ఇండియాలో వెబ్ సిరీస్లు చేయడంలో బాలీవుడ్ స్టార్లు ముందు నుంచి చురకే. ట్రెండును అందిపుచ్చుకుంటూ సైఫ్ అలీఖాన్, షాహిద్ కపూర్, అభిషేక్ బచ్చన్, మనోజ్ బాజ్పేయి సహా చాలామంది ప్రముఖ నటులు ముఖ్య పాత్రల్లో వెబ్ సిరీస్లు చేశారు. ఇంకా ఆ ఒరవడి కొనసాగుతోంది.
ఐతే దక్షిణాది స్టార్లు మాత్రం డిజిటల్ ఎరేనాను ఇంకా కొంచెం తక్కువగా చూస్తున్నారనే చెప్పాలి. ఇక్కడ విక్టరీ వెంకటేష్, రానా నాయుడు, నాగచైతన్య లాంటి కొందరు స్టార్లు మాత్రమే వెబ్ సిరీస్ల్లో నటించారు. వెంకీ-రానా కలిసి ‘రానా నాయుడు’లో నటిస్తే.. చైతూ ‘ధూత’ చేశాడు. ఐతే ఇప్పుడు పరిస్థితి మారుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.
యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం ఒక వెబ్ సిరీస్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మాస్ రాజా రవితేజ సైతం ఈ రూట్లో నడవబోతున్నట్లు ఒక క్రేజీ రూమర్ వినిపిస్తోంది.
ఈలోపే మరో యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ తాను డిజిటల్ వరల్డ్లోకి అడుగు పెడుతున్నట్లు ప్రకటించాడు. ఒక ప్రముఖ ఓటీటీ కోసం తాను వెబ్ సిరీస్ చేయనున్నట్లు తన కొత్త చిత్రం ‘స్వయంభు’ టీజర్ లాంచ్ కార్యక్రమంలో నిఖిల్ వెల్లడించాడు. త్వరలోనే పూర్తి వివరాలు ప్రకటిస్తానని చెప్పాడు.
తన కెరీర్లో ‘స్వయంభు’ చాలా స్పెషల్ ఫిలిం అన్న నిఖిల్.. ‘కార్తికేయ-2’తో పాన్ ఇండియా సక్సెస్ అందుకున్నాక, తన మీద ఉన్న అంచనాలను నిలబెట్టుకునేందుకు చాలా గ్యాప్ తీసుకుని, ఎంతో శ్రమించి ఈ సినిమా చేసినట్లు తెలిపాడు.
‘స్వయంభు’ సినిమా చాలా ఆలస్యం అయిందని.. విడుదల కూడా వాయిదా పడింది, అదంతా క్వాలిటీ కోసమే అని నిఖిల్ తెలిపాడు. ‘స్వయంభు’ రెండు భాగాలుగా తెరకెక్కుతున్న విషయాన్ని ఈ సందర్భంగా అతను వెల్లడించాడు. సినిమాలో ఇంకా చాలా విశేషాలు ఉన్నాయని.. దాచిపెట్టామని.. సందర్భానుసారంగా అన్నీ ప్రేక్షకులతో పంచుకుంటామని నిఖిల్ అన్నాడు.
This post was last modified on February 11, 2026 6:07 pm
నాని ది ప్యారడైజ్ షూటింగ్ చివరి ఘట్టానికి వచ్చేసింది. ఇంకో వారం పది రోజుల్లో గుమ్మడికాయ కొట్టేలా ఉన్నారు. కీర్తి…
దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న పరిణామాలను గమనిస్తే.. ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇమేజ్కు యువత పెద్ద ఎత్తున…
సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయకృష్ణ డెబ్యూ ఫలితం తేలిపోయింది. కుర్రాడి నటనకు కాసిన్ని ప్రశంసలు దక్కినప్పటికీ కంటెంట్ పరంగా…
త్వరలోనే ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు తెరదీయనున్నారు. సెప్టెంబరు-అక్టోబరు మధ్య మునిసిపాలిటీ… నవంబరు-డిసెంబరు మధ్య కార్పోరేషన్లు, జనవరిలో పంచాయతీ ఎన్నికలు…
శ్రీలంకతో జరగబోయే రెండు టెస్టుల సిరీస్ నుంచి బుమ్రా గాయం కారణంగా తప్పుకున్నాడు. అయితే అతని స్థానంలో సీనియర్ బౌలర్…
ప్రధాని నరేంద్ర మోదీ వీడియోను ఫేస్బుక్ నుంచి తొలగించిన వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. సోషల్ మీడియా దిగ్గజం మెటా…