మాజీ మంత్రి కొండా సురేఖ కొన్ని సందర్భాల్లో తన వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ హీరోయిన్ సమంత, హీరో అక్కినేని నాగార్జున, మాజీ మంత్రి కేటీఆర్ లపై సురేఖ చేసిన కామెంట్లు గతంలో కాక రేపిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆ కామెంట్లపై ఆమె పశ్చాత్తాపం వ్యక్తం చేయడంతో నాగార్జున కేసు వెనక్కి తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఈసారి సురేఖ రాజకీయ నాయకుల గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.
రాజకీయాల్లో వేలిముద్రగాళ్లు కూడా సీఎం అవుతారని, అయినా సరే నేతలు చెప్పినట్లు ఐఏఎస్, ఐఎఫ్ఎస్ వినాల్సిందేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఏర్పాటు చేసిన 10వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న సందర్భంగా కొండా సురేఖ ఈ కామెంట్స్ చేశారు. ఎంతో కష్టపడితేనే ఐఏఎస్, ఐపీఎస్లు అవుతారని, అయినా చివరికి వారు రాజకీయ నాయకుల ముందు నిల్చొని నాయకులు చెప్పింది వినాల్సివస్తుందని అన్నారు.
అయితే, అలా రాజ్యాంగంలో రాసి ఉందని, దానికి మనం ఏమీ చేయలేమని కూడా అన్నారు. పైగా, దీనిని విమర్శగా తీసుకోవద్దని, వివాదం చేయొద్దని కూడా చెప్పారు. ఇది తన మనసులో అభిప్రాయం మాత్రమేనని అన్నారు.
చదువు రాకున్నా, సబ్జెక్ట్ తెలియపోయినా…అధికారులను తాము తిడుతుంటామని వ్యాఖ్యానించారు. అయితే, రూల్స్ ఒప్పుకోని సందర్భంగా అధికారులు కొందరు ఆ పని చేయరని, వారి గురించి తాను మాట్లాడడం లేదని, వారి పని వారిని చేసుకోనివ్వాలని తెలిపారు.
కానీ, రూల్స్ ఒప్పుకున్నా సరే కొందరు తలబిరుసు అధికారులు పనిచేయరని, వారిని అన్నా తప్పులేదని చెప్పారు. ఏది ఏమైనా…అది కొండా సురేఖ మనసులోమాట అయినా…ఆ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
This post was last modified on February 18, 2026 11:45 am
ఎట్టకేలకు మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.అంబటి రాంబాబుపై ఉన్న అన్ని కేసుల్లోనూ ఆయనకు…
ఒకప్పుడు నిర్మాతలకు విపరీతమైన గౌరవం ఉండేది. పరిశ్రమను పోషించేది వాళ్లే కాబట్టి హీరో హీరోయిన్ దగ్గర నుంచి సాంకేతిక నిపుణులు,…
తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్లో ఒక వింత సంఘటన స్థానికులను, ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేసింది. బుర్ఖా వేసుకుని మహిళల…
తాజాగా రాజ్యసభలో ఖాళీ అవుతున్న 37 స్థానాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు రెడీ అయింది. దీనికి…
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్.. గత ఆదివారం కొలంబోకు వెళ్లి ఇండియా, పాకిస్థాన్ మధ్య టీ20 ప్రపంచకప్ మ్యాచ్ను వీక్షించడం…
ఢిల్లీలో జరుగుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సమ్మిట్లో గల్గోటియాస్ యూనివర్సిటీ ప్రదర్శించిన ఒక రోబో డాగ్ ఇప్పుడు పెద్ద వివాదానికి…