వైసీపీ అధినేత జగన్ పరామర్శల యాత్రలు.. కార్యకర్తల ప్రాణాల మీదకి తెస్తున్నాయి. గతంలో గుంటూరులో నిర్వహించిన పరామర్శ యాత్రలో ఒక కార్యకర్త.. జగన్ కాన్వాయ్ కింద పడి మృతి చెందారన్న ఆరోపణలు వచ్చాయి. ఆ నాటి ఘటనపై విచారణ జరుగుతోంది. తాజాగా విజయవాడ శివారులోని ఇబ్రహీంపట్నలోని మాజీ మంత్రి, వైసీపీ నాయకుడు జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్ వెళ్లారు.
ఈ క్రమంలో ఇద్దరు కార్యకర్తలు మృతి చెందారు., జగన్ పర్యటనలో పాల్గొనేందుకు ఎన్టీఆర్ జిల్లా చిల్లక్లలు గ్రామానికి చెందిన పంచాయతీ ప్రెసిడెంట్ రాంబాబు కూడా బయలు దేశారు. ఈయన ద్విచక్ర వాహనంపై వస్తుండగా.. షుగర్ లెవిల్స్ పడిపోయి.. ఒక్కసారిగా కుప్పకూలారు. దీంతో స్పందించిన కార్యకర్తలు.. ఆయనను సమీపంలోని హాస్పిటల్కు తరలించే ప్రయత్నం చేయగా.. అప్పటికే ఆయన మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు.
మరో ఘటనలో..
జగన్ వస్తున్నాడన్న ఆనందంతో.. కార్యకర్తలు కొందరు రోడ్లపై బైకులతో స్టంట్లు చేశారు. ఈ క్రమంలో ఓ కార్యకర్త చేస్తున్న స్టంట్ అదుపు తప్పి.. బైకు వెళ్లి రోడ్డుపై ఉన్న బార్ గేట్ను బలంగా డీ కొట్టింది. ఈ ఘటనలో కార్యకర్త తలకు బలమైన గాయమై.. అక్కడికక్కడే మృతి చెందాడు.
ఇతను ఇబ్రహీంపట్నం కొత్తగేట్కు చెందిన భార్గవ్గా గుర్తించారు. జోగి రమేష్ కుమారుడు రాజీవ్కు స్నేహితుడని ప్రచారం జరుగుతోంది. మొత్తంగా జగన్ పర్యటన అనగానే ఏవొ ఒక మరణాలు చోటు చేసుకుంటున్నాయి.
This post was last modified on February 7, 2026 8:42 am
శ్రియా రెడ్డి అంటే తెలుగు ప్రేక్షకుల్లో చాలామందికి ఇప్పటికీ ‘పొగరు’ సినిమాలోని ఈశ్వరి పాత్ర గుర్తొస్తుంది. విశాల్ హీరోగా వచ్చిన…
ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో, అటు ప్రేక్షకుల్లో జరుగుతున్న చర్చ ఎల్లుండి నుంచి ఇరుముడికి కేటాయించిన చాలా థియేటర్లు టాక్సిక్ కు…
ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత ప్రమాదానికి గురయ్యారు. ఆమె ఎగుర వేసిన డ్రోన్.. కొద్ద దూరం పైకి వెళ్లి…
కుళ్లిపోయిన చికెన్ వ్యర్థాలను చేపలకు ఆహారంగా వినియోగిస్తున్న వ్యవహారం వెలుగులోకి రావడంతో ప్రజారోగ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో…
బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన ఒక ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ అభ్యంతరకరంగా వ్యవహరించడం విమర్శలకు తావిచ్చింది. రాజస్థాన్ లోని ఒక ప్రిన్సిపాల్ విద్యార్థినులతో…
మహారాష్ట్రలో ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు.. చాలామంది చూస్తుండగా, నిమిషాల వ్యవధిలో అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయిన ఘటన ఇప్పుడు సోషల్…