Political News

లడ్డూ వివాదాన్ని కోర్టుకు వదిలేస్తేనే బెటరా?

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యిని వినియోగించిన వ్యవహారం రాజకీయంగా రచ్చ రేపిన విషయం తెలిసిందే. దీనిపై సుప్రీంకోర్టు నియమించిన సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు చార్జిషీట్‌ను కూడా దాఖలు చేశారు. ప్రస్తుతం ఇది నెల్లూరు ఏసీబీ కోర్టు పరిధిలో ఉంది. అయినప్పటికీ నివేదిక వెలుగు చూడడంతో రాజకీయంగా వైసీపీ వర్సెస్ కూటమి పార్టీల మధ్య ఈ వ్యవహారం రాజకీయ రచ్చకు దారితీసింది.

అయితే దీనిని పొడిగించడం ఆపేయాలని, ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి మేలు చేసేలా గత 19 మాసాల్లో చేసిన పనులను సభా వేదికగా ప్రస్తావించాలని సీఎం స్థాయిలో నిర్ణయించారు. ఇప్పటి వరకు జరిగినది ఎలా ఉన్నా ఇక నుంచి మాత్రం లడ్డూ వ్యవహారంపై నెల్లూరు కోర్టు సహా సుప్రీంకోర్టు తేల్చే వరకు మౌనంగా ఉండాలని పార్టీ నాయకులకు, శ్రేణులకు కూడా సమాచారం చేరవేశారు.

ఇలా లడ్డూ వ్యవహారంపై మౌనంగా ఉండడానికి రెండు కారణాలు ఉన్నట్టు తెలుస్తోంది.

టీడీపీ, జనసేన కంటే కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. దీనిని దీటుగా ఎదుర్కొనే ప్రయత్నం చేస్తున్నా ఒకింత అధికార పక్షం వెనుకబడిందన్న చర్చ ఉంది. ఈ నేపథ్యంలో ఈ విషయాన్ని ఇప్పటితో వదిలేయడంతో పాటు, ఎలానూ ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించిన దరిమిలా కోర్టు ఇచ్చే ఆదేశాలకు అనుగుణంగా తదుపరి చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు.

పదేపదే ఈ వ్యవహారాన్ని ప్రజల మధ్యకు తీసుకువెళ్లినా అనుకున్నంత ప్రచారం రాలేదు. చర్చ కూడా జరగడం లేదు. ధార్మిక సంఘాలు స్పందించినా మొక్కుబడిగానే ముందుకు సాగారు. ఈ నేపథ్యంలో లడ్డూ వ్యవహారాన్ని ఇక తెగేదాకా లాగరాదని నాయకులు నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న చంద్రబాబు ఇక నుంచి ఎవరూ మాట్లాడవద్దని మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలపైనే ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ఆయన ఆదేశించారు.

This post was last modified on February 11, 2026 5:22 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

టీవీ సౌండ్ హఠాత్తుగా ఆగిపోయిందే

మొన్న శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీకి ప్రమోషన్లయితే ఘనంగా జరిగాయి. ఈవెంట్లు, ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు అన్నీ చేశారు. నిర్మాత…

6 minutes ago

ఎన్టీఆర్ నీల్… ఇంకో ఏడాది ఆలస్యంగా

అనుకున్నంతా అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ ఈ ఏడాది రావడం లేదు.…

28 minutes ago

కొత్త ‘మహావతారం’పై విమర్శలేల?

గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘మహావతార నరసింహా’నే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన…

2 hours ago

అన్నీ కారుణ్యాలే అయితే ప్రతిభావంతులు ఏం చెయ్యాలి?

రాష్ట్రంలో కారుణ్య నియామకాల అమలు విధానంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నియంత్రణ లేకుండా పెరుగుతున్న ఈ…

3 hours ago

30 కోట్ల‌తో సీనియ‌ర్ నిర్మాత సాహ‌సం

తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో సుదీర్ఘ కాలంగా నిర్మాత‌గా ఉన్నారు చ‌ద‌ల‌వాడ శ్రీనివాస‌రావు. 90వ ద‌శ‌కంలోనే దివంగ‌త న‌టుడు శోభ‌న్ బాబు…

3 hours ago

రౌడీ కోసం నాని వస్తే… అంత విశేషమా?

ఒక స్టార్ హీరో సినిమా ప్రారంభోత్సవం జరుగుతుంటేనో లేదా ప్రి రిలీజ్ ఈవెంట్ ఏర్పాాటు చేస్తేనో.. ఇంకో స్టార్ హీరో…

6 hours ago