కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలపై తెలంగాణవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ ఏర్పడిన సంగతి తెలిసిందే. ఇక్కడ ఏ పార్టీకీ మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో హంగ్ ఏర్పడింది. మొత్తం 66 డివిజన్లకుగాను బీజేపీ 30 డివిజన్లు గెలుచుకుంది.
కాంగ్రెస్ 14, బీఆర్ఎస్ 9, ఇండిపెండెంట్లు 8, ఎంఐఎం 3, ఏఐఎఫ్ బీ 2 స్థానాల్లో విజయం సాధించాయి. అయితే, ఎక్స్ అఫిషియో ఓట్లతోపాటు ఇండిపెండెంట్ల మద్దతు కూడగట్టుకొని కరీంనగర్ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని బీజేపీ భావించింది.
అయితే, బీజేపీని మినహాయించి బీఆర్ఎస్ తో పాటు ఎంఐఎం, ఇండిపెండెంట్లు, ఇతరుల మద్దతు తీసుకొని కరీం నగర్ మేయర్ పీఠంపై కూర్చోవాలని కాంగ్రెస్ భావించింది. ఈ క్రమంలోనే మూడు రోజులుగా ఇక్కడ క్యాంప్ రాజకీయాలు కాక రేపాయి.
కానీ, కాంగ్రెస్ వ్యూహం ఫలించలేదు. చివరి నిమిషంలో కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ హ్యాండిచ్చింది. మేయర్ ఎన్నిక సమయంలో చేతులెత్తకుండా బీఆర్ఎస్ కార్పొరేటర్లు తటస్థంగా ఉన్నారు. దీంతో, కరీంనగర్ మేయర్ గా కొలగాని శ్రీనివాస్ ఎన్నికయ్యారు.
డిప్యూటీ మేయర్ గా యాదగిరి సునీల్ రావు ఎన్నికయ్యారు.మేయర్ ఎన్నికలో బీజేపీ బలపరిచిన కొలగాని శ్రీనివాస్ కు 34 ఓట్లు రాగా, కాంగ్రెస్ బలపరిచిన ఆకుల నర్మదకు 21 ఓట్లు మాత్రమే వచ్చాయి.
ఈ క్రమంలోనే బీఆర్ఎస్ కార్పొరేటర్లపై బీజేపీ ఎంపీ బండి సంజయ్ ప్రశంసలు కురిపించిన వైనంపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. కొన్ని చోట్ల బీఆర్ఎస్ తమ శత్రువు అంటున్న బండి సంజయ్….కరీంనగర్ లో మాత్రం బీఆర్ఎస్ తో లోపాయికారి పొత్తు కుదుర్చుకోవడంపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.
బీఆర్ఎస్ కార్పొరేటర్లు క్షేత్రస్థాయిలో వాస్తవాలను, ప్రజల ఆకాంక్షలను గ్రహించారని, అందుకే కాంగ్రెస్ కు మద్దతివ్వలేదని బండి సంజయ్ అనడం హాస్యాస్పదమని ట్రోల్ చేస్తున్నారు. ఇక, ఈ క్రెడిట్ అంతా కేవలం కరీంనగర్ లోని బీఆర్ఎస్ కార్పొరేటర్లకు మాత్రమే అప్లికబుల్ అని, మిగతా చోట్ల కాదని కూడా బండి సంజయ్ సెలవిచ్చారని ఎద్దేవా చేస్తున్నారు.
This post was last modified on February 16, 2026 4:11 pm
ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు.. ఏపీ సీఐడీ మాజీ చీఫ్, ఐపీఎస్ అధికారి.. ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్న సునీల్కు రఘురామకు…
టీడీపీలో నాయకులు.. చంద్రబాబు కనుసన్నల్లోనే మెలుగుతున్నారా? ఆయన చెప్పినట్టే చేస్తున్నారా? అంటే.. మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా…
అవకాశాలు.. అదృష్టాలు.. పదే పదే రావని అంటారు. అవి వచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకునేందుకు వ్యక్తులైనా పార్టీలైనా.. ఎవరైనా సరే..…
ఐపీఎల్ 2026 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు అస్సలు కలిసి రావడం లేదు. వరుసగా రెండో ఓటమిని…
ఎన్నికలు సమీపిస్తున్నపుడు కొందరు రాజకీయ నాయకులకు ఎలివేషన్లు ఇస్తూ సినిమాలు వస్తుంటాయి. అలాగే కొందరు నేతలను టార్గెట్ చేస్తూ మూవీస్…
ఏపీ రాజధాని అమరావతిపై సీఎం చంద్రబాబుకు ఉన్న ముందుచూపు, తాజాగా రాజధాని బిల్లును ఆమోదించిన విధానం.. వంటివి చర్చకు వస్తున్నాయి.…