తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్ జరుగుతుంటే.. తన ఇంటి నుంచి క్యారియర్లు తెప్పించడం దాదాపు రోజూ జరిగే విషయమే. ఐతే వేరే రాష్ట్రంలో షూట్ జరుగుతుంటే అక్కడి ఫుడ్డే తినక తప్పదు.
కానీ ఒక రాష్ట్రంలో షూటింగ్లో పాల్గొంటూ ఇంకో రాష్ట్రం నుంచి క్యారియర్ తెప్పించుకోవడం అన్నది ఎప్పుడైనా విన్నామా? ప్రభాస్ ఖాతాలో ఈ ఘనత కూడా ఉందట. ఈ విషయాన్ని ‘కపుల్ ఫ్రెండ్లీ’ టీంతో కలిసి చేసిన చిట్ చాట్ ఇంటర్వ్యూలో ప్రభాస్ వెల్లడించాడు.
దీని గురించి ముందే తెలుసుకున్న హీరో సంతోష్ శోభన్.. ఇది మరీ ఓవర్గా ఉందన్నా అంటూ వేరే రాష్ట్రం నుంచి మీరు క్యారియర్ తెప్పించుకున్న విషయం నిజమేనా అని అడిగాడు. దీనికి బదులిస్తూ.. ఆదిపురుష్ షూటింగ్ టైంలో జరిగిన విషయాన్ని పంచుకున్నాడు ప్రభాస్.
‘‘ఆదిపురుష్ ముంబయిలో జరుగుతుండగా.. ఒకసారి అందరం చీట్ మీల్ తిందాం అనుకున్నాం. అప్పుడు నాకు చెన్నై ఫుడ్ తినాలి, అందరికీ తినిపించాలి అనిపించింది. దీంతో ఆ ఫుడ్ తెప్పించాలని నిర్ణయించుకుని.. ఓం రౌత్ సహా టీంలో అందరికీ చెప్పా. వాళ్లు ఎదురు చూస్తూ ఉన్నారు.
తర్వాత లేటవుతుంటే.. ఏంటి ఇంకా రాలేదు అన్నారు. వస్తుంది, చెన్నై నుంచి రావాలి కదా అంటే.. అందరూ షాకైపోయారు. చెన్నై ఫుడ్ అంటే ముంబయిలోనే ఆ స్టయిల్లో చేసే రెస్టారెంట్ నుంచి తెప్పిస్తారని అనుకున్నాం కానీ.. ఇలా వేరే రాష్ట్రం నుంచి స్విగ్గీలో ఫుడ్ తెప్పించడం ఏంటి అన్నారు.
చెన్నైలో ఇడియప్పం, బిరియాని చాలా బాగుంటాయి. హైదరాబాద్ బిరియానికి ఫేమస్సే కానీ.. చెన్నైలో వేరే స్టయిల్లో చేస్తారు. అది నాకు చిన్నప్పట్నుంచి ఇష్టం. అందుకే అక్కడ ఫేమస్ అయిన ఫుడ్ అంతా తెప్పించా. నాకు చెన్నై ఫుడ్ తినాలనిపించినపుడల్లా ఇలాతెప్పిస్తుంటా.
తాజాగా ఫుడ్ చేయించి ఒక మనిషిని పెట్టి క్యారియర్తో ఫ్లైట్ ఎక్కించి ముంబయికి రప్పించాను. అక్కడ్నుంచి ఫుడ్ వచ్చాక వేడి వేడిగా వడ్డిస్తే అందరూ ఇష్టంగా తిన్నారు’’ అని ప్రభాస్ వెల్లడించాడు. ప్రభాస్ తిండి ప్రేమ, అతిథులకు పెట్టే విందు భోజనాల గురించి చాలా విన్నాం కానీ.. ఇలా వేరే రాష్ట్రం నుంచి ఫుడ్ తెప్పించడం ఏంటయ్యా అంటూ అందరూ అవాక్కవుతున్నారు.
This post was last modified on February 20, 2026 4:20 pm
తెలంగాణ రాజకీయాల్లో ఒకప్పుడు తిరుగులేని శక్తిగా వెలిగిన గులాబీ గూటిలో ఇప్పుడు ఆసక్తికరమైన ఆధిపత్య పోరు మొదలైంది. కేసీఆర్ రాజకీయ…
పరిధి.. పరిమితులు ఉంటాయన్న విషయాన్ని మర్చిపోవటం కొంతమంది వైసీపీ నేతలకు అలవాటే. దూకుడే తమ ఆయుధం అన్నట్లుగా వ్యవహరించే తీరు…
వైసీపీ అధినేత జగన్ చేయలేనిది ఇప్పుడు అనేక విషయాల్లో కూటమి ప్రభుత్వం చేసి చూపిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో…
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మంగళవారం తన పదవికి రాజీనామా చేసి గవర్నర్కు రాజీనామా పత్రాన్ని సమర్పించారు. దాదాపు 21…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా.. ఇచ్చిన మాట.. ఆరు మాసాలు కూడా తిరక్కుండానే వాస్తవంకానుంది.…
తన రాజకీయ ప్రత్యర్థి వైయస్సార్ పార్టీ అధినేత వైయస్ జగన్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. పార్లమెంట్లో…