Political News

‘వేలిముద్రగాళ్లు కూడా సీఎం అవుతారు’

మాజీ మంత్రి కొండా సురేఖ కొన్ని సందర్భాల్లో తన వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ హీరోయిన్ సమంత, హీరో అక్కినేని నాగార్జున, మాజీ మంత్రి కేటీఆర్ లపై సురేఖ చేసిన కామెంట్లు గతంలో కాక రేపిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆ కామెంట్లపై ఆమె పశ్చాత్తాపం వ్యక్తం చేయడంతో నాగార్జున కేసు వెనక్కి తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఈసారి సురేఖ రాజకీయ నాయకుల గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.

రాజకీయాల్లో వేలిముద్రగాళ్లు కూడా సీఎం అవుతారని, అయినా సరే నేతలు చెప్పినట్లు ఐఏఎస్, ఐఎఫ్ఎస్ వినాల్సిందేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్‌లో ఏర్పాటు చేసిన 10వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న సందర్భంగా కొండా సురేఖ ఈ కామెంట్స్ చేశారు. ఎంతో కష్టపడితేనే ఐఏఎస్‌, ఐపీఎస్‌లు అవుతారని, అయినా చివరికి వారు రాజకీయ నాయకుల ముందు నిల్చొని నాయకులు చెప్పింది వినాల్సివస్తుందని అన్నారు.

అయితే, అలా రాజ్యాంగంలో రాసి ఉందని, దానికి మనం ఏమీ చేయలేమని కూడా అన్నారు. పైగా, దీనిని విమర్శగా తీసుకోవద్దని, వివాదం చేయొద్దని కూడా చెప్పారు. ఇది తన మనసులో అభిప్రాయం మాత్రమేనని అన్నారు.

చదువు రాకున్నా, సబ్జెక్ట్ తెలియపోయినా…అధికారులను తాము తిడుతుంటామని వ్యాఖ్యానించారు. అయితే, రూల్స్ ఒప్పుకోని సందర్భంగా అధికారులు కొందరు ఆ పని చేయరని, వారి గురించి తాను మాట్లాడడం లేదని, వారి పని వారిని చేసుకోనివ్వాలని తెలిపారు.

కానీ, రూల్స్ ఒప్పుకున్నా సరే కొందరు తలబిరుసు అధికారులు పనిచేయరని, వారిని అన్నా తప్పులేదని చెప్పారు. ఏది ఏమైనా…అది కొండా సురేఖ మనసులోమాట అయినా…ఆ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Kumar

Recent Posts

దేవర 2 ఆశలు వదులుకోక తప్పదా

జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎదురు చూస్తున్న అప్డేట్ దేవర 2. మొదటి భాగం వచ్చి రెండేళ్లు దాటిపోతున్నా ఇప్పటికీ సీక్వెల్…

1 hour ago

వీరభద్రుడిని వాయించేస్తున్నారు

కొన్ని సినిమాలకు బాక్సాఫీస్ దగ్గర పరిస్థితులు కలిసొచ్చి యావరేజ్ కంటెంట్‌తోనే ఇరగాడేస్తుంటాయి. రివ్యూలు, టాక్ అంతంతమాత్రంగా ఉన్నా సరే.. సినిమాకు…

2 hours ago

సర్వం సమంత మయం… బంగారం ప్రచారం

జూన్ 19 విడుదల కాబోతున్న మా ఇంటి బంగారం కౌంట్ డౌన్ మొదలైపోయింది. కేవలం నాలుగు రోజుల సమయం మాత్రమే…

2 hours ago

హిమాలయాలకు వెళ్లిపోవాలనుకున్న హీరోయిన్

కథానాయికగా పరిచయం అయింది తమిళంలోనే అయినా.. తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేసి గుర్తింపు సంపాదించింది నివేథా పెతురాజ్. మెంటల్ మదిలో,…

2 hours ago

ట్రంప్ మాత్రమే కాదు ఇరాన్ కూడా చెప్పింది యుద్ధం ముగిసిందని!

ఒకప్పుడు అమెరికా అధ్యక్షుడు హోదాలో ఉన్న వ్యక్తి నోటి నుంచి ఒక మాట వస్తే.. అదో నిజమన్నట్లుగా ఉండేది. అలాంటి…

2 hours ago

కాక్రోచ్ పార్టీపై పవన్ ఫస్ట్ రియాక్షన్

ఢిల్లీలో 'జాతీయ సమగ్రత కోసం సేన ప్రస్థానం' పేరుతో 3 రోజుల పాటు సభలను నిర్వహించాలని జనసేన నిర్ణయించిన సంగతి…

2 hours ago