Political News

`మేకిన్` ఇండియా అడిగితే.. `లీకిన్` ఇండియా ఇచ్చారు

కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారుపై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ త‌న‌దైన శైలిలో సెటైర్లు వేశారు. దేశ ప్ర‌జ‌లు మేకిన్ ఇండియా కావాల‌ని కోరుకుంటే.. మోడీ మాత్రం లీకిన్‌ ఇండియాను ఇచ్చార‌ని వ్యాఖ్యానించారు. గ‌త 25 రోజులుగా ఢిల్లీలో పోరాటం చేస్తున్న విద్యార్థుల‌కు తాము ఆది నుంచి అండ‌గా ఉన్నామ‌ని.. కానీ, కొంద‌రు ఈ విష‌యాన్ని గ‌మ‌నించ‌లేక త‌మ‌పై నింద‌లు వేస్తున్నార‌ని.. ప‌రోక్షంగా సీఎం రేవంత్ పై విమ‌ర్శ‌లు గుప్పించారు. తాము మొద‌టి నుంచి విద్యార్థుల‌కు అనుకూల‌మ‌ని వ్యాఖ్యానించారు.

తెలంగాణ ఉద్య‌మంలో విద్యార్థులు, విద్యార్థి సంఘాల పాత్ర ఎంత ఉందో ఇప్పుడున్న నాయ‌కుల‌కు ఏం(సీఎం) తెలుసున‌ని కేటీఆర్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ సైతం అనేక ఉద్య‌మాల్లో పాల్గొన్నార‌ని తెలిపారు. కేంద్రంపై పోరాటంలో త‌మకు ఎవ‌రూ సుద్దులు చెప్పాల్సిన అవ‌స‌రం లేద‌ని వ్యాఖ్యానించారు. 25 రోజులుగా విద్యార్థులు ఉద్య‌మిస్తే.. కాంగ్రెస్ పార్టీ త‌న స్వార్థ‌రాజ‌కీయాల కోసం.. ఇప్పుడు వేలు పెట్టింద‌న్న కేటీఆర్‌.. దీనిని రాజకీయం చేసేందుకు ప్ర‌య‌త్నిస్తోంద‌ని దుయ్య‌బ‌ట్టారు.

ఇందిరాపార్క్‌లో విద్యార్థులు చేప‌ట్టిన నిర‌స‌న‌కు కేటీఆర్ హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న అటు కేంద్రం, ఇటు రాష్ట్ర స‌ర్కారుల‌పై నిప్పులు చెరిగారు. ప్ర‌ధాని మోడీ.. ఎవ‌రితో పెట్టుకోకూడ‌దో వారితోనే పెట్టుకుంద‌న్నారు. ప్ర‌స్తుతం జ‌న‌రేష‌న్.. మ‌ర‌ణానికి సైతం తెగించే స‌త్తా ఉన్న జ‌న‌రేష‌న్ అని తెలిపారు. యువ‌త జ‌వాబు దారీ త‌నం కోసం ఉద్య‌మిస్తోంద‌న్నారు. కానీ, అదే యువ‌త‌ను చావ‌గొట్టి.. వారిపై కేసులు పెట్టించార‌ని వ్యాఖ్యానించారు. విద్యార్థుల‌కు జ‌రిగే అన్యాయం ఇక్క‌డున్న‌బీజేపీ నాయ‌కుల‌కు క‌నిపించ‌డం లేద‌ని అన్నారు.

నిరూపించి ఉరేయండి!

పేప‌ర్ లీకేజీకి.. త‌న‌కు సంబంధం ఉంద‌ని కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు చేస్తున్న ప్ర‌చారాన్ని కేటీఆర్ ఖండించారు. అస‌లు పేప‌ర్ లీకేజీకి.. త‌న‌కు ఏం సంబంధ‌మ‌ని ప్ర‌శ్నించారు. ఒక వేళ అదే నిజ‌మైతే.. దానిని నిరూపించి..త‌న‌ను ఇక్క‌డే(ఇందిరాపార్కు) ఉరేయాల‌ని ఆయ‌న స‌వాల్‌రువ్వారు. నోటికి వ‌స్తే.. అది మాట్లాడ‌డం ఎవ‌రికీ మంచిది కాదన్న కేటీఆర్‌.. కేసీఆర్‌పై ప‌దే ప‌దే విమ‌ర్శ‌లు చేయ‌డం మానుకోవాల‌ని సూచించారు. సీఎంను నిద్ర‌లో లేపి అడిగినా.. కేసీఆర్ కేసీఆర్ అని అంటున్న‌రంట‌. ఇంకేం చెప్తాం. కేసీఆర్ అంటే అంత భ‌యం ఎందుకో!. అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఢిల్లీలో పోలీసులుచేసిన దారుణ ఘ‌ట‌న‌ను బీఆర్ ఎస్ ఖండిస్తోంద‌ని చెప్పారు.

This post was last modified on July 24, 2026 3:04 pm

Share

Recent Posts

మ‌న్యానికి కుంకీల‌ను పంపిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌

పార్వ‌తీపురం మ‌న్యం జిల్లాలోని రైతులు గ‌త కొన్ని రోజులుగా ఏనుగుల బెడ‌ద‌ను ఎదుర్కొంటున్నారు. స్థానిక గ్రామాల్లోకి ఏనుగులు చొర‌బ‌డి ప్ర‌జ‌ల‌ను…

44 minutes ago

స్థానికంపై జగన్ సీరియస్ గానే ఉన్నారా?

ఏపీలో సార్వత్రిక ఎన్నికల తర్వాత మరో కీలక ఎన్నికలకు తెర లేవనుంది. రాష్ట్రంలోని స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించే దిశగా కూటమి సర్కారు ప్రణాళికలు…

2 hours ago

ముగ్గురు యువతుల ముద్దుల వరుడు

ఇద్దరు భార్యల ముద్దుల మొగుడు.. ఈ కాన్సెప్ట్ తో తెలుగులో ఎన్నో సినిమాలు వచ్చాయి. వినడానికి, చూడడానికి సరదాగానే ఉంటుంది.…

3 hours ago

రామ రామా… ఇంకెన్ని బ్రేకులు స్వామీ

నాలుగు వేల కోట్లతో తీశామని గొప్పగా చెప్పుకున్న ప్యాన్ ఇండియా మూవీ రామాయణ ప్రమోషన్ల పరంగా వేస్తున్న అడుగులు ఎటెటో…

3 hours ago

తెలుగు అమ్మాయి అదరగొట్టేసింది

అందం, అభినయం రెండూ ఉన్నా చాలా మంది తెలుగమ్మాయిలకు సినిమా అవకాశాలు రాక, తమ టాలెంట్ నిరూపించుకోలేక పక్క భాషలకు…

5 hours ago

విశ్వనాథ్ భాష లాజిక్ సరైనదేనా

వీరభద్రుడు / కరుప్పు బ్లాక్ బస్టర్ హిట్టుతో తిరిగి ట్రాక్ లోకి వచ్చిన హీరో సూర్య తక్కువ గ్యాప్ లోనే…

5 hours ago