Political News

వైసీపీ మతాన్ని వాడుకుంటుందా? పవన్ ఏమన్నారు?

వైసీపీ నేత‌లు, ఆ పార్టీ వ్య‌వ‌హారంపై డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్ర‌ధానంగా రెండు విష‌యాల‌ను ఆయ‌న ప్ర‌స్తావించారు. గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగిస్తున్న స‌మ‌యంలో వైసీపీ స‌భ్యులు రాజ‌కీయ నినాదాలు చేయ‌డాన్ని త‌ప్పుబ‌ట్టారు. అంతేకాదు.. స‌భ‌లో అల‌జ‌డి సృష్టించేందుకు ప్ర‌యత్నించార‌ని కూడా వ్యాఖ్యానించారు. ఈ విష‌యాన్ని స్పీక‌ర్ అయ్య‌న్న పాత్రుడు సీరియ‌స్‌గా తీసుకోవాల న్నారు.

ఇక‌, మ‌తాన్ని సైతం.. రాజ‌కీయంగా వాడుకునేందుకు వైసీపీ కుట్ర‌లు చేస్తోంద‌ని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు. ఈ విష‌యంలో ఎంత‌కైనా తెగించేందుకు సాహ‌సిస్తార‌ని చెప్పిన ప‌వ‌న్‌.. అధికార కూట‌మి పార్టీలు, ఆయా పార్టీల నాయ‌కులు కూడా అత్యంత అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు. బుధ‌వారం ప్రారంభ‌మైన అసెంబ్లీ స‌మావేశాల్లో తొలిరోజు గ‌వ‌ర్న‌ర్ అబ్దుల్ న‌జీర్ ప్ర‌సంగించారు. అనంత‌రం.. స‌భ‌ను వాయిదా వేశారు. ఈ క్ర‌మంలోనే ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. సీఎం చంద్ర‌బాబు స‌హా భేటీ అయ్యారు.

స‌భ‌లో వ్య‌వ‌హ‌రించాల్సిన విధానం.. ఏయే అంశాల‌ను లేవ‌నెత్తాలి?  అనే విష‌యాల‌పై సీఎం చంద్ర‌బాబు చ‌ర్చించారు. ఈ క్ర‌మంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ మాట్లాడుతూ.. అసెంబ్లీలో ర‌చ్చ చేసేందుకు వైసీపీ వ్యూహాత్మ‌కంగా ఎదురు దాడి చేసే అవ‌కాశం ఉంద‌న్నారు.

ముఖ్యంగా తిరుమ‌ల ల‌డ్డూ ప్ర‌సాదాన్ని అప‌విత్రం చేసింది కాక‌.. దీనిని త‌మ రాజ‌కీయాల‌కు అనుగుణంగా వినియోగించుకునే అవ‌కాశం ఉందని ప‌వ‌న్ హెచ్చ‌రించారు. ఈ క్ర‌మంలో కూట‌మి పార్టీల మ‌ధ్య స‌ఖ్య‌త ముఖ్య‌మని ఆయ‌న వ్యాఖ్యానించారు. ఏ విష‌యంలో అయినా.. క‌ల‌సి క‌ట్టుగా ఎదుర్కొనేందుకు.. రాజ‌కీయంగా ఉమ్మ‌డిగా నిల‌బ‌డేందుకు సిద్ధంగా ఉండాల‌ని ఆయ‌న సూచించారు.

This post was last modified on February 11, 2026 6:17 pm

Share

Recent Posts

దండోరా దర్శకుడు భలే షాకిచ్చాడే

ప్రతి దర్శకుడూ తన అరంగేట్ర చిత్రంతోనే తన స్టైల్ ఏంటో, మున్ముందు ఎలాంటి సినిమాలు తీయబోతున్నానో ఒక సంకేతం ఇచ్చేస్తాడు. తొలి సినిమాను…

1 minute ago

సుమంత్ కోరుకున్న ఫలితం దక్కిందా

ఒకప్పుడు అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోగా సుమంత్ కు మంచి ఫాలోయింగ్ ఉండేది. సత్యం, గౌరీ, గోదావరి లాంటి…

1 hour ago

దేవిశ్రీ మళ్లీ విజృంభించబోతున్నాడా?

సౌత్ ఇండియన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన దేవిశ్రీ ప్రసాద్ వయసు ప్రస్తుతం 46 ఏళ్లు. కానీ ఇంతలోనే అతను 27 ఏళ్ల…

2 hours ago

పట్టు విడువని విక్రమార్కుడిలా…

ఎట్టకేలకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో గెలిచాడు. జులై 30 వ తేదీన బీహార్ ఉప ఎన్నికల్లో బంకీపూర్ నుంచి ఎన్నికల…

3 hours ago

కొవిడ్ మత్తులో మెగా హీరో చేసిన తప్పులు

ఒకపెద్ద సినీ కుటుంబం నుంచి పరిచయం అయ్యే కొత్త హీరో మాస్ ఇమేజ్ కోసమే తపన పడతాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం…

3 hours ago

సహజీవనంలోనూ గృహ హింస కేసుకు ఛాన్స్!

భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…

4 hours ago