Political News

తిరుమల లడ్డూ వివాదం: 45 రోజుల్లో నిజాలు బహిర్గతం

ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కల్తీ నెయ్యి వ్యవహారంలో మరిన్ని వాస్తవాలను వెలికి తీసేందుకు మాజీ ఐఏఎస్ అధికారి ఆధ్వర్యంలో ఏకసభ్య కమిషన్‌ను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

మాజీ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి విజయానంద్ శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిషన్ 45 రోజుల్లో అన్ని వివరాలతో సమగ్ర నివేదిక ఇవ్వాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. లడ్డూ కల్తీ వెనుక కుట్రలను బయటకు తీసుకురావడంతో పాటు, టీటీడీ పాలనలోని లోపాలను, టెండర్ల వ్యవహారాన్ని కూడా సమగ్రంగా పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఏకసభ్య కమిషన్‌కు సూచించారు.

రీజన్ ఏంటి?

తిరుమల శ్రీవారి లడ్డూ వ్యవహారంపై సుప్రీంకోర్టు గతంలోనే సీబీఐ నేతృత్వంలో ఒక కమిటీని నియమించింది. ఈ కమిటీ సుమారు 15 నెలల పాటు అన్ని కోణాల్లో పరిశీలించి తన చార్జ్ షీట్‌ను నెల్లూరు కోర్టుకు సమర్పించింది. దీనిపై విచారణ జరగాల్సి ఉంది. అయితే అసలు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని పక్కన పెట్టడంపైనే ప్రభుత్వం ఇప్పుడు కమిషన్ ద్వారా నిగ్గు తేల్చాలని నిర్ణయించింది.

దీంతో పాటు వైసీపీ హయాంలో తిరుమల టెండర్లను ఇష్టానుసారంగా మార్చడం, నిబంధనల్లో మార్పులు చేయడంపై గత కమిటీ ప్రత్యేకంగా దృష్టి పెట్టలేదని ప్రభుత్వం భావిస్తోంది. అదేసమయంలో మనీ లాండరింగ్ కోణంలోనూ సీబీఐ అధికారులు నిర్దిష్టంగా విచారణ చేయలేదని అభిప్రాయం ఉంది. అలాగే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందా లేదా అనే విషయంపై స్పష్టత ఇవ్వకపోవడం, 10 శాతానికి పైగా కలిసినట్లు ఆనవాళ్లు లేవని చెప్పడం వంటి అంశాలపై సందేహాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో అన్ని వర్గాల ప్రజల అనుమానాలను నివృత్తి చేయడానికి ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేయడం గమనార్హం.

This post was last modified on February 20, 2026 9:54 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అప్పుల కష్టాల నుండి ఐపీఎల్ హీరో వరకు..

లక్నో సూపర్ జెయింట్స్ కొత్త సెన్సేషన్ ముకుల్ చౌదరి ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్. కేకేఆర్ పై అతను…

2 minutes ago

ఆ రెడ్ల మౌనం వెనుక రహస్యం..?

వైసీపీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత పార్టీ అంతర్గత పరిస్థితులు కొత్త చర్చలకు దారితీస్తున్నాయి. ఒకప్పుడు అధికారం చుట్టూ తిరిగిన కీలక…

7 minutes ago

ఎమ్మెల్సీ సీటుకి 30 కోట్లా?

రాజకీయం ఇప్పుడు డబ్బు చుట్టూ నడుస్తోంది. ఎవరు ఔనన్నా, ఎవరు కాదన్నా...ఇది పచ్చి నిజం. డబ్బు లేనిది ఏ ఒక్క…

45 minutes ago

అతిథి చాలా పెద్ద రిస్కు చేస్తున్నాడు

ఈ మధ్య రీ రిలీజుల ట్రెండ్ కొత్త పోకడలు పోతోంది. మొదలైనప్పుడు కేవలం తెలుగు రాష్ట్రాలకు పరిమితం చేయడం దగ్గరి…

2 hours ago

ప్రేక్షకుల పట్ల బాధ్యత లేదా?

గతంలో ఒక సినిమాకు ఓ రిలీజ్ డేట్ ప్రకటించారు అంటే దాన్ని చాలా సీరియస్‌గా తీసుకునేవారు. ఎలాగైనా చెప్పిన డేటుకే…

2 hours ago

జన నాయగన్ పైరసీ వెనుక శత్రువులెవరు

నిన్న సాయంత్రం నుంచి విజయ్ అభిమానులకు నిద్ర రావడం లేదు. ముందు జన నాయకుడు లీక్స్ అంటూ తమిళ వెర్షన్…

3 hours ago