Political News

‘బాబ్రీ’ మసీదు పనులు ప్రారంభం

పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌ జిల్లా బెల్దంగా కేంద్రంగా మరోసారి బాబ్రీ అంశం రాజకీయ చర్చలకు దారితీసింది. జనతా ఉన్నాయన్‌ పార్టీ అధ్యక్షుడు హుమాయున్‌ కబీర్‌ బుధవారం ఖురాన్‌ పఠనం అనంతరం మసీదు నిర్మాణ పనులను ప్రారంభించినట్టు ప్రకటించారు.

అయోధ్యలో కూల్చివేయబడిన నిర్మాణ నమూనాను ఆదర్శంగా తీసుకుని మసీదు నిర్మిస్తామని, రెండేళ్లలో పూర్తి చేస్తామని తెలిపారు. “అల్లాహ్‌ కృపతో మా బాబ్రీ మసీదు నిర్మాణం పూర్తి అవుతుంది” అని ఆయన వ్యాఖ్యానించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

మాజీ తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా ఉన్న కబీర్‌ ఇటీవలే కొత్త పార్టీ స్థాపించి ఈ ప్రకటన చేయడం విశేషంగా మారింది. ఎన్నికల సమయం సమీపిస్తున్న వేళ ఈ నిర్ణయం రాజకీయ వ్యూహంలో భాగమేనా? ముఖ్యంగా ముస్లిం ఓటు బ్యాంకుపై ప్రభావం చూపే ప్రయత్నమా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు ఇది దారి తీస్తుందా అన్నదీ ఆసక్తికరంగా మారింది.

ఇదిలా ఉండగా, బాబ్రీ మసీదు అంశం ముగిసిన అధ్యాయమని ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ స్పష్టం చేశారు. మసీదును మళ్లీ నిర్మిస్తామనే కలలు నెరవేరవని వ్యాఖ్యానించారు.

అయోధ్యలో రామమందిర నిర్మాణం అనంతరం దేశంలో శాంతి, సామరస్యాలు కాపాడాల్సిన అవసరం ఉందని సూచించారు. ఈ పరిణామాలతో బాబ్రీ అంశం మరోసారి జాతీయ రాజకీయాల్లో వేడి చర్చలకు దారి తీసింది.

This post was last modified on February 12, 2026 9:49 am

Share
Show comments
Published by
Kumar
Tags: Babri Masjid

Recent Posts

దృశ్యం 3 మీద సన్నగిల్లుతున్న ఆశలు

ఫ్యామిలీ థ్రిల్లర్స్ లో కొత్త ఒరవడికి చుట్టిన దృశ్యం ఫ్రాంచైజ్ లో చివరి భాగం మలయాళంలో షూటింగ్ పూర్తి చేసుకుంది.…

3 hours ago

నమీబియాపై గెలిచినా… టీమిండియాలో అదే టెన్షన్

టీ20 వరల్డ్ కప్ భాగంగా జరిగిన రెండో గ్రూప్ మ్యాచ్ లో నమీబియాపై భారత్ 93 పరుగుల తేడాతో భారీ…

4 hours ago

ఫీడ్ బ్యాక్ విశ్లేషణలో స్వయంభు బిజీ

నిన్న నిఖిల్ సిద్దార్థ స్వయంభు రెండు నిమిషాల టీజర్ వచ్చాక సోషల్ మీడియా రియాక్షన్లు అన్ని రకాలుగా ఉన్నాయి. ఈ…

4 hours ago

పుష్ప స్టైల్లో ‘తగ్గేదే లే’ అంటున్న అంబటి

మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు మరోసారి వార్తల్లో నిలిచారు. గుంటూరు కోర్టుకు తరలిస్తుండగా పోలీసు వ్యాన్‌లో…

4 hours ago

బ్యాంక్ స్టేట్ మెంట్ చూడమంటున్న రాజుగారు

కొద్దిరోజుల క్రితం టాక్సిక్ తెలుగు రాష్ట్రాల హక్కులను దిల్ రాజు 120 కోట్లకు తీసుకున్నారనే వార్త మీడియాలో హాట్ టాపిక్…

5 hours ago

మెగా హీరో బ్రేకప్‌కు కారణం ఆ దర్శకుడా?

సాయిధరమ్ తేజ్ టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్లలో ఒకడు. కానీ 40వ పడికి చేరువ అవుతున్నా ఇంకా అతను పెళ్లి పీటలు ఎక్కలేదు.…

7 hours ago