తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్ జరుగుతుంటే.. తన ఇంటి నుంచి క్యారియర్లు తెప్పించడం దాదాపు రోజూ జరిగే విషయమే. ఐతే వేరే రాష్ట్రంలో షూట్ జరుగుతుంటే అక్కడి ఫుడ్డే తినక తప్పదు.
కానీ ఒక రాష్ట్రంలో షూటింగ్లో పాల్గొంటూ ఇంకో రాష్ట్రం నుంచి క్యారియర్ తెప్పించుకోవడం అన్నది ఎప్పుడైనా విన్నామా? ప్రభాస్ ఖాతాలో ఈ ఘనత కూడా ఉందట. ఈ విషయాన్ని ‘కపుల్ ఫ్రెండ్లీ’ టీంతో కలిసి చేసిన చిట్ చాట్ ఇంటర్వ్యూలో ప్రభాస్ వెల్లడించాడు.
దీని గురించి ముందే తెలుసుకున్న హీరో సంతోష్ శోభన్.. ఇది మరీ ఓవర్గా ఉందన్నా అంటూ వేరే రాష్ట్రం నుంచి మీరు క్యారియర్ తెప్పించుకున్న విషయం నిజమేనా అని అడిగాడు. దీనికి బదులిస్తూ.. ఆదిపురుష్ షూటింగ్ టైంలో జరిగిన విషయాన్ని పంచుకున్నాడు ప్రభాస్.
‘‘ఆదిపురుష్ ముంబయిలో జరుగుతుండగా.. ఒకసారి అందరం చీట్ మీల్ తిందాం అనుకున్నాం. అప్పుడు నాకు చెన్నై ఫుడ్ తినాలి, అందరికీ తినిపించాలి అనిపించింది. దీంతో ఆ ఫుడ్ తెప్పించాలని నిర్ణయించుకుని.. ఓం రౌత్ సహా టీంలో అందరికీ చెప్పా. వాళ్లు ఎదురు చూస్తూ ఉన్నారు.
తర్వాత లేటవుతుంటే.. ఏంటి ఇంకా రాలేదు అన్నారు. వస్తుంది, చెన్నై నుంచి రావాలి కదా అంటే.. అందరూ షాకైపోయారు. చెన్నై ఫుడ్ అంటే ముంబయిలోనే ఆ స్టయిల్లో చేసే రెస్టారెంట్ నుంచి తెప్పిస్తారని అనుకున్నాం కానీ.. ఇలా వేరే రాష్ట్రం నుంచి స్విగ్గీలో ఫుడ్ తెప్పించడం ఏంటి అన్నారు.
చెన్నైలో ఇడియప్పం, బిరియాని చాలా బాగుంటాయి. హైదరాబాద్ బిరియానికి ఫేమస్సే కానీ.. చెన్నైలో వేరే స్టయిల్లో చేస్తారు. అది నాకు చిన్నప్పట్నుంచి ఇష్టం. అందుకే అక్కడ ఫేమస్ అయిన ఫుడ్ అంతా తెప్పించా. నాకు చెన్నై ఫుడ్ తినాలనిపించినపుడల్లా ఇలాతెప్పిస్తుంటా.
తాజాగా ఫుడ్ చేయించి ఒక మనిషిని పెట్టి క్యారియర్తో ఫ్లైట్ ఎక్కించి ముంబయికి రప్పించాను. అక్కడ్నుంచి ఫుడ్ వచ్చాక వేడి వేడిగా వడ్డిస్తే అందరూ ఇష్టంగా తిన్నారు’’ అని ప్రభాస్ వెల్లడించాడు. ప్రభాస్ తిండి ప్రేమ, అతిథులకు పెట్టే విందు భోజనాల గురించి చాలా విన్నాం కానీ.. ఇలా వేరే రాష్ట్రం నుంచి ఫుడ్ తెప్పించడం ఏంటయ్యా అంటూ అందరూ అవాక్కవుతున్నారు.
This post was last modified on February 20, 2026 4:20 pm
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…
వైసీపీ ఎమ్మెల్సీ అనంత సత్య ఉదయ భాస్కర్ (అనంతబాబు) డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుపై శుక్రవారం సుప్రీంకోర్టు లో విచారణ…