ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్.. గత ఆదివారం కొలంబోకు వెళ్లి ఇండియా, పాకిస్థాన్ మధ్య టీ20 ప్రపంచకప్ మ్యాచ్ను వీక్షించడం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. లోకేష్ క్రికెట్ లవర్ అని ముందు నుంచి తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలోనే ఆయన ఈ మ్యాచ్ చూడడానికి వెళ్లారు.
ఐతే దీని మీద ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెద్ద రాద్దాంతం చేస్తోంది. ప్రభుత్వ ఖర్చులతో లోకేష్ కొలంబోకు వెళ్లాడని.. రాష్ట్రం అప్పుల ఊబిలో చిక్కుకుని అల్లాడుతుంటే.. లోకేష్ మ్యాచ్ చూడడం కోసం కోటి రూపాయలు ఖర్చు చేశారని ఎక్స్లో పోస్టు పెట్టింది వైసీపీ. కానీ ఏ ఆధారాలు లేకుండా ఈ ట్వీట్ వేశారని.. కాసేపటికే తేలిపోయింది. ప్రభుత్వం తరఫున ఫ్యాక్ట్ చెక్ హ్యాండిల్.. అసలు విషయాన్ని వెల్లడించింది.
లోకేష్ పూర్తిగా సొంత డబ్బులతో ఈ మ్యాచ్ కోసం వెళ్లారని.. ప్రభుత్వ నిధులు ఖర్చు చేయలేదని స్పష్టం చేసింది.
ఈ వ్యవహారం మీద నారా లోకేష్ సైతం తాజాగా స్పందించాడు.
‘‘ఫ్లైట్ టికెట్టూ నాదే! మ్యాచ్ టికెట్టూ నాదే! నా దుడ్లతో నేను మ్యాచ్ చూస్తిని.. నీ దుడ్లు ఏమైనా ఖర్చు చేస్తినా @ysjagan ? #PsychoFekuJagan’’ అంటూ ట్వీట్ వేశాడు లోకేష్. ‘పుష్ప’లో ‘‘ఈ కాలూ నాదే’’.. అంటూ అల్లు అర్జున్ చెప్పే డైలాగును గుర్తు చేసేలా లోకేష్ ట్వీట్ వేయడంతో.. జగన్ అండ్ కోకు మాస్ రిప్లై ఇచ్చాడంటూ టీడీపీ శ్రేణులు తమ నాయకుడిని కొనియాడుతున్నారు.
కనీసం వెరిఫై చేయకుండా ఇలాంటి పోస్టు పెట్టిన సాక్షి, వైసీపీ సోషల్ మీడియా.. ఇది అబద్ధం అని క్లారిటీ ఇచ్చాక కూడా ఆ ట్వీట్ను డెలీట్ చేయకపోవడం గమనార్హం. వైసీపీ తీరే అంత.. ఫేక్ వార్తలు ప్రచారం చేయడం, అది నిజం కాదని తేలాక కూడా స్పందించకుండా అలాగే ఉండిపోవడం వారికి అలవాటే అంటూ టీడీపీ వాళ్లు దుయ్యబడుతున్నారు.
This post was last modified on February 18, 2026 2:21 pm
జెనీలియా డిసౌజా.. ఈ పేరెత్తగానే తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడూ నవ్వుతూ కనిపించే అమ్మాయి గుర్తుకు వస్తుంది. ‘బొమ్మరిల్లు’లో హహ హాసిని…
తెలుగు రాష్ట్రాల మధ్య విభజన వ్యాఖ్యలపై మరోసారి చర్చ మొదలైంది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా…
ప్రధాని నరేంద్ర మోదీ స్కిన్ టోన్పై సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో చిత్రీకరించిన వీడియోల్లో ఆయన…
మొన్న శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీకి ప్రమోషన్లయితే ఘనంగా జరిగాయి. ఈవెంట్లు, ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు అన్నీ చేశారు. నిర్మాత…
అనుకున్నంతా అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ ఈ ఏడాది రావడం లేదు.…
గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘మహావతార నరసింహా’నే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన…