ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్.. గత ఆదివారం కొలంబోకు వెళ్లి ఇండియా, పాకిస్థాన్ మధ్య టీ20 ప్రపంచకప్ మ్యాచ్ను వీక్షించడం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. లోకేష్ క్రికెట్ లవర్ అని ముందు నుంచి తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలోనే ఆయన ఈ మ్యాచ్ చూడడానికి వెళ్లారు.
ఐతే దీని మీద ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెద్ద రాద్దాంతం చేస్తోంది. ప్రభుత్వ ఖర్చులతో లోకేష్ కొలంబోకు వెళ్లాడని.. రాష్ట్రం అప్పుల ఊబిలో చిక్కుకుని అల్లాడుతుంటే.. లోకేష్ మ్యాచ్ చూడడం కోసం కోటి రూపాయలు ఖర్చు చేశారని ఎక్స్లో పోస్టు పెట్టింది వైసీపీ. కానీ ఏ ఆధారాలు లేకుండా ఈ ట్వీట్ వేశారని.. కాసేపటికే తేలిపోయింది. ప్రభుత్వం తరఫున ఫ్యాక్ట్ చెక్ హ్యాండిల్.. అసలు విషయాన్ని వెల్లడించింది.
లోకేష్ పూర్తిగా సొంత డబ్బులతో ఈ మ్యాచ్ కోసం వెళ్లారని.. ప్రభుత్వ నిధులు ఖర్చు చేయలేదని స్పష్టం చేసింది.
ఈ వ్యవహారం మీద నారా లోకేష్ సైతం తాజాగా స్పందించాడు.
‘‘ఫ్లైట్ టికెట్టూ నాదే! మ్యాచ్ టికెట్టూ నాదే! నా దుడ్లతో నేను మ్యాచ్ చూస్తిని.. నీ దుడ్లు ఏమైనా ఖర్చు చేస్తినా @ysjagan ? #PsychoFekuJagan’’ అంటూ ట్వీట్ వేశాడు లోకేష్. ‘పుష్ప’లో ‘‘ఈ కాలూ నాదే’’.. అంటూ అల్లు అర్జున్ చెప్పే డైలాగును గుర్తు చేసేలా లోకేష్ ట్వీట్ వేయడంతో.. జగన్ అండ్ కోకు మాస్ రిప్లై ఇచ్చాడంటూ టీడీపీ శ్రేణులు తమ నాయకుడిని కొనియాడుతున్నారు.
కనీసం వెరిఫై చేయకుండా ఇలాంటి పోస్టు పెట్టిన సాక్షి, వైసీపీ సోషల్ మీడియా.. ఇది అబద్ధం అని క్లారిటీ ఇచ్చాక కూడా ఆ ట్వీట్ను డెలీట్ చేయకపోవడం గమనార్హం. వైసీపీ తీరే అంత.. ఫేక్ వార్తలు ప్రచారం చేయడం, అది నిజం కాదని తేలాక కూడా స్పందించకుండా అలాగే ఉండిపోవడం వారికి అలవాటే అంటూ టీడీపీ వాళ్లు దుయ్యబడుతున్నారు.
This post was last modified on February 18, 2026 2:21 pm
సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…
ఇప్పటికే పైరసీని ఎలా అణచాలో అర్థం కాక నిర్మాతలు తలలు పట్టుకోవడం చూస్తున్నాం. టెక్నాలజీ ఇంత అభివుద్ది చెందిన తర్వాత…
కరుప్పు / వీరభద్రుడు, విశ్వనాథ్ అండ్ సన్స్ విజయాలతో సూర్య మంచి ఊపు మీద ఉన్నాడు. గత కొన్నేళ్లుగా సరైన…
ఫ్యాన్ బేసులకు అతీతంగా అందరు హీరోల అభిమానులు అధిక శాతం ఇష్టపడే హీరో రవితేజ. ఆరు పదుల వయసుకు దగ్గరగా…
స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యకర్తలు, నాయకులకు కీలక…
తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు, భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక…