Political News

ఈసారి డీఎస్సీలో వారిపైనే ప్రత్యేక దృష్టి?

ఏపీలో ఉపాధ్యాయ ఉద్యోగార్ధులకు మంత్రి నారా లోకేష్ గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే మరో డీఎస్సీ వేస్తామని ప్రకటించారు. దీంతో అభ్యర్థులలో హర్షం వ్యక్తం అవుతోంది.

కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపు 16 వేల పోస్టులతో మెగా డీఎస్సీని ప్రకటించారు. అతి తక్కువ సమయంలోనే కోర్టు కేసులను అధిగమించి ఆ ప్రక్రియను పూర్తి చేశారు. గత డీఎస్సీ ఒక రికార్డును నెలకొల్పింది. ఆ తర్వాత ఏటా డీఎస్సీ వేస్తామని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ఇచ్చిన హామీ మేరకు ఈ ఏడాది కూడా డీఎస్సీ ప్రక్రియ ప్రారంభించి టెట్ నిర్వహించారు. 

ఈరోజు అసెంబ్లీలో అడిగిన ఒక ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ గత ఏడాది జరిగిన డీఎస్సీలో కూడా కర్నూలు జిల్లాకు ఎక్కువ ఉపాధ్యాయ పోస్టులు మంజూరు చేశాం అన్నారు. అయినా ఇప్పటికీ టీచర్ – స్టూడెంట్ రేషియో అక్కడ తక్కువగా ఉందన్నారు.

త్వరలో మరో డీఎస్సీ ప్రకటించబోతున్నట్లు వెల్లడించారు. అందులో కర్నూలు పార్లమెంటుపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తాం అన్నారు. దీన్నిబట్టి ఈసారి కర్నూలు అభ్యర్థులపై కూటమి ప్రభుత్వం దృష్టి సాధిస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ ఏడాది ఉగాదికి మరో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. దాదాపు 3600 డీఎస్సీ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పాత సిలబస్ ప్రకారమే అంటే గతేడాది డీఎస్సీకి ఇచ్చిన సిలబస్, మార్గదర్శకాలనే ఈసారీ అమలు చేయనున్నట్లు సమాచారం.

This post was last modified on February 19, 2026 2:28 pm

Share
Show comments
Published by
Kumar
Tags: dscLokesh

Recent Posts

పోలీసు కేసు కూడా విష్ణుప్రియకి ప్లస్సే

బిగ్ బాస్‌తో పాటు అనేక టీవీ షోల ద్వారా పాపుర‌ల్ అయిన అమ్మాయి.. విష్ణుప్రియ భీమ‌నేని. ఈ పాపులారిటీతోనే ఇన్‌స్టాగ్రామ్‌లో…

5 minutes ago

అంతమంది హిట్టర్లు ఉన్నా… ఇదేం ఆట?

ఐపీఎల్ 2026లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా జరిగిన…

3 hours ago

‘గుడ్’ ప్రమోషన్లు చేసుకోవాలి ‘కార్తీక్’

టైటిల్ లో బ్యాడ్ అని పెట్టుకున్నారు కానీ దానికి తగ్గట్టే ప్రమోషన్లలో బాగా వెనుకబడిపోయింది బ్యాడ్ బాయ్ కార్తీక్. శుక్రవారం…

3 hours ago

ప్రతాప్ కష్టం చూస్తే పాపం అనాల్సిందే

ఈ శుక్రవారం అన్నీ చిన్న సినిమాలే విడుదల కాబోతున్నాయి. వాటిలో పాపం ప్రతాప్ ఒకటి. తిరువీర్ హీరోగా నటించిన ఈ…

4 hours ago

క్వాంటం కంప్యూటింగ్‌లో మనదే తొలి అడుగు

అమ‌రావ‌తిలో ఏర్పాటు చేయ‌నున్న క్వాంటం కంప్యూటింగ్‌లో తొలి అడుగు విజ‌య‌వంతంగా ప‌డింద‌ని సీఎం చంద్ర‌బాబు అన్నారు. రాజ‌ధాని అమరావతిలోని ఎస్‌ఆర్‌ఎం…

5 hours ago

ఏ కాలంలో ఉన్నారు ధావన్ సాబ్

హీరో వరుణ్ ధావన్ కు అంతో ఇంతో చెప్పుకోదగ్గ ఇమేజ్ ఉంది. అందుకే దర్శకుడు అట్లీ  నిర్మాతగా మారి ఏరికోరి…

5 hours ago