కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలపై తెలంగాణవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ ఏర్పడిన సంగతి తెలిసిందే. ఇక్కడ ఏ పార్టీకీ మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో హంగ్ ఏర్పడింది. మొత్తం 66 డివిజన్లకుగాను బీజేపీ 30 డివిజన్లు గెలుచుకుంది.
కాంగ్రెస్ 14, బీఆర్ఎస్ 9, ఇండిపెండెంట్లు 8, ఎంఐఎం 3, ఏఐఎఫ్ బీ 2 స్థానాల్లో విజయం సాధించాయి. అయితే, ఎక్స్ అఫిషియో ఓట్లతోపాటు ఇండిపెండెంట్ల మద్దతు కూడగట్టుకొని కరీంనగర్ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని బీజేపీ భావించింది.
అయితే, బీజేపీని మినహాయించి బీఆర్ఎస్ తో పాటు ఎంఐఎం, ఇండిపెండెంట్లు, ఇతరుల మద్దతు తీసుకొని కరీం నగర్ మేయర్ పీఠంపై కూర్చోవాలని కాంగ్రెస్ భావించింది. ఈ క్రమంలోనే మూడు రోజులుగా ఇక్కడ క్యాంప్ రాజకీయాలు కాక రేపాయి.
కానీ, కాంగ్రెస్ వ్యూహం ఫలించలేదు. చివరి నిమిషంలో కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ హ్యాండిచ్చింది. మేయర్ ఎన్నిక సమయంలో చేతులెత్తకుండా బీఆర్ఎస్ కార్పొరేటర్లు తటస్థంగా ఉన్నారు. దీంతో, కరీంనగర్ మేయర్ గా కొలగాని శ్రీనివాస్ ఎన్నికయ్యారు.
డిప్యూటీ మేయర్ గా యాదగిరి సునీల్ రావు ఎన్నికయ్యారు.మేయర్ ఎన్నికలో బీజేపీ బలపరిచిన కొలగాని శ్రీనివాస్ కు 34 ఓట్లు రాగా, కాంగ్రెస్ బలపరిచిన ఆకుల నర్మదకు 21 ఓట్లు మాత్రమే వచ్చాయి.
ఈ క్రమంలోనే బీఆర్ఎస్ కార్పొరేటర్లపై బీజేపీ ఎంపీ బండి సంజయ్ ప్రశంసలు కురిపించిన వైనంపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. కొన్ని చోట్ల బీఆర్ఎస్ తమ శత్రువు అంటున్న బండి సంజయ్….కరీంనగర్ లో మాత్రం బీఆర్ఎస్ తో లోపాయికారి పొత్తు కుదుర్చుకోవడంపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.
బీఆర్ఎస్ కార్పొరేటర్లు క్షేత్రస్థాయిలో వాస్తవాలను, ప్రజల ఆకాంక్షలను గ్రహించారని, అందుకే కాంగ్రెస్ కు మద్దతివ్వలేదని బండి సంజయ్ అనడం హాస్యాస్పదమని ట్రోల్ చేస్తున్నారు. ఇక, ఈ క్రెడిట్ అంతా కేవలం కరీంనగర్ లోని బీఆర్ఎస్ కార్పొరేటర్లకు మాత్రమే అప్లికబుల్ అని, మిగతా చోట్ల కాదని కూడా బండి సంజయ్ సెలవిచ్చారని ఎద్దేవా చేస్తున్నారు.
శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…
ఏపీ రాజధాని అమరావతిలో శనివారం తెల్లవారు జాము నుంచి పోలీసులు అధికారులు పెద్ద ఎత్తున మోహరించారు. ఈ ప్రాంతంలో రాజధాని…
సంగీత ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తూ గాన కోకిల ఎస్ జానకి చివరి శ్వాస తీసుకున్నారు. గత కొంత కాలంగా…
వైసీపీ అధినేత జగన్పై సీఎం చంద్రబాబు షాకింగ్ కామెంట్స్ చేశారు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా షాబాద్లో ఓ వ్యక్తి ఆరుగురిని…
ఏపీలో ఆసక్తి రేకెత్తించిన జోసెఫ్ రావణ్ అలియాస్ ప్రశ్న రావణ్ వ్యవహారంపై కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. జనసేన అదినేత,…
అమెరికా అధ్యక్షుడి హోదాలో డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న విచిత్రమైన నిర్ణయాలతో ఆ దేశ ప్రజలతో పాటు ఆ దేశంలోని విదేశీయులు నానా ఇబ్బందులు పడుతున్నారు.…