాండరింగ్ కోణంలోనూ సీబీఐ అధికారులు నిర్దిష్టంగా విచారణ చేయలేదని అభిప్రాయం ఉంది. అలాగే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందా లేదా అనే విషయంపై స్పష్టత ఇవ్వకపోవడం, 10 శాతానికి పైగా కలిసినట్లు ఆనవాళ్లు లేవని చెప్పడం వంటి అంశాలపై సందేహాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో అన్ని వర్గాల ప్రజల అనుమానాలను నివృత్తి చేయడానికి ఏకసభ్య కమిషన్ను ఏర్పాటు చేయడం గమనార్హం.
This post was last modified on February 20, 2026 9:54 pm
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…
వైసీపీ ఎమ్మెల్సీ అనంత సత్య ఉదయ భాస్కర్ (అనంతబాబు) డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుపై శుక్రవారం సుప్రీంకోర్టు లో విచారణ…