Political News

లడ్డూ వివాదాన్ని కోర్టుకు వదిలేస్తేనే బెటరా?

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యిని వినియోగించిన వ్యవహారం రాజకీయంగా రచ్చ రేపిన విషయం తెలిసిందే. దీనిపై సుప్రీంకోర్టు నియమించిన సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు చార్జిషీట్‌ను కూడా దాఖలు చేశారు. ప్రస్తుతం ఇది నెల్లూరు ఏసీబీ కోర్టు పరిధిలో ఉంది. అయినప్పటికీ నివేదిక వెలుగు చూడడంతో రాజకీయంగా వైసీపీ వర్సెస్ కూటమి పార్టీల మధ్య ఈ వ్యవహారం రాజకీయ రచ్చకు దారితీసింది.

అయితే దీనిని పొడిగించడం ఆపేయాలని, ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి మేలు చేసేలా గత 19 మాసాల్లో చేసిన పనులను సభా వేదికగా ప్రస్తావించాలని సీఎం స్థాయిలో నిర్ణయించారు. ఇప్పటి వరకు జరిగినది ఎలా ఉన్నా ఇక నుంచి మాత్రం లడ్డూ వ్యవహారంపై నెల్లూరు కోర్టు సహా సుప్రీంకోర్టు తేల్చే వరకు మౌనంగా ఉండాలని పార్టీ నాయకులకు, శ్రేణులకు కూడా సమాచారం చేరవేశారు.

ఇలా లడ్డూ వ్యవహారంపై మౌనంగా ఉండడానికి రెండు కారణాలు ఉన్నట్టు తెలుస్తోంది.

టీడీపీ, జనసేన కంటే కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. దీనిని దీటుగా ఎదుర్కొనే ప్రయత్నం చేస్తున్నా ఒకింత అధికార పక్షం వెనుకబడిందన్న చర్చ ఉంది. ఈ నేపథ్యంలో ఈ విషయాన్ని ఇప్పటితో వదిలేయడంతో పాటు, ఎలానూ ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించిన దరిమిలా కోర్టు ఇచ్చే ఆదేశాలకు అనుగుణంగా తదుపరి చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు.

పదేపదే ఈ వ్యవహారాన్ని ప్రజల మధ్యకు తీసుకువెళ్లినా అనుకున్నంత ప్రచారం రాలేదు. చర్చ కూడా జరగడం లేదు. ధార్మిక సంఘాలు స్పందించినా మొక్కుబడిగానే ముందుకు సాగారు. ఈ నేపథ్యంలో లడ్డూ వ్యవహారాన్ని ఇక తెగేదాకా లాగరాదని నాయకులు నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న చంద్రబాబు ఇక నుంచి ఎవరూ మాట్లాడవద్దని మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలపైనే ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ఆయన ఆదేశించారు.

This post was last modified on February 11, 2026 5:22 pm

Share

Recent Posts

జంతర్ మంతర్ కు చెక్ ?

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…

2 hours ago

సత్య హాస్యం చాలా ప్లస్ అవుతోంది

గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…

2 hours ago

వెంక‌ట‌ప్ప ఫెయిల్… ఇక మాలిక్ ఏం చేస్తాడో?

తెలుగు సినిమా చ‌రిత్ర‌లోనే అత్యంత గొప్ప న‌టుల జాబితా తీస్తే.. అందులో పైవ‌రుస‌లో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒక‌రు.…

3 hours ago

పీకే ఇక ఎమ్మెల్యే సాబ్!

ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…

4 hours ago

వ్య‌క్తి చ‌నిపోతే… కేసు మూసేయొచ్చు: ఉండ‌వ‌ల్లి కేసుపై సుప్రీంకోర్టు

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన ఓ కీల‌క కేసు విష‌యంలో సుప్రీంకోర్టు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. వ్య‌క్తి చ‌నిపోయిన త‌ర్వాత‌.. కేసును…

4 hours ago

డాటరాఫ్ రవీనా… ఫలితం కూడా అదేనా

టాలీవుడ్ విచిత్రాలు కొన్ని భలే అనిపిస్తాయి. కాకతాళీయమే అయినా అదేదో రాసిపెట్టి జరగడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇటీవలే విడుదలైన శ్రీనివాస…

4 hours ago