కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. “రాష్ట్రానికి వైసీపీ హానికరం“ అంటూ.. ఆయన అసెంబ్లీలో చేసిన ప్రకటన.. ఇప్పుడు రాజకీయ నినాదంగా మారనుంది. ప్రస్తుతం మద్యం, సిగరెట్లు వంటి వాటిపై.. `ఆరోగ్యానికి హానికరం` అని రాసి ఉంటుంది. ఇప్పుడు రాజకీయంగా రాష్ట్రంలో వైసీపీ హానికరం అనే నినాదం పెద్ద ఎత్తున వినిపించనుంది.
గతంలో టీడీపీ యువనాయకుడు.. మంత్రి నారా లోకేష్.. ఓ సభలో జగన్ను ఉద్దేశించి.. `సైకో` అని వ్యా ఖ్యానించారు. తొలుత ఆయన ఈ వ్యాఖ్య చేయడానికి తడబడినా.. కౌంటర్ ఎలా ఉంటుందో అని అనుకున్నా.. తర్వాత కాలంలో వైసీపీ పై విమర్శలు చేయడానికి, విరుచుకుపడడానికి కూడా కూటమి నాయకులకు `సైకో` పదం బ్రహ్మాస్త్రంగా పనిచేసింది. ఇది ఎంత వరకు వెళ్లిందంటే.. వైసీపీ ప్రభుత్వ బాధితులే కాదు.. కాలేజీ విద్యార్థులు సైతం.. సైకో నినాదాలతో ఒక దశలో విజృంభించారు.
ఆ తర్వాత.. బీజేపీ నాయకురాలు.. ప్రస్తుత ఎంపీ.. పురందేశ్వరి జగన్ సర్కారు చేసిన అప్పులపై.. చేసిన ప్రకటన కూడా.. గత ఎన్నికల వరకు పెద్ద ఎత్తున మార్మోగింది. “జగన్.. 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారం“టూ.. రాజమండ్రిలో మీడియా ముందు ఆమె చేసిన వ్యాఖ్య.. తర్వాత కాలంలో టీడీపీ అంది పుచ్చుకుంది. ఎన్నికల సమయంలో పెద్ద ఎత్తున దీనిపై చర్చ జరిగింది. ఇది కూడా జగన్ పతనానికి దారి తీసేలా చేసింది.
ఇలా.. పలు సందర్భాల్లో ఆయా పార్టీల నాయకులు చేసిన కామెంట్లు.. తర్వాత కాలంలో ఎన్నికల నినాదాలుగా మారాయి. అవి వైసీపీని తీవ్రంగా ఇరుకున పడేశాయి. ఇప్పుడు పయ్యావుల చేసిన “రాష్ట్రానికి వైసీపీ హానికరం“ నినాదం కూడా అదే రేంజ్లో వైసీపీపై ప్రభావం చూపించడం ఖాయమన్న చర్చ నడుస్తోంది.
దేశంలో ఇటీవలే లోక్ సభ, అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపునకు సంబందించి ఓ రేంజిలో రచ్చ జరిగిన సంగతి తెలిసిందే.…
రెడ్ బుక్ మూసేయలేదని.. అది ఇంకా తెరిచే ఉందని మంత్రి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రెడ్ బుక్లో…
ఈ ఏడాది ‘దురంధర్-2’ సినిమాతో బాలీవుడ్ బాక్సాఫీస్ బాగానే కళకళలాడినప్పటికీ.. ఓవరాల్ సక్సెస్ రేట్ ఏమీ అంత గొప్పగా లేదు.…
తమరిది అన్నదమ్ముల అనుబంధం అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి మంత్రి నారా లోకేష్ పలుమార్లు వ్యాఖ్యానించారు.…
రాష్ట్రంలో బౌలర్స్(ప్రత్యర్థులు) మారినా బ్యాట్స్మెన్ మాత్రం చంద్రబాబు నాయుడేనని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. తిరుపతిలో జరిగిన ప్రభుత్వ వియోజత్సవ…
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ తో పాటు గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ కు…