Movie News

తెలుగు సినిమాలో తెలుగమ్మాయిల జోరు

తెలుగు సినిమాల్లో తెలుగమ్మాయిలకు పెద్ద అవకాశాలు రావడం అరుదు. మన అమ్మాయిలంటే తెలుగు దర్శక నిర్మాతలకు చిన్నచూపు అని కొందరంటే.. తెలుగమ్మాయిలు సినిమాల్లోకి రావడమే తక్కువ, వచ్చినా ఆయా పాత్రలకు తగ్గట్లుగా అప్పీయరెన్స్ ఉండదు, కోరుకున్నట్లుగా నటించరు అని ఇంకొందరంటారు.

కారణాలు ఏవైనా సరే.. తెలుగు సినిమాల్లో తెలుగు హీరోయిన్లకు ప్రాధాన్యం తక్కువ అన్నది మాత్రం వాస్తవం. కానీ ఇటీవల మన సినిమాల్లో తెలుగు హీరోయిన్ల జోరు కొంచెం పెరుగుతోంది. నిజానికి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ప్రస్తుతం నంబర్ వన్ హీరోయిన్ అని చెప్పుకోవడానికి ఎవ్వరూ లేరు. ఒకప్పుడు అనుష్క, కాజల్, తమన్నా, సమంతల్లా ఇప్పుడు ఎవ్వరూ వెలిగిపోవడం లేదు. హీరోయిన్ల కొరత కనిపిస్తోంది. ఇలాంటి టైంలోనే తెలుగమ్మాయిలు రైజ్ అవుతున్నారు.

‘బేబీ’ సినిమాతో మంచి గుర్తింపు సంపాదించి బిజీ అయిపోయింది వైష్ణవి చైతన్య. ‘బేబీ’ తర్వాత లవ్‌మి, జాక్ సినిమాలు షాకిచ్చినా.. ఇప్పుడు ‘ఎపిక్’ లాంటి క్రేజీ మూవీలో నటిస్తోంది. ‘అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు’ చిత్రంతో కథానాయికగా పరిచయమైన శివాని నాగారం తన ప్రతిభను చాటుకుంది. ఆమెకు ‘లిటిల్ హార్ట్స్’ రూపంలో భారీ విజయం దక్కింది. ఇప్పుడు ‘హే భగవాన్’ లాంటి ప్రామిసింగ్ మూవీతో పలకరించబోతోంది శివాని. ఇది కూడా హిట్టయితే శివాని రేంజ్ మారిపోవచ్చు. 

ఇక హైదరాబాద్ అమ్మాయి, థియేటర్ బ్యాగ్రౌండ్ నుంచి వచ్చిన ఫరియా అబ్దుల్లా ‘జాతిరత్నాలు’తో పెద్ద హిట్ కొట్టింది. తర్వాత ఆమెకు అంతగా కలిసి రాకపోయినా సినిమాలకైతే లోటు లేదు. ఇటీవలే ‘గుర్రంపాపిరెడ్డి’తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆమె.. త్వరలోనే ‘గాయపడ్డ సింహం’ చిత్రంతో రాబోతోంది. తమిళంలోనూ ఆమె ఒక సినిమాలో నటిస్తోంది.

మరోవైపు శ్రీ గౌరీ ప్రియ ఇప్పుడు తమిళంలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది. జయం రవి లాంటి పెద్ద హీరోతో ‘బ్రో కోడ్’ సినిమా చేస్తున్న ఆమెకు అక్కడ ఇంకో రెండు సినిమాలున్నాయి. తెలుగులో ‘చెన్నై లవ్ స్టోరీ’ లాంటి క్రేజీ మూవీతో పాటు అశోక్ గల్లాతో ఓ సినిమాలో నటించింది గౌరీప్రియ. 

ఇప్పుడు తెలుగులో చర్చనీయాంశంగా మారిన ‘కపుల్ ఫ్రెండ్లీ’లో కథానాయికగా నటించిన మానస వారణాసి సైతం అచ్చ తెలుగు అమ్మాయే. 2020లో మిస్ ఇండియాగా నిలిచిన మానసకు తొలి చిత్రం ‘దేవకీ నందన వసుదేవ’ నిరాశ మిగిల్చినా.. ‘కపుల్ ఫ్రెండ్లీ’ మాత్రం మంచి బ్రేక్ ఇచ్చింది. ఇందులో తన అందం, అభినయం కుర్రాళ్లను కట్టిపడేస్తోంది.

ఇంకోవైపు ‘కోర్టు’ అమ్మాయి శ్రీదేవి కూడా బిజీ అయ్యేలా కనిపిస్తోంది. ‘బ్యాండ్ మేళం’తో ఆమె త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే చాందిన చౌదరి, ఈషా రెబ్బా, అనన్య నాగళ్ళ లాంటి తెలుగమ్మాయిలు ఇండస్ట్రీలో కొనసాగుతుండగా.. ఇప్పుడు ఈ కొత్తమ్మాయిల కెరీర్ ప్రామిసింగ్‌గా కనిపిస్తోంది.

This post was last modified on February 16, 2026 8:33 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

టీమిండియా దెబ్బకు పాకిస్థాన్‌ చిత్తుగా..

టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా జరిగిన అత్యంత క్రేజీ ఫైట్‌లో టీమిండియా తన ఆధిపత్యాన్ని చాటుకుంది. కొలంబోలోని ఆర్.…

12 hours ago

కుల్దీప్ సింగ్ పై పాండ్య ఫైర్, ఏం జరిగింది?

ఉత్కంఠ పోరుతో సాగుతుందనుకున్న ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ నీరసంగా జరిగింది. 175 పరుగులు చేసిన భారత్ సేన.. పాక్ ను…

12 hours ago

ఇదే ‘కపుల్’.. మళ్లీ వేలంటైన్స్ డేకి

వేలంటైన్స్ డే వీకెండ్లో తెలుగులో మూడు పేరున్న చిత్రాలు రిలీజయ్యాయి. ఐతే అందులో ‘ఫంకీ’, ‘సీతాపయనం’ ప్రేక్షకుల నుంచి ఆశించిన…

14 hours ago

`కోవా బ‌న్‌` వివాదం.. నాగబాబు ఎంట్రీ..!

గ‌త వారం ప‌ది రోజులుగా తెర‌చాటునే ఉన్న `కోవా బ‌న్‌` వివాదం.. రెండురోజుల నుంచి తీవ్ర‌స్థాయిలో రాజ‌కీయ రంగు పులుముకుంది.…

15 hours ago

సినిమా ఫలితంలో ఎడిటర్ బాధ్యత ఎంత

ఒక సినిమా ఫలితంలో దర్శకత్వం తర్వాత ప్రధానంగా బాధ్యత వహించే విభాగం ఎడిటింగ్. పైకి ఏదో కత్తిరింపులు అతికింపులు అనే…

15 hours ago

రవితేజ సినిమా.. అన్నీ సాహసాలే

మాస్ రాజా రవితేజ చివరి హిట్ ఏది అంటే ఆయన అభిమానులు కూడా తడుముకునే పరిస్థితి. 2022లో వచ్చిన ‘ధమాకా’…

16 hours ago