Political News

‘బాబ్రీ’ మసీదు పనులు ప్రారంభం

పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌ జిల్లా బెల్దంగా కేంద్రంగా మరోసారి బాబ్రీ అంశం రాజకీయ చర్చలకు దారితీసింది. జనతా ఉన్నాయన్‌ పార్టీ అధ్యక్షుడు హుమాయున్‌ కబీర్‌ బుధవారం ఖురాన్‌ పఠనం అనంతరం మసీదు నిర్మాణ పనులను ప్రారంభించినట్టు ప్రకటించారు.

అయోధ్యలో కూల్చివేయబడిన నిర్మాణ నమూనాను ఆదర్శంగా తీసుకుని మసీదు నిర్మిస్తామని, రెండేళ్లలో పూర్తి చేస్తామని తెలిపారు. “అల్లాహ్‌ కృపతో మా బాబ్రీ మసీదు నిర్మాణం పూర్తి అవుతుంది” అని ఆయన వ్యాఖ్యానించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

మాజీ తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా ఉన్న కబీర్‌ ఇటీవలే కొత్త పార్టీ స్థాపించి ఈ ప్రకటన చేయడం విశేషంగా మారింది. ఎన్నికల సమయం సమీపిస్తున్న వేళ ఈ నిర్ణయం రాజకీయ వ్యూహంలో భాగమేనా? ముఖ్యంగా ముస్లిం ఓటు బ్యాంకుపై ప్రభావం చూపే ప్రయత్నమా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు ఇది దారి తీస్తుందా అన్నదీ ఆసక్తికరంగా మారింది.

ఇదిలా ఉండగా, బాబ్రీ మసీదు అంశం ముగిసిన అధ్యాయమని ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ స్పష్టం చేశారు. మసీదును మళ్లీ నిర్మిస్తామనే కలలు నెరవేరవని వ్యాఖ్యానించారు.

అయోధ్యలో రామమందిర నిర్మాణం అనంతరం దేశంలో శాంతి, సామరస్యాలు కాపాడాల్సిన అవసరం ఉందని సూచించారు. ఈ పరిణామాలతో బాబ్రీ అంశం మరోసారి జాతీయ రాజకీయాల్లో వేడి చర్చలకు దారి తీసింది.

This post was last modified on February 12, 2026 9:49 am

Share
Show comments
Published by
Kumar
Tags: Babri Masjid

Recent Posts

బస్సు ప్రమాదం… కత్తితో 8 మందిని కాపాడిన రియల్ హీరో

మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం తీరని విషాదాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే. అయితే ఇదే ప్రమాదంలో మరోవైపు…

36 minutes ago

సంక్షోభాన్ని అడ్డుకునేందుకు భారత్ ప్లాన్ బీ

పశ్చిమ ఆసియాలో యుద్ధం ముదురుతున్న కొద్దీ భారత్ తన ఇంధన అవసరాల కోసం వ్యూహాలను వేగవంతం చేస్తోంది. చమురు, గ్యాస్…

58 minutes ago

పవన్ భార్యకు కూడా చిరు అన్నయే…

​మెగా కుటుంబంలో అన్నదమ్ముల మధ్య ఉండే అనుబంధం గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. చిరంజీవి అంటే తమ్ముళ్లు నాగబాబు, పవన్ కల్యాణ్…

2 hours ago

‘ఉస్తాద్’కు లాస్ట్ ఛాన్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ముందు అనుకున్న ప్రకారం అయితే ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ…

2 hours ago

భోజనంలో పురుగులు… వందేభారత్ రామానుజం ఏం చేశాడు?

వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికులకు అందించే భోజనం నాణ్యతపై మరోసారి పెద్ద వివాదం రాజుకుంది. పాట్నా నుంచి టాటానగర్ వెళ్లే…

2 hours ago

చిరు బాబీ మిస్… వెంకీ అనిల్ ఫిక్స్

వరసగా సినిమాలు చేస్తున్నా సక్సెస్ మాత్రం అందని ద్రాక్ష పండులా మారిపోయిన ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి సరైన బ్రేక్…

3 hours ago