రాజకీయాల్లో ముక్కుసూటితనం పనికిరాదు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టవలసిందే. ఈ విషయం ప్రస్తుతం ఉప సభాపతిగా ఉన్న రఘురామకృష్ణరాజుకు తెలియదని అనుకునే పరిస్థితి లేదు. రాజకీయంగా ఆయనకు పదేళ్ల అనుభవమే ఉన్నా.. డక్కాముక్కీలు తిన్న నాయకుడిగా ఆయన పేరు తెచ్చుకున్నారు. వైసీపీ హయాం నుంచి ప్రస్తుత ఉండి ఎమ్మెల్యే వరకు ఆయన అనేక రూపాల్లో రాజకీయాలు చూస్తున్నారు.
ప్రస్తుతం ఉండి నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్న రఘురామ కొందరికే పరిమితం అవుతున్నారన్నది.. ఆయనకు నచ్చకపోయినా వాస్తవమేనని అంటున్నారు టీడీపీ నాయకులు. అందరినీ కలుపుకొని పోయే క్రమంలో ఆయన విఫలమవుతున్నారని చెబుతున్నారు. ఇది సరికాదని అంటున్నారు. సాధారణంగా అన్ని నియోజకవర్గాల్లో ఉన్నట్టుగానే ఉండిలోనూ రాజకీయ విభేదాలు ఉన్నాయి. కానీ వీటిని పెరగకుండా చూసుకునే బాధ్యత ఎమ్మెల్యేగా ఆయనపైనే ఉంటుంది.
కొందరిని మాత్రమే చేరదీసి.. మరికొందరు అసలు తనకు ఏమీ కారన్న ధోరణిని ప్రదర్శిస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. గత ఏడాది కాలంగా అసంతృప్తులు పెరుగుతున్నాయి. తొలినాళ్లలో వీటిని ఖండించినప్పటికీ.. తనపై ఓ వర్గం నాయకులు ఎగస్పార్టీగా మారారంటూ చెప్పినప్పటికీ.. తర్వాత పరిణామాల్లో ఈ లెక్కలు పెరుగుతున్న తీరు రఘురామకు ఇబ్బందికర పరిణామంగానే మారింది. క్షత్రియ సామాజిక వర్గంలోనే ఆయనకు కొంత మేరకు వ్యతిరేకత ఉంది.
దీనిని తగ్గించుకోవాల్సిన అవసరం ఉందని ఎవరైనా చెబుతున్నా.. వారిని కూడా ఆయన ఎగస్పార్టీ ఖాతాలో వేసేస్తున్నారు. మీరు నాకు చెప్పేంతవారా? అని అంటే ఎవరూ చెప్పరు. కానీ ఎంతో అనుభవం ఉన్న నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు సైతం తన విధానాలు తప్పు అని సన్నిహితులు చెబితే మార్చుకునే ప్రయత్నం చేస్తారు. ఈ తరహా ధోరణే ఆయనను అందరివాడిగా నిలుపుతోంది. ఈ విషయాన్ని రఘురామ కూడా గ్రహించాలి. ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు అందరినీ కలుపుకొని పోకపోతే ఇబ్బందులు చెప్పిరావు కదా!?
This post was last modified on February 18, 2026 11:41 am
రేపు విడుదల కాబోతున్న టాక్సిక్ మీద అభిమానుల అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఆశ్చర్యకరంగా హిందీ వెర్షన్ అమ్మకాలు…
మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టుతో లిక్కర్ కుంభకోణం మళ్ళీ తెరపైకి వచ్చింది. వైసీపీ ప్రభుత్వంలో నాశిరకం మద్యం వ్యాపారాన్ని…
``కాంగ్రెస్ పార్టీలో నేనైనా ఆమె అయినా ఒక్కటే. పార్టీ క్రమశిక్షణ విషయంలో అందరూ సమానమే. ఎవరు ఏం చేశారన్నది పార్టీ…
ఒక పార్టీలో ఇబ్బందులు రావొచ్చు.. నాయకులు అసంతృప్తి వ్యక్తం చేయొచ్చు. కానీ.. అడుగు పెట్టిన ప్రతిపార్టీలోనూ ఇబ్బందులు వస్తే.. ప్రతిపార్టీపైనా…
‘ఎల్లమ్మ’ గురించి ఇప్పటివరకు ఎక్కువగా మాట్లాడుకున్నది వేణు యెల్దండి కథ, గ్రామీణ నేపథ్యం, డీఎస్పీ లుక్ గురించే. ‘బలగం’ తర్వాత…
వారం రోజుల క్రితం తిరుపతిలో వెంకటేశ్వర స్వామి సాక్షిగా రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…