Political News

తిరుమల లడ్డూ వివాదం: 45 రోజుల్లో నిజాలు బహిర్గతం

ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కల్తీ నెయ్యి వ్యవహారంలో మరిన్ని వాస్తవాలను వెలికి తీసేందుకు మాజీ ఐఏఎస్ అధికారి ఆధ్వర్యంలో ఏకసభ్య కమిషన్‌ను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

మాజీ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి విజయానంద్ శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిషన్ 45 రోజుల్లో అన్ని వివరాలతో సమగ్ర నివేదిక ఇవ్వాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. లడ్డూ కల్తీ వెనుక కుట్రలను బయటకు తీసుకురావడంతో పాటు, టీటీడీ పాలనలోని లోపాలను, టెండర్ల వ్యవహారాన్ని కూడా సమగ్రంగా పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఏకసభ్య కమిషన్‌కు సూచించారు.

రీజన్ ఏంటి?

తిరుమల శ్రీవారి లడ్డూ వ్యవహారంపై సుప్రీంకోర్టు గతంలోనే సీబీఐ నేతృత్వంలో ఒక కమిటీని నియమించింది. ఈ కమిటీ సుమారు 15 నెలల పాటు అన్ని కోణాల్లో పరిశీలించి తన చార్జ్ షీట్‌ను నెల్లూరు కోర్టుకు సమర్పించింది. దీనిపై విచారణ జరగాల్సి ఉంది. అయితే అసలు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని పక్కన పెట్టడంపైనే ప్రభుత్వం ఇప్పుడు కమిషన్ ద్వారా నిగ్గు తేల్చాలని నిర్ణయించింది.

దీంతో పాటు వైసీపీ హయాంలో తిరుమల టెండర్లను ఇష్టానుసారంగా మార్చడం, నిబంధనల్లో మార్పులు చేయడంపై గత కమిటీ ప్రత్యేకంగా దృష్టి పెట్టలేదని ప్రభుత్వం భావిస్తోంది. అదేసమయంలో మనీ లాండరింగ్ కోణంలోనూ సీబీఐ అధికారులు నిర్దిష్టంగా విచారణ చేయలేదని అభిప్రాయం ఉంది. అలాగే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందా లేదా అనే విషయంపై స్పష్టత ఇవ్వకపోవడం, 10 శాతానికి పైగా కలిసినట్లు ఆనవాళ్లు లేవని చెప్పడం వంటి అంశాలపై సందేహాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో అన్ని వర్గాల ప్రజల అనుమానాలను నివృత్తి చేయడానికి ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేయడం గమనార్హం.

This post was last modified on February 20, 2026 9:54 pm

Share

Recent Posts

ఏజెంట్‌లో నన్ను చూసి అసహ్యమేసింది – అఖిల్

అక్కినేని యువ కథానాయకుడు అఖిల్ హీరోగా స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి రూపొందించిన ‘ఏజెంట్’ టాలీవుడ్ చరిత్రలోనే అతి పెద్ద…

47 minutes ago

దేవర కలెక్షన్లపై డిస్ట్రిబ్యూటర్ క్లారిటీ

ఒక సినిమా రిలీజైన రెండు మూడేళ్ల తర్వాత కూడా దాని కలెక్షన్ల గురించి విపరీతమైన చర్చ జరగడం అరుదు. ‘దేవర’ విషయంలో ఇదే…

5 hours ago

కొత్త విద్యా మంత్రిగా జోషి… ఎవరీయన?

కేంద్ర విద్యా శాఖకు నూతన మంత్రిగా బీజేపీ సీనియర్ నేత, కేంద్ర కేబినెట్ లో కీలక శాఖల మంత్రిగా కొనసాగుతున్న ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు.…

8 hours ago

విజయ్ బలహీనతే కిరణ్ బలం

బాక్సాఫీస్ దగ్గర పోటీ ఉన్నప్పుడు కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు జరుగుతాయి. ఇది అలాంటిదే. కేవలం ఒక్క రోజు గ్యాప్ తో…

8 hours ago

‘స్పైడర్ మ్యాన్’ రచ్చ చేసేలా ఉన్నాడు

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులను సొంతం చేసుకున్న స్పైడర్ మ్యాన్ సిరీస్ లోని కొత్త సినిమా బ్రాండ్ న్యూ డే జూలై…

9 hours ago

జగన్ లాజిక్… ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ కి లోకేష్ కు ముడి!

ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ కొత్త లాజిక్ మాట్లాడుతున్నారు. నైతిక బాధ్యత వహిస్తూ…

9 hours ago