Political News

లడ్డూ వివాదాన్ని కోర్టుకు వదిలేస్తేనే బెటరా?

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యిని వినియోగించిన వ్యవహారం రాజకీయంగా రచ్చ రేపిన విషయం తెలిసిందే. దీనిపై సుప్రీంకోర్టు నియమించిన సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు చార్జిషీట్‌ను కూడా దాఖలు చేశారు. ప్రస్తుతం ఇది నెల్లూరు ఏసీబీ కోర్టు పరిధిలో ఉంది. అయినప్పటికీ నివేదిక వెలుగు చూడడంతో రాజకీయంగా వైసీపీ వర్సెస్ కూటమి పార్టీల మధ్య ఈ వ్యవహారం రాజకీయ రచ్చకు దారితీసింది.

అయితే దీనిని పొడిగించడం ఆపేయాలని, ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి మేలు చేసేలా గత 19 మాసాల్లో చేసిన పనులను సభా వేదికగా ప్రస్తావించాలని సీఎం స్థాయిలో నిర్ణయించారు. ఇప్పటి వరకు జరిగినది ఎలా ఉన్నా ఇక నుంచి మాత్రం లడ్డూ వ్యవహారంపై నెల్లూరు కోర్టు సహా సుప్రీంకోర్టు తేల్చే వరకు మౌనంగా ఉండాలని పార్టీ నాయకులకు, శ్రేణులకు కూడా సమాచారం చేరవేశారు.

ఇలా లడ్డూ వ్యవహారంపై మౌనంగా ఉండడానికి రెండు కారణాలు ఉన్నట్టు తెలుస్తోంది.

టీడీపీ, జనసేన కంటే కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. దీనిని దీటుగా ఎదుర్కొనే ప్రయత్నం చేస్తున్నా ఒకింత అధికార పక్షం వెనుకబడిందన్న చర్చ ఉంది. ఈ నేపథ్యంలో ఈ విషయాన్ని ఇప్పటితో వదిలేయడంతో పాటు, ఎలానూ ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించిన దరిమిలా కోర్టు ఇచ్చే ఆదేశాలకు అనుగుణంగా తదుపరి చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు.

పదేపదే ఈ వ్యవహారాన్ని ప్రజల మధ్యకు తీసుకువెళ్లినా అనుకున్నంత ప్రచారం రాలేదు. చర్చ కూడా జరగడం లేదు. ధార్మిక సంఘాలు స్పందించినా మొక్కుబడిగానే ముందుకు సాగారు. ఈ నేపథ్యంలో లడ్డూ వ్యవహారాన్ని ఇక తెగేదాకా లాగరాదని నాయకులు నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న చంద్రబాబు ఇక నుంచి ఎవరూ మాట్లాడవద్దని మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలపైనే ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ఆయన ఆదేశించారు.

Satya

Recent Posts

గుర్తుకొస్తున్నాయి…: పవన్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్‌తో పాటు కనిపిస్తున్నది…

22 minutes ago

షో క్యాన్సిల్ చేసినందుకు కొరడా దెబ్బ

సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…

24 minutes ago

సిట్ అదుపులో CI నాగరాజు

ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…

1 hour ago

వెంటిలేటర్ పై ఉన్న పద్మనాభం గుర్తు లేరా జగన్?

వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…

1 hour ago

ఓడిన చోటే గెలిచి చూపించింది

శాకుంతలం విడుదలై డిజాస్టరైనప్పుడు దాని ఫలితానికి బాధ్యుడు దర్శకుడు గుణశేఖర్ అయినప్పటికీ టైటిల్ రోల్ పోషించిన సమంత కూడా విమర్శలను…

3 hours ago

చిరు లీక్ చేశాడు… నందిని కన్ఫమ్ చేసింది

మెగాస్టార్ చిరంజీవి సినిమా రహస్యాలను లీక్ చేయడంలో ఫేమస్ అన్న సంగతి తెలిసిందే. ‘ఆచార్య’ సినిమా టైటిల్‌ను అనుకోకుండా రివీల్…

4 hours ago