Political News

ర్యాలీ పేరుతో అంబటి హడావిడి

రాజమండ్రి జైలు నుంచి 18 రోజుల రిమాండ్ అనంతరం విడుదలైన మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరుకు ర్యాలీగా బయలుదేరగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాజమండ్రి నుంచి ఆయన వాహనం కదిలిన వెంటనే మిగతా వాహనాలను పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ హైడ్రామా చోటుచేసుకుంది. మూడుకంటే ఎక్కువ వాహనాలు ఉండకూడదని పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఆందోళనకు దిగిన జక్కంపూడి రాజా సహా వైఎస్ఆర్సిపి నేతలు పోలీసుల తీరును ప్రశ్నించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అంబటి రాంబాబు వాహనం దిగి వెనక్కి వచ్చారు. అనంతరం పోలీసులు వాహనాలను క్లియర్ చేశారు.

ఈ సందర్భంగా అంబటి రాంబాబు పోలీసుల తీరును తీవ్రంగా దుయ్యబట్టారు. రాష్ట్రంలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. 18 రోజుల రిమాండ్ అనంతరం శాంతియుతంగా వెళ్తున్న వారిపై ఇలాంటి చర్యలు సరికాదని విమర్శించారు. ప్రజలంతా గమనిస్తున్నారని, ఇంతకన్నా తమను ఏమి ఇబ్బంది పెట్టగలరని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వ తీరు దారుణమని ఆరోపించారు.

“నేను ర్యాలీగా వెళ్తే సెక్షన్ 30 వర్తిస్తుందా? నా ఇంటిని పగలగొట్టినప్పుడు సెక్షన్ 30 ఎక్కడుంది? ఆ రోజున నిబంధనలు ఏమయ్యాయి?” అంటూ ప్రశ్నించారు. రాజమండ్రి జైలు నుంచి పలువురు నేతలు ర్యాలీగా వెళ్లలేదా అని నిలదీశారు. అనుమతిస్తే కారులో వెళ్తానని, లేదంటే పాదయాత్రగా వెళ్తానని ప్రకటించారు. కొంతదూరం ఆగ్రహంతో నడుచుకుంటూ వెళ్లారు.

గుంటూరులో సెక్షన్ 30 అమలులో ఉన్న నేపథ్యంలో ర్యాలీగా రావొద్దని పోలీసుల నుంచి నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. ర్యాలీలకు అనుమతి లేదని స్పష్టం చేసిన పోలీసులు, అంబటి రాంబాబు వెంట భారీగా భద్రతా బలగాలను మోహరించారు. ఘటనతో రాజమండ్రిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

This post was last modified on February 19, 2026 10:54 am

Share

Recent Posts

నానీనే స‌వాల్ చేస్తున్న చిన్న హీరో

సంక్రాంతి, ద‌స‌రా లాంటి పెద్ద పండుగ‌ల‌ను ప‌క్క‌న పెడితే.. ఒక పెద్ద సినిమా రిలీజ‌వుతున్న‌పుడు చిన్న సినిమాలు పోటీలో ఉండ‌డం…

1 hour ago

ఆ భూములన్నీ తన కష్టార్జితమే అన్న కవిత!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తాజాగా బుధవారం సాయంత్రం అసెంబ్లీలో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబానికి చెందినవారు, ఆయన పార్టీకి…

2 hours ago

ఇక్కడ అమ్మాయి సుప్రియకు అదిరిపోయే పదవి!

ఇటీవల సినీ ప్రముఖులకు, వారి కుటుంబ సభ్యులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పదవులు కట్టబెట్టి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.…

3 hours ago

సంబరాలు అంత సాహసం చేస్తుందా

సంక్రాంతి పండక్కు వస్తామని జనవరి 12 డేట్ వేసుకున్న సాయి దుర్గ తేజ్ సంబరాల ఏటిగట్టు ఆ తర్వాత పూర్తిగా…

3 hours ago

కేసీఆర్ ఫ్యామిలీ భూముల లెక్క చూస్తే షాకే!

బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ పై ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. 22ఏ భూములపై…

3 hours ago

ఇలాంటి కొడుకులు కూడా ఉంటారు..

మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే అని చరిత్రలో ఎన్నో ఘటనలు రుజువు చేశాయి. కాసుల కంటే కని పెంచిన తలిదండ్రులు…

4 hours ago