Movie News

తెలుగు సినిమాలో తెలుగమ్మాయిల జోరు

తెలుగు సినిమాల్లో తెలుగమ్మాయిలకు పెద్ద అవకాశాలు రావడం అరుదు. మన అమ్మాయిలంటే తెలుగు దర్శక నిర్మాతలకు చిన్నచూపు అని కొందరంటే.. తెలుగమ్మాయిలు సినిమాల్లోకి రావడమే తక్కువ, వచ్చినా ఆయా పాత్రలకు తగ్గట్లుగా అప్పీయరెన్స్ ఉండదు, కోరుకున్నట్లుగా నటించరు అని ఇంకొందరంటారు.

కారణాలు ఏవైనా సరే.. తెలుగు సినిమాల్లో తెలుగు హీరోయిన్లకు ప్రాధాన్యం తక్కువ అన్నది మాత్రం వాస్తవం. కానీ ఇటీవల మన సినిమాల్లో తెలుగు హీరోయిన్ల జోరు కొంచెం పెరుగుతోంది. నిజానికి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ప్రస్తుతం నంబర్ వన్ హీరోయిన్ అని చెప్పుకోవడానికి ఎవ్వరూ లేరు. ఒకప్పుడు అనుష్క, కాజల్, తమన్నా, సమంతల్లా ఇప్పుడు ఎవ్వరూ వెలిగిపోవడం లేదు. హీరోయిన్ల కొరత కనిపిస్తోంది. ఇలాంటి టైంలోనే తెలుగమ్మాయిలు రైజ్ అవుతున్నారు.

‘బేబీ’ సినిమాతో మంచి గుర్తింపు సంపాదించి బిజీ అయిపోయింది వైష్ణవి చైతన్య. ‘బేబీ’ తర్వాత లవ్‌మి, జాక్ సినిమాలు షాకిచ్చినా.. ఇప్పుడు ‘ఎపిక్’ లాంటి క్రేజీ మూవీలో నటిస్తోంది. ‘అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు’ చిత్రంతో కథానాయికగా పరిచయమైన శివాని నాగారం తన ప్రతిభను చాటుకుంది. ఆమెకు ‘లిటిల్ హార్ట్స్’ రూపంలో భారీ విజయం దక్కింది. ఇప్పుడు ‘హే భగవాన్’ లాంటి ప్రామిసింగ్ మూవీతో పలకరించబోతోంది శివాని. ఇది కూడా హిట్టయితే శివాని రేంజ్ మారిపోవచ్చు. 

ఇక హైదరాబాద్ అమ్మాయి, థియేటర్ బ్యాగ్రౌండ్ నుంచి వచ్చిన ఫరియా అబ్దుల్లా ‘జాతిరత్నాలు’తో పెద్ద హిట్ కొట్టింది. తర్వాత ఆమెకు అంతగా కలిసి రాకపోయినా సినిమాలకైతే లోటు లేదు. ఇటీవలే ‘గుర్రంపాపిరెడ్డి’తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆమె.. త్వరలోనే ‘గాయపడ్డ సింహం’ చిత్రంతో రాబోతోంది. తమిళంలోనూ ఆమె ఒక సినిమాలో నటిస్తోంది.

మరోవైపు శ్రీ గౌరీ ప్రియ ఇప్పుడు తమిళంలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది. జయం రవి లాంటి పెద్ద హీరోతో ‘బ్రో కోడ్’ సినిమా చేస్తున్న ఆమెకు అక్కడ ఇంకో రెండు సినిమాలున్నాయి. తెలుగులో ‘చెన్నై లవ్ స్టోరీ’ లాంటి క్రేజీ మూవీతో పాటు అశోక్ గల్లాతో ఓ సినిమాలో నటించింది గౌరీప్రియ. 

ఇప్పుడు తెలుగులో చర్చనీయాంశంగా మారిన ‘కపుల్ ఫ్రెండ్లీ’లో కథానాయికగా నటించిన మానస వారణాసి సైతం అచ్చ తెలుగు అమ్మాయే. 2020లో మిస్ ఇండియాగా నిలిచిన మానసకు తొలి చిత్రం ‘దేవకీ నందన వసుదేవ’ నిరాశ మిగిల్చినా.. ‘కపుల్ ఫ్రెండ్లీ’ మాత్రం మంచి బ్రేక్ ఇచ్చింది. ఇందులో తన అందం, అభినయం కుర్రాళ్లను కట్టిపడేస్తోంది.

ఇంకోవైపు ‘కోర్టు’ అమ్మాయి శ్రీదేవి కూడా బిజీ అయ్యేలా కనిపిస్తోంది. ‘బ్యాండ్ మేళం’తో ఆమె త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే చాందిన చౌదరి, ఈషా రెబ్బా, అనన్య నాగళ్ళ లాంటి తెలుగమ్మాయిలు ఇండస్ట్రీలో కొనసాగుతుండగా.. ఇప్పుడు ఈ కొత్తమ్మాయిల కెరీర్ ప్రామిసింగ్‌గా కనిపిస్తోంది.

This post was last modified on February 16, 2026 12:35 pm

Share

Recent Posts

హెచ్చరికలతో సరిపెడితే ఎలా బాబు గారు

టీడీపీ అధినేత చంద్ర‌బాబు వైఖ‌రి.. పార్టీ నాయ‌కులకు బాగా క‌లిసి వ‌స్తోంద‌న్న‌వాద‌న వినిపిస్తోంది. ఇప్ప‌టికి రెండు సంవ‌త్స‌రాలుగా చంద్ర‌బాబు.. త‌మ్ముళ్ల‌కు…

30 minutes ago

పార్టీ సమస్యలు పట్టించుకోండి సీఎం సార్

తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు ఎప్పటికప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి. గ్రాండ్ ఓల్డ్ పార్టీలో ఈ తరహా పరిస్థితులు కొత్తేమీ…

2 hours ago

ఏజెంట్‌లో నన్ను చూసి అసహ్యమేసింది – అఖిల్

అక్కినేని యువ కథానాయకుడు అఖిల్ హీరోగా స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి రూపొందించిన ‘ఏజెంట్’ టాలీవుడ్ చరిత్రలోనే అతి పెద్ద…

4 hours ago

దేవర కలెక్షన్లపై డిస్ట్రిబ్యూటర్ క్లారిటీ

ఒక సినిమా రిలీజైన రెండు మూడేళ్ల తర్వాత కూడా దాని కలెక్షన్ల గురించి విపరీతమైన చర్చ జరగడం అరుదు. ‘దేవర’ విషయంలో ఇదే…

8 hours ago

కొత్త విద్యా మంత్రిగా జోషి… ఎవరీయన?

కేంద్ర విద్యా శాఖకు నూతన మంత్రిగా బీజేపీ సీనియర్ నేత, కేంద్ర కేబినెట్ లో కీలక శాఖల మంత్రిగా కొనసాగుతున్న ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు.…

11 hours ago

విజయ్ బలహీనతే కిరణ్ బలం

బాక్సాఫీస్ దగ్గర పోటీ ఉన్నప్పుడు కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు జరుగుతాయి. ఇది అలాంటిదే. కేవలం ఒక్క రోజు గ్యాప్ తో…

12 hours ago