కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. “రాష్ట్రానికి వైసీపీ హానికరం“ అంటూ.. ఆయన అసెంబ్లీలో చేసిన ప్రకటన.. ఇప్పుడు రాజకీయ నినాదంగా మారనుంది. ప్రస్తుతం మద్యం, సిగరెట్లు వంటి వాటిపై.. `ఆరోగ్యానికి హానికరం` అని రాసి ఉంటుంది. ఇప్పుడు రాజకీయంగా రాష్ట్రంలో వైసీపీ హానికరం అనే నినాదం పెద్ద ఎత్తున వినిపించనుంది.
గతంలో టీడీపీ యువనాయకుడు.. మంత్రి నారా లోకేష్.. ఓ సభలో జగన్ను ఉద్దేశించి.. `సైకో` అని వ్యా ఖ్యానించారు. తొలుత ఆయన ఈ వ్యాఖ్య చేయడానికి తడబడినా.. కౌంటర్ ఎలా ఉంటుందో అని అనుకున్నా.. తర్వాత కాలంలో వైసీపీ పై విమర్శలు చేయడానికి, విరుచుకుపడడానికి కూడా కూటమి నాయకులకు `సైకో` పదం బ్రహ్మాస్త్రంగా పనిచేసింది. ఇది ఎంత వరకు వెళ్లిందంటే.. వైసీపీ ప్రభుత్వ బాధితులే కాదు.. కాలేజీ విద్యార్థులు సైతం.. సైకో నినాదాలతో ఒక దశలో విజృంభించారు.
ఆ తర్వాత.. బీజేపీ నాయకురాలు.. ప్రస్తుత ఎంపీ.. పురందేశ్వరి జగన్ సర్కారు చేసిన అప్పులపై.. చేసిన ప్రకటన కూడా.. గత ఎన్నికల వరకు పెద్ద ఎత్తున మార్మోగింది. “జగన్.. 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారం“టూ.. రాజమండ్రిలో మీడియా ముందు ఆమె చేసిన వ్యాఖ్య.. తర్వాత కాలంలో టీడీపీ అంది పుచ్చుకుంది. ఎన్నికల సమయంలో పెద్ద ఎత్తున దీనిపై చర్చ జరిగింది. ఇది కూడా జగన్ పతనానికి దారి తీసేలా చేసింది.
ఇలా.. పలు సందర్భాల్లో ఆయా పార్టీల నాయకులు చేసిన కామెంట్లు.. తర్వాత కాలంలో ఎన్నికల నినాదాలుగా మారాయి. అవి వైసీపీని తీవ్రంగా ఇరుకున పడేశాయి. ఇప్పుడు పయ్యావుల చేసిన “రాష్ట్రానికి వైసీపీ హానికరం“ నినాదం కూడా అదే రేంజ్లో వైసీపీపై ప్రభావం చూపించడం ఖాయమన్న చర్చ నడుస్తోంది.
This post was last modified on February 20, 2026 2:53 pm
టాలీవుడ్ స్టార్ హీరోల కొడుకులకు చిన్నతనంలోనే సినిమా పురుగు కుట్టేస్తుంది. బాల నటుడిగానే అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉంటారు. ఆ కోవలోనే…
మహిళలు మీసాలు పెంచలేరని.. పురుషులు గర్భాన్ని దాల్చలేరని సామెత!. అయితే.. ఇటీవల కాలంలో రష్యాకు చెందిన ఓ మహిళ మీసాలు…
విశ్వాసం..అతి విశ్వాసం…ఈ రెండింటికి మధ్య ఒక సన్నని గీత ఉంది. ఈ విషయం తెలుసుకోకుండా చాలామంది రాజకీయ నేతలు తొందరపడుతుంటారు…
ఇంకో 15 రోజుల్లో విడుదల కాబోతున్న ది ప్యారడైజ్ టికెట్ రేట్లకు సంబంధించి ట్రేడ్ వర్గాల్లో చర్చలు మొదలైపోయాయి. పెంచాలా…
వైసీపీ హయాంలో మూడేళ్ల క్రితం జరిగిన తన అరెస్టు ఘటనను ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. నాడు జరిగిన ఘటనలను…
పుట్టిన 13 రోజులకే పాస్పోర్ట్ తీసుకోవడం సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతుంది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలోని దాసన్నపేటకు చెందిన…