Political News

‘బీఆర్ఎస్ కాదు… బీఆర్ఎస్ కార్పొరేటర్లు గొప్పోళ్లు’

కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలపై తెలంగాణవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ ఏర్పడిన సంగతి తెలిసిందే. ఇక్కడ ఏ పార్టీకీ మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో హంగ్ ఏర్పడింది. మొత్తం 66 డివిజన్లకుగాను బీజేపీ 30 డివిజన్లు గెలుచుకుంది.

కాంగ్రెస్ 14, బీఆర్ఎస్ 9, ఇండిపెండెంట్లు 8, ఎంఐఎం 3, ఏఐఎఫ్ బీ 2 స్థానాల్లో విజయం సాధించాయి. అయితే, ఎక్స్ అఫిషియో ఓట్లతోపాటు ఇండిపెండెంట్ల మద్దతు కూడగట్టుకొని కరీంనగర్ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని బీజేపీ భావించింది.

అయితే, బీజేపీని మినహాయించి బీఆర్ఎస్ తో పాటు ఎంఐఎం, ఇండిపెండెంట్లు, ఇతరుల మద్దతు తీసుకొని కరీం నగర్ మేయర్ పీఠంపై కూర్చోవాలని కాంగ్రెస్ భావించింది. ఈ క్రమంలోనే మూడు రోజులుగా ఇక్కడ క్యాంప్ రాజకీయాలు కాక రేపాయి.

కానీ, కాంగ్రెస్ వ్యూహం ఫలించలేదు. చివరి నిమిషంలో కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ హ్యాండిచ్చింది. మేయర్ ఎన్నిక సమయంలో చేతులెత్తకుండా బీఆర్ఎస్ కార్పొరేటర్లు తటస్థంగా ఉన్నారు. దీంతో, కరీంనగర్ మేయర్ గా కొలగాని శ్రీనివాస్ ఎన్నికయ్యారు.

డిప్యూటీ మేయర్ గా యాదగిరి సునీల్ రావు ఎన్నికయ్యారు.మేయర్ ఎన్నికలో బీజేపీ బలపరిచిన కొలగాని శ్రీనివాస్ కు 34 ఓట్లు రాగా, కాంగ్రెస్ బలపరిచిన ఆకుల నర్మదకు 21 ఓట్లు మాత్రమే వచ్చాయి.

ఈ క్రమంలోనే బీఆర్ఎస్ కార్పొరేటర్లపై బీజేపీ ఎంపీ బండి సంజయ్ ప్రశంసలు కురిపించిన వైనంపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. కొన్ని చోట్ల బీఆర్ఎస్ తమ శత్రువు అంటున్న బండి సంజయ్….కరీంనగర్ లో మాత్రం బీఆర్ఎస్ తో లోపాయికారి పొత్తు కుదుర్చుకోవడంపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.

బీఆర్ఎస్ కార్పొరేటర్లు క్షేత్రస్థాయిలో వాస్తవాలను, ప్రజల ఆకాంక్షలను గ్రహించారని, అందుకే కాంగ్రెస్ కు మద్దతివ్వలేదని బండి సంజయ్ అనడం హాస్యాస్పదమని ట్రోల్ చేస్తున్నారు. ఇక, ఈ క్రెడిట్ అంతా కేవలం కరీంనగర్ లోని బీఆర్ఎస్ కార్పొరేటర్లకు మాత్రమే అప్లికబుల్ అని, మిగతా చోట్ల కాదని కూడా బండి సంజయ్ సెలవిచ్చారని ఎద్దేవా చేస్తున్నారు.

This post was last modified on February 16, 2026 4:11 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Bandi Sanjay

Recent Posts

విజయ్ కి మద్దతు.. కాంగ్రెస్ కు పెద్ద లాసే?

తమిళనాడు రాజకీయాల్లో ఏర్పడ్డ కొత్త సమీకరణాలు దేశ రాజకీయాల్లో పెను మార్పునకు దారి తీశాయని చెప్పక తప్పదు. మరో మూడేళ్లలో…

1 hour ago

పవన్ చొరవతో క్షేమంగా ఇల్లు చేరిన ముస్లిం మహిళ

బతుకుదెరువు కోసం విదేశం వెళ్లిన ఏపీకి చెందిన ముస్లిం మహిళ అక్కడ విష వలయంలో చిక్కుకుంది. ఆ ఉచ్చు నుంచి…

8 hours ago

రిస్క్ ఉన్నా ముందుకెళ్తున్న అబ్బవరం

ఇటీవలే కిరణ్ అబ్బవరం నిర్మాతగా మారి తిమ్మరాజుపల్లి టీవీ తీశారు. మొదటి మూడు రోజులు తెగ హడావిడి చేశారు. గొప్ప…

8 hours ago

ఎల్లమ్మ సమస్యకు ఏది ముగింపు

దేవిశ్రీ ప్రసాద్ ని హీరోగా పరిచయం చేస్తూ నిర్మాత దిల్ రాజు ప్రకటించిన ఎల్లమ్మ ఇప్పటికీ రెగ్యులర్ షూటింగ్ కు…

9 hours ago

దేవిశ్రీ.. అంత:కరణశుద్ధితో..

సంగీత దర్శకులు హీరోలు కావడం తమిళ ఇండస్ట్రీలో ఇప్పటికే చూశాం. విజయ్ ఆంటోనీ, జి.వి.ప్రకాష్ కుమార్ లాంటి వాళ్లు సినీ…

11 hours ago

ఇక కాంగ్రెస్ వాళ్లతో కూర్చోలేం

ఇటీవల జరిగిన తమిళనాడు శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్తో డీఎంకే పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే అయితే కేవలం ఐదు సీట్లు…

12 hours ago