Political News

జగన్ పర్యటనలకు కార్యకర్తలు బలి

వైసీపీ అధినేత జ‌గ‌న్ ప‌రామ‌ర్శ‌ల యాత్ర‌లు.. కార్య‌క‌ర్త‌ల ప్రాణాల మీద‌కి తెస్తున్నాయి. గ‌తంలో గుంటూరులో నిర్వ‌హించిన ప‌రామ‌ర్శ యాత్ర‌లో ఒక కార్య‌క‌ర్త‌.. జ‌గ‌న్ కాన్వాయ్ కింద ప‌డి మృతి చెందార‌న్న ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఆ నాటి ఘ‌ట‌న‌పై విచార‌ణ జ‌రుగుతోంది. తాజాగా విజ‌య‌వాడ శివారులోని ఇబ్ర‌హీంప‌ట్న‌లోని మాజీ మంత్రి, వైసీపీ నాయ‌కుడు జోగి ర‌మేష్ కుటుంబాన్ని ప‌రామ‌ర్శించేందుకు జ‌గ‌న్ వెళ్లారు.

ఈ క్ర‌మంలో ఇద్ద‌రు కార్య‌క‌ర్త‌లు మృతి చెందారు., జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌లో పాల్గొనేందుకు ఎన్టీఆర్ జిల్లా చిల్ల‌క్ల‌లు గ్రామానికి చెందిన పంచాయ‌తీ ప్రెసిడెంట్ రాంబాబు కూడా బ‌య‌లు దేశారు. ఈయ‌న ద్విచ‌క్ర వాహ‌నంపై వ‌స్తుండ‌గా.. షుగ‌ర్ లెవిల్స్ ప‌డిపోయి.. ఒక్క‌సారిగా కుప్ప‌కూలారు. దీంతో స్పందించిన కార్యకర్తలు.. ఆయ‌న‌ను స‌మీపంలోని హాస్పిట‌ల్‌కు త‌ర‌లించే ప్ర‌య‌త్నం చేయ‌గా.. అప్ప‌టికే ఆయ‌న మృతి చెందిన‌ట్టు వైద్యులు తెలిపారు.

మ‌రో ఘ‌ట‌న‌లో..

జ‌గ‌న్ వ‌స్తున్నాడ‌న్న ఆనందంతో.. కార్య‌క‌ర్త‌లు కొంద‌రు రోడ్ల‌పై బైకుల‌తో స్టంట్లు చేశారు. ఈ క్ర‌మంలో ఓ కార్య‌క‌ర్త చేస్తున్న స్టంట్ అదుపు త‌ప్పి.. బైకు వెళ్లి రోడ్డుపై ఉన్న బార్ గేట్‌ను బ‌లంగా డీ కొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో  కార్య‌క‌ర్త త‌ల‌కు బ‌ల‌మైన గాయ‌మై.. అక్క‌డిక‌క్క‌డే మృతి చెందాడు.

ఇత‌ను ఇబ్రహీంపట్నం కొత్తగేట్‌కు చెందిన భార్గవ్‌గా గుర్తించారు. జోగి ర‌మేష్ కుమారుడు రాజీవ్‌కు స్నేహితుడని ప్ర‌చారం జ‌రుగుతోంది. మొత్తంగా జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న అన‌గానే ఏవొ ఒక మ‌ర‌ణాలు చోటు చేసుకుంటున్నాయి.

This post was last modified on February 7, 2026 8:42 am

Share
Show comments
Published by
Kumar
Tags: Jagan

Recent Posts

అమ‌రావ‌తిలో అద్భుతం… `క్వాంట‌మ్` కేంద్రానికి ముహూర్తం!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో అద్భుత ఘ‌ట్టానికి ముహూర్తం ఖ‌రారైంది. శ‌నివారం ఇక్క‌డ క్వాంట‌మ్ కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్ట‌నున్నారు.…

1 hour ago

ల‌డ్డూ వివాదం: ఆర్ ఎస్ ఎస్ స‌హా ధార్మిక సంస్థ‌లు ఏమ‌య్యాయి!?

రాముడిని ఎవ‌రైనా కామెంట్ చేసినా.. కృష్ణుడిపై ఎవ‌రైనా వ్యంగ్య చిత్రాలు రూపొందించినా..విరుచుకుప‌డే ధార్మిక సంస్థ‌లు.. ఇప్పుడు ఏమ‌య్యాయి? ఎక్క‌డున్నాయి. ఏపీ…

4 hours ago

ఇక ‘నెంబర్ వన్’ హీరోయిన్ లేనట్టేనా?

ఒక సినిమాకు హీరో ఎంత అవసరమో హీరోయిన్ కూడా అంతే అవసరం ఉంటుంది. కొన్ని సినిమాల్లో కథానాయిక ప్రాధాన్యత ఎక్కువ…

7 hours ago

విమానాల్లో లోపాలు.. ఎయిర్ ఇండియా, ఇండిగో టాప్!

మన దేశంలోని విమానయాన సంస్థలకు చెందిన విమానాల్లో భద్రతపై ఆందోళన కలిగించే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల…

7 hours ago

‘కేసీఆర్ కుటుంబాన్ని కిషన్ రెడ్డి కాపాడుతున్నారు’

బీజేపీ సీనియ‌ర్ నేత‌, కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ గంగాపురం కిష‌న్ రెడ్డిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర…

7 hours ago

మిస్సింగ్ కేసులు.. లండన్, అమెరికా కంటే మనమే బెటర్ అంట!

సాధారణంగా ఢిల్లీ లాంటి పెద్ద నగరాల్లో మనుషులు కనిపించకుండా పోవడం గురించి మనం తరచుగా వింటూనే ఉంటాం. అయితే ఇటీవల…

11 hours ago