Political News

నెలలో 6,433 సుపథం టికెట్లు జారీ… వైవీ పీఏ పనే?

కల్తీ నెయ్యి సరఫరా కేసులో నిందితుడిగా ఉన్న కదురు చిన్నప్పన్న తనకు 2018 వరకు మాత్రమే పీఏగా పనిచేశాడని, ఆ తర్వాత అతనితో ఎలాంటి సంబంధం లేదని టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెబుతున్న నేపథ్యంలో కొత్త అంశాలు వెలుగులోకి వచ్చాయి.

సాధారణ భక్తులు శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనం కోసం ఉచిత దర్శన టోకెన్లకు తెల్లవారుజాము నుంచే క్యూలైన్లలో నిలబడాల్సి వస్తోంది. రూ.300 సుపథం టికెట్లు ఆన్లైన్ ద్వారా లేదా ప్రజాప్రతినిధుల సిఫారసుతో దొరికితే అదృష్టంగా భావించే పరిస్థితి ఉంది.

అలాంటి సమయంలో 2021 సెప్టెంబరు నెలలో మాత్రమే చిన్నప్పన్న పేరు మీద టీటీడీ ఛైర్మన్ కార్యాలయం నుంచి 6,433 సుపథం టికెట్లు జారీ అయినట్లు సమాచారం. అంటే రోజుకు సగటున 214 టికెట్లు జారీ అయినట్టుగా లెక్కలు చూపిస్తున్నాయి. ఈ వ్యవహారం రోజూ నిరవధికంగా కొనసాగినట్లు తెలుస్తోంది.

వైసీపీ హయాంలో ఒక్కో ఎమ్మెల్యేకి రోజుకు ఆరు సుపథం టికెట్లు మాత్రమే, అది కూడా వారానికి ఐదు రోజులపాటు మాత్రమే ఇచ్చే పరిమితి ఉండేదని అధికారులు చెబుతున్నారు.

అలాంటిది ఒక వ్యక్తి పేరు మీదే నెలలో వేల సంఖ్యలో టికెట్లు జారీ కావడం అనుమానాలకు తావిస్తోంది. ఈ లెక్కన సుబ్బారెడ్డి టీటీడీ ఛైర్మన్‌గా ఉన్న నాలుగేళ్ల కాలంలో చిన్నప్పన్న పేరు మీద ఎన్ని టికెట్లు జారీ అయ్యాయన్నది ప్రశ్నార్థకంగా మారింది. వీఐపీ బ్రేక్ దర్శనం, ఆర్జితసేవల టికెట్ల జారీపై కూడా స్పష్టత రావాల్సి ఉంది.

సుబ్బారెడ్డి మాత్రం చిన్నప్పన్న 2014–2018 మధ్యే తన వద్ద పీఏగా పనిచేశాడని, తర్వాత ఢిల్లీలోని ఏపీ భవన్‌లో లైజన్ అధికారిగా పనిచేశాడని, తనతో ఎలాంటి సంబంధం లేదని పేర్కొంటున్నారు.

అయితే ఒక ఔట్సోర్సింగ్ ఉద్యోగి పేరు మీదే ఛైర్మన్ కార్యాలయం నుంచి వేల టికెట్లు జారీ కావడంపై ఆశ్చర్యం కలిగించే అంశం. టీటీడీతో అధికారిక సంబంధం లేని వ్యక్తి పేరు మీద ఈ స్థాయిలో టికెట్లు ఎలా జారీ అయ్యాయి? ఆ అనుమతులకు ఆధారం ఏమిటి? అనే ప్రశ్నలు ఇప్పుడు ప్రధానంగా మారాయి.

This post was last modified on February 12, 2026 2:54 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

థియేటర్ల ఆకలి తీర్చే ఆహారం ఎక్కడ

తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల పరిస్థితి అసలేం బాగోలేదు. హౌస్ ఫుల్ బోర్డులకు బూజు పడుతోంది. టికెట్లన్నీ అమ్ముడుపోయాయని గర్వంగా చెప్పుకునే…

21 minutes ago

MRP టీజర్ – వినోదంతో నిండిన వినూత్నమైన కథ!

https://youtu.be/COhEUjI-GEk?si=vlcLiVU0tytCMihG ఎంఆర్పీ సినిమా టీజర్ విడుదలై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రముఖ నిర్మాత సాహు గారపాటి చేతుల మీదుగా…

1 hour ago

పెద్ది అయోమయం… సంయుక్తనా శృతినా

జూన్ నెలకు వాయిదా వేసుకున్న పెద్ది చివరి ఘట్టంకు వచ్చేసింది. ఐటెం సాంగ్ తీస్తే గుమ్మడికాయ కొట్టొచ్చు. దర్శకుడు బుచ్చిబాబు…

1 hour ago

మాజీ సీఎం నాదెండ్ల భాస్కర రావు ఇక లేరు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర రావు(90) ఇక లేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో సతమతం అవుతున్న నాదెండ్ల…

2 hours ago

వైసీపీ అనంతబాబు కథ ముగిసినట్టేనా?

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఇక జైలు ఊచలు లెక్కపెట్టక తప్పేలా లేదు. ఎందుకంటే...తన వద్ద డ్రైవర్ గా పనిచేస్తున్న సుబ్రహ్మణ్యం అనే…

3 hours ago

నయనతార ఛాయిస్ ఎందుకు మారింది

ప్రస్తుతం మంచి ఊపులో షూటింగ్ జరుపుకుంటున్న బాలకృష్ణ - గోపీచంద్ మలినేని మూవీలో ముందు తీసుకున్న హీరోయిన్ నయనతార. ఇది…

4 hours ago