Political News

కూట‌మికి `బ్ర‌హ్మాస్త్రం` ఇచ్చేసిన‌ ప‌య్యావుల ..!

కూట‌మి నాయ‌కుల‌కు ఆర్థిక శాఖ మంత్రి ప‌య్యావుల కేశ‌వ్ కీల‌క రాజ‌కీయ అస్త్రాన్ని ఇచ్చారు. “రాష్ట్రానికి వైసీపీ హానిక‌రం“ అంటూ.. ఆయ‌న అసెంబ్లీలో చేసిన ప్ర‌క‌ట‌న‌.. ఇప్పుడు రాజ‌కీయ నినాదంగా మార‌నుంది. ప్ర‌స్తుతం మ‌ద్యం, సిగ‌రెట్లు వంటి వాటిపై.. `ఆరోగ్యానికి హానికరం` అని రాసి ఉంటుంది. ఇప్పుడు రాజ‌కీయంగా రాష్ట్రంలో వైసీపీ హానిక‌రం అనే నినాదం పెద్ద ఎత్తున వినిపించ‌నుంది.

గ‌తంలో టీడీపీ యువ‌నాయ‌కుడు.. మంత్రి నారా లోకేష్‌.. ఓ స‌భ‌లో జ‌గ‌న్‌ను ఉద్దేశించి.. `సైకో` అని వ్యా ఖ్యానించారు. తొలుత ఆయ‌న ఈ వ్యాఖ్య చేయ‌డానికి త‌డ‌బ‌డినా.. కౌంట‌ర్ ఎలా ఉంటుందో అని అనుకున్నా.. త‌ర్వాత కాలంలో వైసీపీ పై విమ‌ర్శ‌లు చేయ‌డానికి, విరుచుకుప‌డ‌డానికి కూడా కూట‌మి నాయకుల‌కు `సైకో` ప‌దం బ్ర‌హ్మాస్త్రంగా ప‌నిచేసింది. ఇది ఎంత వ‌ర‌కు వెళ్లిందంటే.. వైసీపీ ప్ర‌భుత్వ బాధితులే కాదు.. కాలేజీ విద్యార్థులు సైతం.. సైకో నినాదాలతో ఒక ద‌శ‌లో విజృంభించారు.

ఆ త‌ర్వాత‌.. బీజేపీ నాయ‌కురాలు.. ప్ర‌స్తుత ఎంపీ.. పురందేశ్వ‌రి జ‌గ‌న్ స‌ర్కారు చేసిన అప్పుల‌పై.. చేసిన ప్ర‌క‌ట‌న కూడా.. గ‌త ఎన్నిక‌ల వ‌ర‌కు పెద్ద ఎత్తున మార్మోగింది. “జ‌గ‌న్‌.. 14 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌లు అప్పు చేశారం“టూ.. రాజ‌మండ్రిలో మీడియా ముందు ఆమె చేసిన వ్యాఖ్య‌.. త‌ర్వాత కాలంలో టీడీపీ అంది పుచ్చుకుంది. ఎన్నిక‌ల స‌మ‌యంలో పెద్ద ఎత్తున దీనిపై చ‌ర్చ జ‌రిగింది. ఇది కూడా జ‌గ‌న్ ప‌త‌నానికి దారి తీసేలా చేసింది.

ఇలా.. ప‌లు సంద‌ర్భాల్లో ఆయా పార్టీల నాయ‌కులు చేసిన కామెంట్లు.. త‌ర్వాత కాలంలో ఎన్నిక‌ల నినాదాలుగా మారాయి. అవి వైసీపీని తీవ్రంగా ఇరుకున ప‌డేశాయి. ఇప్పుడు ప‌య్యావుల చేసిన “రాష్ట్రానికి వైసీపీ హానిక‌రం“ నినాదం కూడా అదే రేంజ్‌లో వైసీపీపై ప్ర‌భావం చూపించ‌డం ఖాయ‌మ‌న్న చ‌ర్చ నడుస్తోంది.

This post was last modified on February 20, 2026 2:53 pm

Share

Recent Posts

100 కోట్లు రాలేదంటే ఏమనుకోవాలి

నిన్న విడుదలైన జన నాయకుడుకి ఎలాంటి టాక్ వచ్చిందో తెలిసిందే. విజయ్ కున్న క్రేజ్ దృష్యా తమిళనాడులో ఎగబడి చూస్తున్నారు…

7 minutes ago

`మేకిన్` ఇండియా అడిగితే.. `లీకిన్` ఇండియా ఇచ్చారు

కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారుపై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ త‌న‌దైన శైలిలో సెటైర్లు వేశారు. దేశ ప్ర‌జ‌లు మేకిన్…

1 hour ago

మ‌న్యానికి కుంకీల‌ను పంపిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌

పార్వ‌తీపురం మ‌న్యం జిల్లాలోని రైతులు గ‌త కొన్ని రోజులుగా ఏనుగుల బెడ‌ద‌ను ఎదుర్కొంటున్నారు. స్థానిక గ్రామాల్లోకి ఏనుగులు చొర‌బ‌డి ప్ర‌జ‌ల‌ను…

2 hours ago

స్థానికంపై జగన్ సీరియస్ గానే ఉన్నారా?

ఏపీలో సార్వత్రిక ఎన్నికల తర్వాత మరో కీలక ఎన్నికలకు తెర లేవనుంది. రాష్ట్రంలోని స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించే దిశగా కూటమి సర్కారు ప్రణాళికలు…

3 hours ago

ముగ్గురు యువతుల ముద్దుల వరుడు

ఇద్దరు భార్యల ముద్దుల మొగుడు.. ఈ కాన్సెప్ట్ తో తెలుగులో ఎన్నో సినిమాలు వచ్చాయి. వినడానికి, చూడడానికి సరదాగానే ఉంటుంది.…

4 hours ago

రామ రామా… ఇంకెన్ని బ్రేకులు స్వామీ

నాలుగు వేల కోట్లతో తీశామని గొప్పగా చెప్పుకున్న ప్యాన్ ఇండియా మూవీ రామాయణ ప్రమోషన్ల పరంగా వేస్తున్న అడుగులు ఎటెటో…

4 hours ago