ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్.. గత ఆదివారం కొలంబోకు వెళ్లి ఇండియా, పాకిస్థాన్ మధ్య టీ20 ప్రపంచకప్ మ్యాచ్ను వీక్షించడం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. లోకేష్ క్రికెట్ లవర్ అని ముందు నుంచి తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలోనే ఆయన ఈ మ్యాచ్ చూడడానికి వెళ్లారు.
ఐతే దీని మీద ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెద్ద రాద్దాంతం చేస్తోంది. ప్రభుత్వ ఖర్చులతో లోకేష్ కొలంబోకు వెళ్లాడని.. రాష్ట్రం అప్పుల ఊబిలో చిక్కుకుని అల్లాడుతుంటే.. లోకేష్ మ్యాచ్ చూడడం కోసం కోటి రూపాయలు ఖర్చు చేశారని ఎక్స్లో పోస్టు పెట్టింది వైసీపీ. కానీ ఏ ఆధారాలు లేకుండా ఈ ట్వీట్ వేశారని.. కాసేపటికే తేలిపోయింది. ప్రభుత్వం తరఫున ఫ్యాక్ట్ చెక్ హ్యాండిల్.. అసలు విషయాన్ని వెల్లడించింది.
లోకేష్ పూర్తిగా సొంత డబ్బులతో ఈ మ్యాచ్ కోసం వెళ్లారని.. ప్రభుత్వ నిధులు ఖర్చు చేయలేదని స్పష్టం చేసింది.
ఈ వ్యవహారం మీద నారా లోకేష్ సైతం తాజాగా స్పందించాడు.
‘‘ఫ్లైట్ టికెట్టూ నాదే! మ్యాచ్ టికెట్టూ నాదే! నా దుడ్లతో నేను మ్యాచ్ చూస్తిని.. నీ దుడ్లు ఏమైనా ఖర్చు చేస్తినా @ysjagan ? #PsychoFekuJagan’’ అంటూ ట్వీట్ వేశాడు లోకేష్. ‘పుష్ప’లో ‘‘ఈ కాలూ నాదే’’.. అంటూ అల్లు అర్జున్ చెప్పే డైలాగును గుర్తు చేసేలా లోకేష్ ట్వీట్ వేయడంతో.. జగన్ అండ్ కోకు మాస్ రిప్లై ఇచ్చాడంటూ టీడీపీ శ్రేణులు తమ నాయకుడిని కొనియాడుతున్నారు.
కనీసం వెరిఫై చేయకుండా ఇలాంటి పోస్టు పెట్టిన సాక్షి, వైసీపీ సోషల్ మీడియా.. ఇది అబద్ధం అని క్లారిటీ ఇచ్చాక కూడా ఆ ట్వీట్ను డెలీట్ చేయకపోవడం గమనార్హం. వైసీపీ తీరే అంత.. ఫేక్ వార్తలు ప్రచారం చేయడం, అది నిజం కాదని తేలాక కూడా స్పందించకుండా అలాగే ఉండిపోవడం వారికి అలవాటే అంటూ టీడీపీ వాళ్లు దుయ్యబడుతున్నారు.
This post was last modified on February 18, 2026 2:21 pm
బీఆర్ ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టు నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు మరో సారి నిప్పు రాజుకున్నాయి.…
ఎట్టకేలకు మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.అంబటి రాంబాబుపై ఉన్న అన్ని కేసుల్లోనూ ఆయనకు…
ఒకప్పుడు నిర్మాతలకు విపరీతమైన గౌరవం ఉండేది. పరిశ్రమను పోషించేది వాళ్లే కాబట్టి హీరో హీరోయిన్ దగ్గర నుంచి సాంకేతిక నిపుణులు,…
తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్లో ఒక వింత సంఘటన స్థానికులను, ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేసింది. బుర్ఖా వేసుకుని మహిళల…
తాజాగా రాజ్యసభలో ఖాళీ అవుతున్న 37 స్థానాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు రెడీ అయింది. దీనికి…
ఢిల్లీలో జరుగుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సమ్మిట్లో గల్గోటియాస్ యూనివర్సిటీ ప్రదర్శించిన ఒక రోబో డాగ్ ఇప్పుడు పెద్ద వివాదానికి…