జగిత్యాల మునిసిపల్ పీఠం ఎట్టకేలకు కాంగ్రెస్పార్టీకే దక్కింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న స్తబ్దతకు చెక్ పెడుతూ.. కాంగ్రెస్ అదిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ జాతీయస్థాయి నాయకుడు సవాంగ్ ను రంగంలోకి దింపింది. దీంతో ఆయన ఎంట్రీ ఇచ్చి.. ఇరు వర్గాలుగా చీలిపోయిన కాంగ్రెస్ పార్టీ నేతలను ఏకతాటిపైకి తీసుకువచ్చారు.
అందరూ కలసి కట్టుగా పనిచేస్తేనే పార్టీకి ఫ్యూచర్ ఉంటుందని తేల్చి చెప్పారు. ఇదేసమయంలో సీనియర్ నేత జీవన్ రెడ్డి చెప్పినట్టుగా.. పార్టీకి ఆది నుంచి పనిచేస్తున్న వారికి గుర్తింపు, పదవులు ఇచ్చేందుకుపార్టీ రెడీ అయింది. దీంతో ఇక్కడ నెలకొన్న వివాదం సర్దుమణిగింది.
అసలేం జరిగింది?
జగిత్యాల మునిసిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచి.. కాంగ్రెస్కు మద్దతుదారుగా మారిన ఎమ్మెల్యే సంజయ్కుమార్ వర్గానికి పార్టీ నాయకత్వం టికెట్లు ఖరారు చేసింది. దీంతో అలకబూనిన సీనియర్ నేత.. జీవన్రెడ్డి.. తన వర్గాన్ని ఇండిపెండెంట్లుగా బరిలోకి దింపారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో సంజయ్ కుమార్ వర్గం కంటే కూడా.. జీవన్ వర్గంలో ఎక్కువ మంది విజయం దక్కించుకున్నారు. మరోవైపు బీఆర్ ఎస్, బీజేపీలు ఆశించిన మేరకు ఫలితం రాబట్టలేకపోయాయి. దీంతో ఇక్కడ హంగ్ ఏర్పడింది.
ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డి-సంజయ్కుమార్ వర్గాలు కలిస్తే.. మునిసిపల్ పీఠాన్నిదక్కించుకునే అవకాశం కాంగ్రెస్కు ఏర్పడింది. కానీ, రెండురోజులుగా జరిగిన ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇరు పక్షాలను ఏకం చేసేందుకు పార్టీ ప్రయత్నించింది.
హైదరాబాద్లోని ప్రజాభవన్కు తన వర్గం కౌన్సిలర్లతో వచ్చిన జీవన్ రెడ్డితో కాంగ్రెస్ హైకమాండ్.. చర్చించింది. చైర్మన్ పీఠం సంజయ్ వర్గానికి, వైస్ చైర్మన్ పదవి జీవన్ వర్గానికి ఇచ్చేందుకు సమ్మతించింది. దీంతో జీవన్ రెడ్డి ఓకే చెప్పారు. అదేసమయంలో కాంగ్రెస్లో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న వారికి ప్రాధాన్యం ఇవ్వాలన్న ఆయన సూచనలకు కూడా పార్టీ ఓకే చెప్పంది. దీంతో జగిత్యాలలో నెలకొన్న వివాదం సర్దుమణిగింది.
This post was last modified on February 16, 2026 11:52 am
పహల్గామ్ ఉగ్రదాడి విషయంలో భారత్కు అంతర్జాతీయ వేదికపై కీలక మద్దతు లభించింది. ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సులో ఆమోదించిన న్యూఢిల్లీ…
రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మక స్థానాల్లో గుంటూరు మేయర్ స్థానం ఒకటి. విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లు అమరావతి రాజధాని పరిసరాల్లో ఉండటంతో…
వ్యూహాల కలిమి.. నాయకుల చెలిమి ఏ పార్టీకైనా అత్యంత అవసరం. ఈ విషయంలో వైసీపీ చేస్తున్న వ్వవహారం.. పార్టీని దుంపనాశనం…
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. సొంత నియోజకవర్గం పులివెందులను తమ హస్తగతం చేసుకోవాలన్నది.. టీడీపీ ఆకాంక్ష. ముఖ్యంగా స్థానిక…
ప్రేక్షకులు చాల అడ్వాన్స్ ఉన్నారు, తెలివి మీరిపోయారనే సత్యాన్ని చాలా మంది దర్శక నిర్మాతలు గుర్తించడం లేదు. ఆ ఏముందిలే…
ఇండస్ట్రీలో వరుసగా ఫెయిల్యూర్లు ఇచ్చాక అవకాశాలు దక్కించుకోవడం అంత తేలికైన విషయం కాదు. కానీ కొందరు డైరెక్టర్లు మాత్రం తమ…